• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఈ ఏడాది భారత వృద్ధి రేటు 6.3శాతం: ప్రపంచ బ్యాంక్

    భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిని ప్రపంచబ్యాంకు వెల్లడించింది. ప్రస్తుత (2023-24) ఆర్థిక సంవత్సరంలో ఇండియా 6.3శాతం వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా వేసింది. దేశంలోకి పెట్టుబడుల వరుస, స్థానిక డిమాండ్ వృద్ధిరేటుకు దోహం చేస్తుందని పేర్కొంది. ఇదే క్రమంలో దేశ ద్రవ్యోల్బణం 5.9శాతంగా ఉండబోతుందని అంచనా వేసింది.

    చంద్రబాబు పిటిషన్‌పై సుప్రీం తీర్పు వాయిదా

    చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై తీర్పును సుప్రీంకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వినిపించారు. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు తీసుకునన నిర్ణయాలు అధికార నిర్వాహణలో భాగంగా తీసుకున్నవని కోర్టుకు వివరించారు. ఈ నిర్ణయాలకు 17(A) యాక్ట్ రక్షణ కల్పిస్తుందని పేర్కొన్నారు. ఆయనపై పెట్టిన కేసులు రాజకీయ కక్ష్యపూరితమైనవని వాదించారు. సీఐడీ తరఫున ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ.. నేరపూరితమై చర్యలకు 17(A) వర్తించదని కోర్టుకు విన్నవించారు. ఇరువాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను సోమవారానికి … Read more

    కాంగ్రెస్‌లోకి విజయశాంతి?

    ప్రధాని మోదీ సభకు బీజేపీ సీనియర్ నేతలు డుమ్మా కొట్టడం చర్చనీయాంశమైంది. ఇటీవల జరిగిన మహాబూబ్‌నగర్ సభకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి హాజరు కాలేదు. కొంతకాలంగా పార్టీ తీరుపై అసంతృప్తిగా ఇరువురు నేతలు ఉన్నట్లు తెలిసింది. రాష్ట్ర నాయకత్వంపై గతంలో బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ఈ ఇద్దరు నేతలు తిరిగి కాంగ్రెస్‌లో చేరుతారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఈరోజు ప్రధాని మోదీ నిజమాబాద్ సభకు రానున్నారు. మరి ఈ సభకైన విజయశాంతి, కోమటిరెడ్డి హాజరవుతారో లేదో చూడాలి.

    పోసానిపై కేసు పెట్టాలని హైకోర్టు ఆదేశం

    నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళిపై కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఇటీవల ఆయన పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై జనసేన నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేయలేదు. దీంతో హైకోర్టును ఆశ్రయించగా కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో రాజమండ్రి పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద పోసానిపై కేసు నమోదు చేశారు.

    ఏపీ సర్కారుకు ఎదురు దెబ్బ

    అంగళ్లు కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న దేవినేని ఉమ ఇతర టీడీపీ నేతలకు హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్‌ను సమర్థించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఏపీ సర్కారు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా విచారించిన ధర్మాసనం ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అటు ఇన్నర్‌ రింగ్ రోడ్ కేసులో టీడీపీ నేత నారాయణ బెయిల్ పిటిషన్‌పై విచారణను ఈనెల 16కు వాయిదా వేసింది.

    బిహార్‌లో బీసీలే అధికం

    బిహార్ కులగణన వివరాలను ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. గణాంకాల ప్రకారం బిహార్ మొత్తం జనాభాలో 63.13శాతం బీసీలు ఉన్నట్లు తేలింది. వీరి సంఖ్య 13.07 కోట్లు. ఇక దళితులు 19.65%, అత్యంత వెనకబడిన వారు 36శాతం, యాదవులు 14.27శాతం, ఇతర వెనకబడిన కులాల వారు 27శాతం మంది ఉన్నారు. అటు హిందువులు 81.99శాతం ఉండగా.. ముస్లింలు 17.7శాతం ఉన్నారు. దేశవ్యాప్త కులగణనకు కేంద్రం నిరాకరించడంతో బిహార్ సీఎం నితీశ్ కుమార్ ఆ రాష్ట్రంలో కులగణన చేపట్టారు.

    నేడు చంద్రబాబు పిటిషన్ విచారణ

    చంద్రబాబు దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు విచారించనుంది. జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ బేలా త్రివేదిలతో కూడిన ఈ కేసును విచారించనుంది. గవర్నర్ ముందస్తు అనుమతి లేకుండా తనపై సీఐడీ పెట్టిన కేసును కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబా క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం ఐటం నంబర్ 63 కింద లిస్ట్ చేసింది. అటు చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా ఏపీ వ్యాప్తంగా నిరశన దీక్షలు కొనసాగుతున్నాయి.

    స్వల్పంగా తగ్గిన బంగారం ధర

    తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 150 తగ్గి రూ.53,200కు చేరుకుంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన గోల్డ్ రేటు రూ. 160 తగ్గి రూ.58,040కు పడిపోయింది. అటు కిలో వెండి ధర రూ.500 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ. 75,500 వద్ద కొనసాగుతోంది.

    ఏపీలో జనసేన బలం పెరిగింది: పవన్‌

    AP: మచిలీపట్నంలో జరిగిన వారాహి యాత్రలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జనసేన బలం 14% నుంచి 18% పెరిగిందని పేర్కొన్నారు. అంచలంచెలుగా అధికారంలోకి రాగలం తప్ప ఒకేసారి గెలవలేమని స్పష్టం చేశారు. ఒంటరిగా వెళితే అధికారంలో వస్తామా? అనేది తనకు సందేహమేనన్నారు. పొత్తుతో వెళితే బలమైన సీట్లు వస్తాయని అంచనా వేశారు. తద్వారా అసెంబ్లీలో బలమైన పాదముద్ర పడుతుందని జోస్యం చెప్పారు. సీఎం అవుతానా? లేదా? అనేది గెలుపు నిష్పత్తిని బట్టి ఉంటుందని పవన్ అన్నారు.

    బండారు అరెస్టును ఖండించిన లోకేశ్‌

    AP: తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అరెస్టును ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఖండించారు. ‘ముఖ్యమంత్రి, మంత్రులు, వైకాపా నేతలంతా కూసే బూతు కూతలపై ఎన్ని వేల కేసులు నమోదు చేయాలి?. బూతు కూతలు వద్దని హితవు పలికిన మాజీ మంత్రి బండారుని మాత్రం టెర్రరిస్టులా అరెస్టు చేశారు. వైకాపాకు ఓ చట్టం, విపక్షాలకు మరో చట్టమా? ఇదేం అరాచక పాలన?’ అని లోకేశ్‌ ట్విటర్‌ వేదికగా నిలదీశారు.