• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • యువకుడి పొట్టలో గర్భాశయం

    ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ యువకుడి పొట్టలో గర్భాశయాన్ని గుర్తించారు వైద్యులు. యువకుడి తల్లిదండ్రుల అనుమతితో గర్భాశయాన్ని తొలగించారు. కొద్దిరోజులుగా యువకుడు నిరంతరం కడుపునొప్పితో బాధపడుతుండే వాడు. కాళ్లు కూడా వాపునకు గురయ్యాయి. దీంతో ఆస్పత్రికి వెళ్లగా, పరీక్షించిన డాక్టర్లు అతనిలో గర్భాశయం ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కేసులు 300వరకు నమోదైనట్లు వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.

    శ్రీవారి దర్శనానికి 12 గంటలు

    తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల వరకు సమయం పడతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్సుల్లోని 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 88,623 మంది భక్తులు దర్శించుకున్నారు. మరో 43,934 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఆదివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.67 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

    నేడు జైలులో చంద్రబాబు దీక్ష

    స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్‌కు నిరసనగా టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి జైలులో ఈరోజు నిరశన దీక్ష చేపట్టనున్నారు. సత్యమేవ జయతే పేరుతో ఏపీలోని అన్ని ప్రాంతాల్లో టీడీపీ నేతలు నిరాహార దీక్షలు చేపట్టనున్నారు. మరోవైపు నారా భువనేశ్వరి ఈరోజు రాజమండ్రి క్వారి సెంటర్‌లో నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరసన చేపట్టనున్నారు. అనంతరం ఆమె ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి టీడీపీ ముఖ్యనేతలందరూ పాల్గొంటారు.

    5 నుంచి భువనేశ్వరి బస్సు యాత్ర?

    చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా నారా భువనేశ్వరి బస్సు యాత్ర చేపట్టాలని యోచిస్తున్నారు. ఈనెల 5న కుప్పం నుంచి ప్రారంభించి రాయలసీమ జిల్లాల్లో కొనసాగించాలని ప్రణాళికలు వేస్తున్నారు. ఇన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్న భువనేశ్వరి.. టీడీపీ చేపడుతున్న అన్ని కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటున్నారు. కార్యకర్తల్లో ధైర్యం నింపుతూ ముందుకు సాగుతున్నారు. స్కిల్ స్కాం కేసులో కోర్టు తీర్పును అనుసరించి బస్సు యాత్రకు ప్లాన్ చేయనున్నట్లు తెలిసింది.

    జనసేన-టీడీపీ కూటమికి మద్దతివ్వండి: పవన్

    ఈసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన-టీడీపీ కూటమికి మద్దతు ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజలను కోరారు. నాల్గో విడత వారాహి యాత్రలో ఆయన మాట్లాడుతూ.. ‘స్వయంగా నేను గెలవకున్నా.. నిలబడి పోరాడుతున్నానంటే నా నిబద్ధత ఏంటో అర్థం చేసుకోండి. జనసేన-టీడీపీ కూటమికి మద్దతివ్వండి. మళ్లీ జగనుకు ఓటేస్తే పరుస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. సమస్యలపై మాట్లాడుతోంటే నన్ను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు. అవనిగడ్డ ప్రాంతంలో ఇసుక దోపిడీ వల్ల 76 మంది ప్రాణాలు కొల్పోయారు. ఏపీ భవిష్యత్ కోసం ఈసారి సరైన వ్యక్తులకు … Read more

    టీడీపీ-జనసేనదే అధికారం: పవన్

    వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. ఎన్నికల్లో సీఎం జగన్‌ ఓటమి ఖాయమని జోష్యం చెప్పారు. ‘ డీఎస్‌సీ కోరుకుంటున్న నిరుద్యోగులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. 30 వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ‘యువత భవిష్యత్తు బాగుండాలని ఎప్పుడూ అనుకుంటా. ఈసారి ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధమని జగన్‌ అంటున్నారు. టీడీపీ-జనసేన అధికారంలోకి రావడం ఖాయం’’ అని పవన్‌ ధీమా వ్యక్తం చేశారు.

    వారాహి యాత్రపై పేర్నినాని విమర్శలు

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాల్గో విడత వారాహి యాత్రపై వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. పవన్ యాత్ర కేవలం కాపులు ఎక్కువగా ఉండే ప్రాంతాలకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. కమ్మ, బీసీలు, ఇతర సామాజిక వర్గాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని సరైన టైంలో పవన్‌కు గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. చంద్రబాబుకు సపోర్ట్ చేసి చారిత్రక తప్పిదం చేస్తున్నారని ఆరోపించారు.

    తట్ట పట్టి చెత్త ఎత్తిన ప్రధాని మోదీ

    మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా స్వచ్ఛతాహి కార్యక్రమాలు పెద్దఎత్తున జరుగుతున్నాయి. ‘స్వచ్ఛతాహి సేవా’లో భాగంగా పరిసరాల పరిశుభ్రత కోసం ఓ గంట శ్రమదానం చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఫిట్‌నెస్‌ ట్రైనర్ బైయాన్‌పురియాతో కలిసి ప్రధాని మోదీ శ్రమదానం చేశారు. స్వయంగా చీపురు పట్టి చెత్తను బుట్టల్లోకి ఎత్తారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా ఉంది. https://x.com/narendramodi/status/1708383866711642496?s=20

    కాంగ్రెస్‌కు కీలక నేత రాజీనామా

    మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి రాజీనామా చేశారు. మెదక్ టికెట్ ఆశించిన తిరుపతి రెడ్డి, మైనంపల్లి హనుమంతరావు కుమారుడు.. మైనంపల్లి రోహిత్‌కు టికెట్ ఇస్తారన్న ప్రచారంతో మనస్తాపం చెందారు. ఇన్నాళ్లు పార్టీకి సేవ చేస్తున్న తనను కాదని కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వటం పట్ల అలకబూనారు. అధిష్ఠానంతో చర్చించాక కూడా హామీ దక్కకపోవడంతో తిరుపతి రెడ్డి రాజీనామా చేశారు. భవిష్యత్ కార్యచరణను త్వరలోనే వెల్లడిస్తానని చెప్పారు.

    BIGBOSS7: రతిక రోజ్ ఎలిమినేట్

    బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7లో నాలుగోవారం నామినేషన్లలో భాగంగా రతిక రోజ్ ఎలిమినేట్ అయినట్లు తెలిసింది. నామినేషన్‌లో తేజ, యావర్, గౌతమ్, శుభశ్రీ, ప్రియాంక ఉండగా.. తక్కువ ఓట్లు వచ్చిన రతిక ఎలిమినేట్ అయినట్లు సమాచారం. హౌస్‌లో పల్లవి ప్రశాంత్‌తో లవ్ ట్రాక్ నడిపి.. ఆ తర్వాత అతన్ని చులకనగా మాట్లాడటం, తొలినుంచి సపోర్ట్ చేస్తున్న శివాజికి వెన్నుపోటు పొడవటం వంటివి ఆమె నెగిటివిటిని పెంచాయి. దీంతో రతిక నాల్గోవారం ఎలిమినేట్ అయింది.