• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ప్రజలకు ఆ హక్కు లేదు: కేంద్రం

    రాజకీయ పార్టీలకు విరాళాలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకొనే హక్కు ఓటర్లకు లేదని కేంద్రం తెలిపింది. ఈ మేరకు అటార్నీ జనరల్‌ సుప్రీంకోర్టుకు తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ‘సరైన వ్యక్తిని ఎన్నుకొనేందుకు అభ్యర్థుల పూర్వాపరాలు తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది. కానీ, ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకునే హక్కు వారికి లేదు. రాజ్యాంగపరమైన చట్టం లేనందున ఎలక్టోరల్‌ బాండ్ల స్కీమ్‌ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. దాతల వివరాలు గోప్యంగా ఉంచడానికి ఇది దోహదం చేస్తుంది’ అని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

    కవిత కేసులో సుప్రీంకోర్టుకు వెళ్లిన ఈడీ

    ఎమ్మెల్సీ కవిత కేసుకు సంబంధించి ఈడీ అధికారులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. తమ వాదనలు వినకుండా ఎలాంటి నిర్ణయాలు వెల్లడించరాదని ధర్మాసనాన్ని కోరారు. ఈ కేసుకు సంబంధించి ఎలాంటి ముందస్తు ఆదేశాలు ఇవ్వరాదని అభ్యర్థించారు. కాగా ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఈ నెల 24న సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. కాగా అంతకుముందే ఈ నెల 20న మరోమారు ఈడీ విచారణకు కవిత హాజరుకానుంది.