• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కృష్ణను తలచుకుని రాధ ఎమోషనల్

    ఇటీవల కన్నుమూసిన సూపర్‌స్టార్ కృష్ణను తలచుకుని అలనాటి తార రాధ కన్నీరు పెట్టుకున్నారు. తాజాగా ఓ షోలో గెస్ట్‌గా హాజరైన రాధ.. కృష్ణను గుర్తు చేసుకుని [ఎమోషనల్](url) అయ్యింది. ఆయన అకాల మరణం తనను కలచివేసిందని, ఆయనను ఎంతగానో మిస్ అవుతున్నానని చెప్పింది. ‘ఐ రియల్లీ లవ్ హిమ్’ అంటూ పేర్కొంది. కాగా కృష్ణతో కలసి రాధ దాదాపు 10 చిత్రాల్లో నటించింది. సింహాసనం, అగ్నిపర్వతం, ముగ్గురు కొడుకులు, పల్నాటి సింహం వంటి చిత్రాల్లో కృష్ణ సరసన రాధ నటించింది. Senior heroine #Radha … Read more

    అలీ కూతురి అప్పగింతలు చూశారా?

    ఇటీవల కమెడియన్ అలీ కూతురు ఫాతిమా వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వివాహ వేడుకకు సినీ, రాజకీయ సెలబ్రిటీలు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ క్రమంలో ఫాతిమా అప్పగింతల కార్యక్రమంలో అలీ, జుబేదా దంపతులు కన్నీటి పర్యంతమయ్యారు. తమ కూతురును మెట్టింనింటికి పంపుతూ భావోద్వేగానికి గురయ్యారు. అటు వధువు ఫాతిమా కూడా తన తల్లిదండ్రులను వదలి వెళ్తూ ఎమోషనల్ అయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

    ఏపీ సీఎం జగన్ ఎమోషనల్

    ఏపీ సీఎం వైఎస్ జగన్ ఎమోషనల్ అయ్యారు. టీటీడీ ఈఓ ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళిరెడ్డి గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నంద్యాల జిల్లాలోని పారుమంచాలలో ధర్మారెడ్డి కుటుంబసభ్యులను వైఎస్ జగన్ ఓదార్చారు. కొడుకు మరణంతో దుఖిస్తున్న ధర్మారెడ్డిని చూసి జగన్ కూడా ఎమోషనల్ అయ్యారు. కాగా మరో నెలలో పెళ్లి జరగాల్సి ఉండగా చంద్రమౌళి చనిపోవడంతో కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

    మిస్ యూ తాతయ్య; గౌతమ్ భావోద్వేగం

    తన తాత సూపర్‌స్టార్ కృష్ణ మృతితో గౌతమ్ ఘట్టమనేని ఎమోషనల్ అయ్యాడు. ఈ క్రమంలో తన తాతతో కలసి దిగిన ఓ ఫోటోను ఇన్‌స్టాలో పంచుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు. ‘‘మీరు ఎక్కడ ఉన్నా నేను ప్రేమిస్తూనే ఉంటా. నువ్వు కూడా నన్ను ప్రేమిస్తూనే ఉంటావని తెలుసు. మిస్ యూ తాతయ్య’’ అంటూ పోస్ట్ చేశాడు. కాగా ఇటీవల గుండెపోటుతో సూపర్‌స్టార్ కృష్ణ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో ఘట్టమనేని ఫ్యామిలీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

    ఒకే ఒక జీవితం చూసి నాగార్జున కంట‌త‌డి

    శ‌ర్వానంద్ హీరోగా న‌టించిన ‘ఒకే ఒక జీవితం’ మూవీ సెప్టెంబ‌ర్ 9న రిలీజ్ కాబోతుంది. ఈ సంద‌ర్భంగా నేడు చిత్ర‌బృందం స్పెష‌ల్ స్కీనింగ్ చూసింది. వారితో పాటు నాగార్జున‌, అమ‌ల‌, శ‌ర్వానంద్ కుటుంబ‌స‌భ్యులు అంద‌రూ క‌లిసి సినిమాను చూశారు. నాగార్జున మాట్లాడుతూ నాకు మా అమ్మ గుర్తొచ్చిందంటూ ఎమోష‌న‌ల్ అయ్యారు. అంద‌రూ కంట‌త‌డితో బ‌య‌ట‌కు రావ‌డం చూడ‌వ‌చ్చు. అమ్మ మీద ప్రేమ ఉన్న ప్ర‌తి ఒక్క‌రికి ఈ సినిమా కనెక్ట్ అవుతుంద‌ని చెప్తున్నారు.

    ఇంట‌ర్వ్యూ మ‌ధ్య‌లో విజ‌య్‌ని ప‌ట్టుకొని ఏడ్చేసిన ఛార్మీ

    విజ‌య్‌దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన మూవీ ‘లైగ‌ర్’. పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.. పూరీ కనెక్ట్స్ బ్యాన‌ర్‌పై ఛార్మీ దీనికి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించింది. అయితే ఫ్యాన్స్ త‌ర‌ఫున ఛార్మీ కొన్ని ప్ర‌శ్న‌ల‌ను పూరీ, విజ‌య్‌ను అడిగింది. ఆ త‌ర్వాత నిర్మాత‌గా లాక్‌డౌన్ స‌మ‌యంలో ఎన్ని ఆర్థిక క‌ష్టాలు అధిగ‌మించారో చెప్పుకొచ్చింది. ఆ స‌మ‌యంలో ఓటీటీ నుంచి మంచి ఆఫ‌ర్ వ‌చ్చిన‌ప్ప‌టికీ ధైర్యం చేసి థియేట‌ర్‌లోనే విడుద‌ల చేస్తామ‌ని చెప్ప‌డానికి రెండే కార‌ణాలు ఉన్నాయి. అందులో ఒక‌టి విజ‌య్ దేవ‌ర‌కొండ‌, మ‌రోటి సినిమా కంటెంట్ అని చెప్పింది. … Read more