ప్రధాని మోదీకి కేటీఆర్ సవాల్
ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్ సవాలు విసిరారు. మోదీకి ఛాలెంజ్ చేస్తున్న.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 110 సీట్లలో బీజేపీ డిపాజిట్ కోల్పోతుంది. మోడీ ఎన్ని పిచ్చి మాటలు మాట్లాడినా తెలంగాణ ప్రజలు నమ్మరు. తెలంగాణలో బీజేపీకి వచ్చేది గుండు సున్నే. ఎన్డీఏలో చేరాల్సిన కర్మ బీఆర్ఎస్కు లేదు.. ఎన్డీఏలో చేరేందుకు మాకు పిచ్చి కుక్క కరవలేదు. మేం కర్ణాటకలో డబ్బులు పంచితే మీ ఐటీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.