ముంబై వదిలి ఆర్సీబీకి బుమ్రా?
టీమిండియా బౌలర్ బుమ్రా ముంబై ఇండియన్స్ను వీడనున్నాడనే ఊహాగానాలు వస్తున్నారు. ఈ నేపథ్యంలో బుమ్రా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కలకలం రేపింది. ‘కొన్నిసార్లు మౌనంగా ఉండడమే సరైన జవాబు’ అంటూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో బుమ్రా పోస్ట్ పెట్టాడు. దీంతో అతడు ముంబై వదిలి ఆర్సీబీకి వెళ్లిపోయే అవకాశముందని కొందరు అభిప్రాయపడ్డారు. ఐపీఎల్ కెరీర్ ఆరంభం (2015) నుంచి బుమ్రా, ముంబై ఇండియన్స్తో ఉన్నాడు.