• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పాక్‌ను చిత్తు చేసిన భారత్

    ఆసియా గేమ్స్‌- హాకీలో పాకిస్తాన్‌పై 10-2 గోల్స్ తేడాతో భారత హాకీ జట్టు గెలుపొందింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ హ్యాట్రిక్ గోల్స్‌తో పాక్‌ను చిత్తు చేశారడు. తాజా విజయంతో గ్రూప్‌ ఏలో టీమిండియా అగ్రస్థానంలో ఉంది. ఇప్పటివరకు ఆసియా గేమ్స్‌లో భారత్‌కు 10 స్వర్ణాలు, 14 రజతాలు, 14 కాంస్యాలు లభించాయి. దీంతో పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. 216 పతకాలతో చైనా ఫస్ట్ ప్లేస్‌లో ఉంది.

    శ్రీవారి దర్శనానికి 24 గంటలు

    తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల వరకు సమయం పడుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్సుల్లోని అన్నీ కంపార్టుమెంట్లు నిండి కల్యాణవేదిక వరకు భక్తులు వేచిఉన్నారు. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 87,081 మంది భక్తులు దర్శించుకున్నారు. మరో 41,575 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. శనివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.05 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

    ఈరోజు, రేపు వర్షాలు

    వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈమేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ఈరోజు రేపు హైదరాబాద్ సహా వరంగల్, మహబూబాబాద్, కరీంనగర్, ఖమ్మం, సిద్ధిపేట జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడనున్నట్లు అంచనా వేసింది.

    చంద్రబాబుపై మరో కేసు

    చంద్రబాబుపై వరుస కేసులు పెడుతూ వైసీపీ శ్రేణులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాజాగా ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు పేరును చేర్చాలని సుప్రీంకోర్టును మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఆశ్రయించారు. తెలంగాణ ఏసీబీ ఛార్జిషీట్‌లో 22 సార్లు చంద్రబాబు పేరు ప్రస్తావన ఉందని గుర్తు చేశారు. ఈ కేసు విచారణ పురోగతిపై ఆరా తీయ్యాలని కోర్టును కోరారు. అక్టోబరు 3న ఈ కేసును సుప్రీంకోర్టు విచారించనుంది. ఇప్పటికే స్కిల్ స్కాం, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుల్లో చంద్రబాబు ముద్దాయిగా ఉన్నారు.

    తెలంగాణకు నేడు ప్రధాని మోదీ

    తెలంగాణకు నేడు ప్రధాని మోదీ రానున్నారు. మహబూబ్‌నగర్‌లో తెలంగాణ బీజేపీ ర్యాలీలో ప్రసంగించనున్నారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘బీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ ప్రజలు విసిగిపోయారు. కాంగ్రెస్‌పై కూడా తెలంగాణ ప్రజలకు నమ్మకం లేదు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ రెండూ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యం లేని కుటుంబ పార్టీలు’ అంటూ విమర్శించారు.

    రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డు

    తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతి గాంచిన బాలాపూర్ లడ్డు వేలం ఈసారి కూడా రికార్డు ధర పలికింది. తుర్కయాంజల్‌కు చెందిన దయానంద్ రెడ్డి రూ.27 లక్షలకు లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్నారు. వేలం పాటలో స్థానికులు, స్థానికేతరులతో కలిపి మొత్తం 56 మంది పాల్గొన్నారు. రూ.1,116తో ప్రారంభమైన లడ్డూ వేలం రూ.27 లక్షల వద్ద ముగిసింది. 1994 నుంచి లడ్డూ వేలం పాట నిరంతరాయంగా కొనసాగుతోంది. తొలిసారి రూ.450కి స్థానిక రైతు కొలను మోహన్ రెడ్డి చేజిక్కించుకున్నారు. https://x.com/NtvTeluguLive/status/1707282234183647687?s=20

    ఐఫోన్ 15 అమ్మలేదని సిబ్బందిపై దాడి

    ఐఫోన్ 15పై ఉన్న క్రేజ్ కొట్లాటకు దారి తీసింది. స్టోర్ సిబ్బందిని ఐఫోన్ ప్రియులు చితకబాదారు. ఈ ఘటన ఢిల్లీలోని క్రోమా స్టోర్‌లో జరిగింది. ఐఫోన్ 15 ప్రో మొబైల్‌ను అమ్మడం కుదరదు అన్నందుకు క్రోమా సిబ్బందిపై దాడి చేసినట్లు తెలిసింది. దీనిపై క్రోమా స్టోర్ స్పందిస్తూ.. స్టాక్ లేకపోవడం వల్లే అమ్మడం లేదని చెప్పుకొచ్చింది. సిబ్బందిపై దాడి చేసినవారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది. https://x.com/TeluguScribe/status/1705484270578655478?s=20

    క్షమాపణలు చెప్పిన పోలీస్ జంట

    సోషల్ మీడియాలో తమ ప్రీ వెడ్డింగ్ షూట్ వైరల్ కావడంపై సీపీ ఆనంద్‌కు లేడీ ఎస్సై భావన, ఏఆర్ ఎస్సై రావూరి కిషోర్ క్షమాపణలు చెప్పారు. వ్యక్తిగత వేడుకల్లో యూనిఫాం గౌరవాన్ని నిలబెట్టుకోవాలని సీపీ ఆనంద్ అన్నారు. కొత్త దంపతులు జీవితకాలం ప్రేమతో కలిసి ఉండాలని శుభాకాంక్షలు తెలిపారు. పంజాగుట్ట పీఎస్‌లో విధులు నిర్వహిస్తున్న లేడీ ఎస్సై భావన, ఏఆర్ ఎస్సై రావూరి కిషోర్ చేసుకున్న ప్రీ వెడ్డింగ్ షూట్‌లో యూనిఫాం, ప్రభుత్వ వాహనాలు వాడటంపై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. https://x.com/fpjindia/status/1703795784997822685?s=20

    అసెంబ్లీలో విజిల్స్ వేసిన బాలకృష్ణ

    ఏపీ అసెంబ్లీ నుంచి ఇద్దురు టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. సభలో వీడియోలు తీసినందుకు అచ్నెన్నాయుడు, బి అశోక్‌లను సభా సమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు చంద్రబాబును విడుదల చేయాలని బాలకృష్ణ నిరసన తెలిపారు. సభలో విజిల్స్ వేస్తూ హంగామా సృష్టించారు. స్పీకర్ వారించినా విజిల్స్ ఆపలేదు. https://x.com/DailyCultureYT/status/1705076094767186193?s=20

    అక్కినేని కోసం చొక్కా చింపుకున్నా: మోహన్ బాబు

    అక్కినేని శతజయంతి వేడుకల్లో పాల్గొన్న మోహన్‌బాబు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తిరుపతిలో చదివేటప్పుడు అక్కినేని గారి సినిమా వందరోజుల పంక్షన్‌లో ఆయన్ను చూసేందుకు చొక్కా చింపుకుని మరి వెళ్లాను. నాగేశ్వరరావు గారి మరుపురాని మనిషి సినిమాకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశాను. ఓ సందర్భంలో అన్నపూర్ణమ్మ గారు అక్కినేని గారి ముందు నేను బాగా నటిస్తానని చెప్పారు. అసలే వాడికి పొగరెక్కువ ఎందుకు పొగుడుతున్నావ్ అని కసురుకున్నారు అని చెప్పుకొచ్చారు. https://x.com/NtvTeluguLive/status/1704372184297123899?s=20