• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఎన్టీఆర్ స్పందించకపోతే ‘ఐ డోంట్ కేర్’: బాలకృష్ణ

    సినీ హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్టు విషయంలో ఎన్టీఆర్ స్పందించకపోతే ఐ డోంట్ కేర్ అని చెప్పుకొచ్చారు. సినిమా వాళ్లు స్పందించక పోవడం కూడా పట్టించుకోనని తెలిపారు. ఏపీలో సైకో పరిపాలన నడుస్తోందని ఆరోపించారు. చంద్రబాబు అరెస్టు విషయంలో కేంద్రం హస్తం ఉందో లేదో అవగాహన లేదని చెప్పారు. బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరితో టచ్‌లో ఉన్నామని బాలకృష్ణ పేర్కొన్నారు.

    చంద్రబాబు అరెస్టు బాధాకరం: తలసాని శ్రీనివాస్‌

    టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ స్పందించారు. చంద్రబాబు అరెస్టు చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన పట్ల జగన్ అనుసరిస్తున్న తీరు విచారకరమన్నారు. అధికారం ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరించడం సరికాదని మండిపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని మంత్రి గుర్తు చేశారు.

    ఓట్ల కోసమే జగన్ పథకాలు: పవన్

    వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్‌ది రూపాయి పావలా ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన ప్రభుత్వం రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ఓట్ల కోసమే జగన్ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. వైసీపీ పథకాల్లో అంతా డొల్లతనం. నిధుల మళ్లింపులు మాత్రమే ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ప్రజలు ఒక్కటి కావాలని పవన్ పిలుపునిచ్చారు..

    ప్రయాణికులకు APSRTC గుడ్‌న్యూస్

    ప్రయాణికులకు APSRTC గుడ్‌న్యూస్ చెప్పింది. దసరా పండుగ సందర్భంగా 5,500 ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ సర్వీసులు అక్టోబర్ 13 నుంచి 26 వరకు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. సాధారణ చార్జీలతోనే బస్సులు నడపనున్నట్లు APSRTC స్పష్టం చేసింది. సెలవుల్లో ప్రయాణికుల రద్ధీ దృష్ట్యా వారి కోసం ప్రత్యేక సర్వీసులు నడిపించనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది.

    పవన్ కళ్యాణ్‌కు పోలీసుల నోటీసులు

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు మచిలిపట్నం పోలీసులు నోటీసులు జారీ చేశారు. వారాహి యాత్రలో కొంత మంది క్రిమినల్స్, అసాంఘిక శక్తులు రాళ్లదాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న వ్యాఖ్యలపై ఆధారాలు సమర్పించాలని నోటీసుల్లో కోరారు. ఈ వ్యాఖ్యలపై ఎస్పీ జాషువా స్పందిస్తూ.. ఆధారాలు లేకుండా మాట్లాడటం మంచిదికాదు. విద్వేషాలు రెచ్చగొట్టెలా వ్యాఖ్యలు చేస్తే పర్యవసనాలు ఉంటాయి. మా సమాచార వ్యవస్థ మాకుంది. ఆయన దగ్గర ఏమైన ఆధారాలు ఉంటే మాకు ఇవ్వాలి’ అని సూచించారు.

    పసుపు బోర్డుకు కేబినెట్ ఆమోదం?

    ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ఇటీవల ప్రధాని ఇచ్చిన హామీలు పసుపు బోర్డు, గిరిజన వర్సిటీని మంత్రి మండలి ఆమోదించనుంది. కేబినెట్ ఎజెండాలో తెలంగాణకు సంబంధించిన అంశాలు ఉండటంతో కేంద్రమంతి కిషన్ రెడ్డి ఢిల్లీకి బయల్దేరారు. నిన్నటి వరకు హైదరాబాద్‌లో బిజీగా ఉన్న కిషన్ రెడ్డి రాత్రి ఫోన్ రావటంతో హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు. కేబినెట్ సమావేశం అనంతరం హోంమంత్రి అమిత్ షాతో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది.

    వరుస నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

    దేశీయ స్టాక్ మార్కెట్లలో నష్టాల పరంపర కొనసాగుతోంది. 383 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ 65,129 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. 108 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ సూచీ 19,420 పాయింట్ల వద్ద కదలాడుతోంది. నెస్లే ఇండియా, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పేయింట్స్, HUL షేర్లు లాభాల్లో ఉన్నాయి. మారుతీ, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, పవర్ గ్రిడ్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. అటు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.24 వద్ద కొనసాగుతోంది.

    వీడియోలు ఉంటే చూపించు… కన్నీళ్లు పెట్టుకున్న రోజా

    బ్లూఫిల్మ్స్‌లో నటించిందంటూ తనపై అసభ్య వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత బండారు సత్యనారాయణపై మంత్రి రోజా విరుచుకుపడ్డారు. “సత్యానారాయణ చెప్పినట్లుగా వీడియోలు ఉంటే బయట పెట్టాలి. టీడీపీ కోసం 10 ఏళ్లు కష్టపడ్డా. అక్కడ అవమానాలు ఎదుర్కోలేకే వైసీపీలో చేరా. జగన్, విజయమ్మలు కన్నకూతురిలా ఆదరించారు. బ్లాక్ మెయిల్ చేస్తూ తన క్యారెక్టర్‌ను కించపరుస్తున్నారని కన్నీళ్లు పెట్టుకున్నారు”. మరోవైపు సత్యనారాయణ వ్యాఖ్యలపై పెద్దఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. https://x.com/SumaTiyyaguraa/status/1709191945334174132?s=20

    దసరా సెలవులు ఎప్పటి నుంచి అంటే?

    ఏపీలో స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం దసరా సెలవులు ఖరారు చేసింది. అక్టోబర్ 13 నుంచి 25వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించింది. 26వ తేదీ నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈసారి దసరాకు 13 రోజులు హాలీడేస్ వచ్చాయి. తెలంగాణలోనూ 13 రోజులు దసరాకు సెలవలు వచ్చాయి.

    నిజమై తప్పక ఉండి ఉంటది: విజయశాంతి

    ఎన్డీఏలో చేరుతానని తనతో కేసీఆర్ చెప్పారన్న మోదీ వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతున్న వేళ.. విజయశాంతి ఆయన వ్యాఖ్యలను సమర్థించింది. “ప్రధాని మోదీ చెప్పినట్లుగా ఎన్డీఏలో చేరుతామని కేసీఆర్ అడిగి ఉండవచ్చు. నిజమై తప్పక ఉండి ఉంటది. 2009లో కూడా తెలంగాణలో మహాకూటమి పేర కమ్యూనిష్టులతో కలిసి పోటీ చేసిన కేసీఆర్.. కౌంటింగ్ డబ్బాలు తెరవక ముందే లూధియానాలో ఎన్డీఏ ర్యాలీకి హాజరైన వాస్తవం ప్రజలకు ఇంకా జ్ఞాపకం ఉంది. కేటీఆర్ ఈ విషయంలో మోదీని తిట్టటం సరికాదు” అని చెప్పారు.