• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఏపీలో జనసేన బలం పెరిగింది: పవన్‌

    AP: మచిలీపట్నంలో జరిగిన వారాహి యాత్రలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జనసేన బలం 14% నుంచి 18% పెరిగిందని పేర్కొన్నారు. అంచలంచెలుగా అధికారంలోకి రాగలం తప్ప ఒకేసారి గెలవలేమని స్పష్టం చేశారు. ఒంటరిగా వెళితే అధికారంలో వస్తామా? అనేది తనకు సందేహమేనన్నారు. పొత్తుతో వెళితే బలమైన సీట్లు వస్తాయని అంచనా వేశారు. తద్వారా అసెంబ్లీలో బలమైన పాదముద్ర పడుతుందని జోస్యం చెప్పారు. సీఎం అవుతానా? లేదా? అనేది గెలుపు నిష్పత్తిని బట్టి ఉంటుందని పవన్ అన్నారు.

    ప్రజాధనంపై మాకు ఆశలేదు: భువనేశ్వరి

    AP: తన తండ్రి, భర్త ఇద్దరూ సీఎంలుగా చేసినా తమ కుటుంబం ఎప్పుడూ ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి పాల్పడలేదని చంద్రబాబు భార్య భువనేశ్వరి అన్నారు. రాష్ట్రం, ప్రజల బాగు కోసమే చంద్రబాబు నిత్యం పరితపించేవారన్నారు. స్వాతంత్రం కోసం పోరాటం చేసిన గాంధీజీనే జైలులో పెట్టారని ఆమె గుర్తుచేశారు. తన ఆయుష్షు కూడా పోసుకొని చంద్రబాబు జీవించాలని ప్రార్థించారు. ప్రజాధనంపై తమకు ఎప్పూడు ఆశలేదని, మా కుటుంబ సభ్యులపై ఒక్క కేసు కూడా లేదని భువనేశ్వరి పునరుద్ఘటించారు. నా ఆయుషు కూడా పోసుకుని ఆయన బ్రతకాలి … Read more

    పంజాబ్‌లో హృదయవిదారక ఘటన

    పంజాబ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అదృశ్యమైన ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఇంట్లోనే విగతజీవులుగా కనిపించారు. జలంధర జిల్లాలో పనికోసం వలస వచ్చిన దంపతులకు ఐదుగురు సంతానం. వారు ఆదివారం పనికి వెళ్లి వచ్చేసరికి చిన్నారులు కాంచన (4), శక్తి (7), అమృత (9) ఇంట్లో కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఇంట్లోని ట్రంకు పెట్టెను తెరిచి చూడగా అందులో ముగ్గురు చిన్నారులు చనిపోయి కనిపించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

    జింబాబ్వేలో భారత వ్యాపారి మృతి

    జింబాబ్వేలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో భారత సంతతి వ్యాపారవేత్త, ఆయన కుమారుడు సహా ఆరుగురు మృతి చెందారు. భారత్‌కు చెందిన హర్‌పాల్‌ రంధావా జింబాబ్వేలో రియోజిమ్‌ పేరుతో మైనింగ్ కంపెనీ నిర్వహిస్తున్నారు. శుక్రవారం హర్‌పాల్‌, ఆయన కుమారుడు మరో నలుగురు సిబ్బందితో కలిసి విమానంలో బయలుదేరారు. విమానం మషావా ప్రాంతానికి చేరుకున్న తర్వాత సాంకేతిక లోపంతో కూలిపోయిందని వైమానిక వర్గాలు తెలిపాయి. విమాన ప్రమాద వార్తలను రియోజిమ్‌ కంపెనీ అధికారికంగా ధ్రువీకరించింది.

    చంద్రబాబు గాడ్సే కంటే ఘోరం: రోజా

    AP: చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లపై మంత్రి రోజా ఫైర్‌ అయ్యారు. ప్రజాసొమ్ము దోచుకున్న వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. బాబు గాడ్సేకంటే ఘోరమైన వ్యక్తి అని మండిపడ్డారు. చంద్రబాబు జీవితమే హింసా మార్గమని విమర్శించారు. అటు 15 సీట్లలో పోటీ చేసేందుకు కూడా జనసేనకు అభ్యర్థులు లేరని దుయ్యబట్టారు. పొత్తు పెట్టుకోకుండా పోటీ చేయలేని పార్టీ టీడీపీదని మండిపడ్డారు. సన్యాసీ, సన్యాసీ కలిస్తే బుడిద రాలుతుందని ఎద్దేవా చేశారు.

    ‘చేతులతో సూర్యోదయాన్ని ఆపలేరు’

    తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టును సినీ నటుడు, మాజీ ఎంపీ మురళిమోహన్‌ ఖండించారు. హైదరాబాద్‌లో హైటెక్‌ సిటీ ప్రారంభానికి ఆనాటి అమెరికా అధ్యక్షుడు బిల్‌ గేట్స్‌ను తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుదే అని కొనియాడారు. అలాంటి గొప్ప వ్యక్తిని అక్రమంగా అరెస్టు చేసి జైల్లో నిర్బంధించడం బాధాకరమన్నారు. ఉదయించే సూర్యోదయాన్ని ఆపడానికి చేతులు అడ్డుపెట్టడం మూర్ఖత్వం అవుతుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు బయటకు వస్తారని.. ఆయన సారథ్యంలో ఏపీ అభివృద్ధి జరుగుతుందని మురళీమోహన్ చెప్పారు. మాజీ CM చంద్రబాబు నాయుడి గొప్పతనం మురళి మోహన్ గారి మాటల్లో#ChandrababuNaidu … Read more

    నారాయణకు మరోసారి నోటీసులు

    అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో మాజీ మంత్రి నారాయణకు సీఐడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే బెయిల్ మీద ఉన్న నారాయణను విచారణకు హాజరు కావాల్సిందిగా వాట్సాప్‌ ద్వారా నోటీసులు పంపించింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో అక్టోబర్ 4న హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. మరోవైపు ఇదే కేసులో నారా లోకేష్‌ను ఇటీవల ఏ14గా చేరుస్తూ సీఐడీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

    మహాత్మునికి సీఎం జగన్ నివాళి

    గాంధీ జయంతి సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మహాత్మునికి నివాళులర్పించారు. రాష్ట్రంలో సంక్షేమమే లక్ష్యంగా పాలన చేస్తున్నాం అని చెప్పారు. గ్రామ/వార్డు, సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేశామన్నారు. మునుముందు కూడా గాంధీ చూపిన మార్గంలోనే నడుస్తాం అని పేర్కొన్నారు. మహాత్ముడి ఆశయాల సాధనగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పుకొచ్చారు.

    అభ్యర్థుల ఎంపికపై షా, కిషన్ రెడ్డి భేటీ

    ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక, పార్టీలో పరిస్థితులపై ఇరువురు చర్చించారు. రేపు నిజామాబాద్ వేదికగా జరగనున్న మోదీ సభపై చర్చించారు. తెలంగాణలో మరిన్ని ప్రధాని సభలు పెట్టాలన్న ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. నిన్నటి మహబూబ్‌ నగర్ సభలో పసుపు బోర్డును మోదీ ప్రకటించిన నేపథ్యంలో నిర్మల్, కరీంనగర్‌లో ప్రధాని బహిరంగ సభలు పెట్టాలని బీజేపీ యోచిస్తోంది.

    పవన్ పూటకో మాట: అంబటి

    అవినీతిలో మునిగి తేలినవాళ్లు జైళ్లో మహాత్మగాంధీ జయంతి రోజున దీక్షలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ఇలాంటి దీక్షలు చేస్తున్నవారిని చూస్తే మహాత్ముడి ఆత్మ క్షోభిస్తుందని తెలిపారు. పవన్ పూటకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. మొన్నటిదాక బీజేపీతో పొత్తు అని ఇప్పుడు టీడీపీతో మాత్రమే పొత్తు అని అంటున్నారని చురకలు అంటించారు. కేవలం కాపులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే పవన్ సభలు పెడుతున్నారని ఆరోపించారు.