స్వల్ప లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:26 గంటల సమయంలో సెన్సెక్స్ 36 పాయింట్ల లాభంతో 66,054 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 14 పాయింట్లు పెరిగి 19,816 దగ్గర కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు మార్కెట్లను లాభాల బాట పట్టించాయి. ఎన్టీపీసీ, ఎంఅండ్ఎం, సన్ఫార్మా, పవర్గ్రిడ్, అల్ట్రాటెక్ సిమెంట్స్, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.