• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • క‌ర్నూలు కొండారెడ్డి బురుజు వ‌ద్ద ‘జై బాల‌య్య’ నినాదాలు

    బాల‌కృష్ణ 107వ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం క‌ర్నూల కొండారెడ్డి బురుజు వ‌ద్ద జ‌రుగుతుంది. ఈ విష‌యం తెలుసుకున్న బాల‌య్య ఫ్యాన్స్ అక్క‌డికి భారీగా వ‌చ్చారు. జై బాల‌య్య, జై జై బాలయ్య అంటూ నినాదాలు చేస్తూ సంద‌డి చేశారు. గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. త‌మ‌న్ మ్యూజిక్ అందిస్తున్నాడు. షూటింగ్ శ‌ర‌వేగంగా పూర్తిచేసి ఈ ద‌స‌రాకు సినిమాను రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.

    అదిరిపోయిన ‘మాచర్ల ధమ్కీ’.. 30న ట్రైలర్

    యంగ్ హీరో నితిన్, బ్యూటిఫుల్ కృతిశెట్టి జంటగా M.S రాజ శేఖర్ రెడ్డి ‘మాచర్ల నియోజకవర్గం’ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్ ఆకట్టుకోగా.. తాజాగా ‘మాచర్ల ధమ్కీ’ అనే ఓ గ్లింప్స్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. అందులో నితిన్ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్ ఆకట్టుకుంటుంది. కాగా ఈ మూవీ ట్రైలర్‌ను ఈనెల 30వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ ఆ గ్లింప్స్‌లో తెలిపింది.

    హ్యాపీ బ‌ర్త్‌డే యంగ్ హీరో ఆకాశ్ పూరీ

    నేడు యంగ్ హీరో ఆకాశ్ పూరీ బ‌ర్త్‌డే. ఆకాశ్ పూరీ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ కొడుకు. బుజ్జిగాడు, గ‌బ్బ‌ర్‌సింగ్ వంటి ప‌లు సినిమాల్లో బాల‌న‌టుడిగా చేశాడు. చిన్న‌ప్ప‌టినుంచే న‌ట‌న మొద‌లుపెట్టిన‌ ఆకాశ్‌కు అప్ప‌టినుంచే సినిమాల‌పై ఆస‌క్తి పెరిగింది. దీంతో తండ్రి ద‌ర్శ‌క‌త్వంలో మెహ‌బూబూ సినిమాతో హీరోగా మారాడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన రొమాంటిక్‌, చోర్ బ‌జార్ సినిమాలు కూడా పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయాయి. కానీ న‌టుడిగా ఒక్కో సినిమాకు ఆకాశ్ ప‌రిణ‌తి చెందుతున్న విధానం అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది. ఇప్పుడే కెరీర్ మొద‌లుపెట్టిన ఈ యంగ్‌హీరో … Read more

    ‘సీతారామం’ ట్రైల‌ర్ రిలీజ్

    దుల్క‌ర్ స‌ల్మాన్‌, మృణాల్ ఠాకూర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ‘సీతా రామం’ ట్రైల‌ర్ నేడు రిలీజ్ అయింది. ఈ సినిమాలో అఫ్రీన్ పాత్ర‌లో ర‌ష్మిక‌, బాలాజీగా త‌రుణ్ భాస్క‌ర్ క‌నిపించ‌నున్నారు. 20 ఏళ్ల క్రితం లెఫ్టినెంట్ రామ్ సీతామ‌హాల‌క్ష్మీకి రాసిన ఉత్త‌రాన్ని ఆమెకు చేర్చేందుకు వాళ్లిద్ద‌రూ సాయ‌శ‌క్తుల ప్ర‌య‌త్నం చేస్తున్నారు. రొమాంటిక్ ల‌వ్‌స్టోరీగా సాగిపోతున్న ఈ క‌థ‌లో అఫ్రిన్ ఇచ్చే ట్విస్ట్ అదిరిపోయింది. న‌టుడు సుమంత్ ఈ సినిమాలో బ్రిగేడియ‌ర్ విష్ణు శ‌ర్మ‌ పాత్ర‌లో న‌టించారు. హ‌నురాఘ‌వ‌పూడి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. ఆగ‌స్ట్ 5న … Read more

    తీస్మార్ ఖాన్ నుంచి ‘సమయానికే’ సాంగ్ విడుదల

    ఆది సాయి కుమార్, పాయల్ రాజ్‌పుత్ హీరో హీరోయిన్లుగా కళ్యాణ్‌జి గోగన ‘తీస్మార్ ఖాన్’ మూవీని తెరకెక్కిస్తున్నాడు. విజన్ సినిమాస్ బ్యానర్‌పై నాగం తిరుపతి రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా నుంచి ‘సమయానికే’ అంటూ సాగే సాంగ్ విడుదలైంది. ఈ సాంగ్‌లో ఆది, పాయల్ చేసిన రొమాన్స్ ఆకట్టుకుంటుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ ఆకట్టుకోగా.. ఇప్పుడు విడుదలైన సాంగ్ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. కాగా ఈ సినిమాకు సాయి కార్తీక్ మ్యూజిక్ అందించాడు.

    ‘రాజ‌మండ్రి రోజ్‌మిల్క్’ టైటిల్ ట్రాక్ విడుద‌ల‌

    జై, అనంతిక జంట‌గా న‌టించ‌న ‘రాజ‌మండ్రి రోజ్‌మిల్క్’ మూవీ నుంచి టైటిల్ ట్రాక్ రిలీజ్ అయింది. అజ‌య్ అర‌సాడ మ్యూజిక్ అందించ‌గా ఈ పాట‌ను అనురాగ్ కుల‌క‌ర్ణి ఆల‌పించాడు. చంద్ర‌బోస్ లిరిక్స్ అందించాడు. వెన్నెల కిశోర్, ప్ర‌వీణ్ త‌దిత‌రులు ఈ సినిమాలో కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్‌, ఇన్‌ట్రోప్ ఫిల్మ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. నాని బండిరెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

    తీస్ మార్ ఖాన్ నుంచి సమయానికే వీడియో సాంగ్ రిలీజ్

    సాయికుమార్ కుమారుడు ఆది యాక్ట్ చేసిన తీస్ మార్ ఖాన్ మూవీ నుంచి సమయానికే ఫుల్ వీడియో సాంగ్ విడుదలైంది. వీడియోలో ఆది సిక్స్ ప్యాక్ బాడీ లుక్ తో ఆకట్టుకుంటున్నాడు. ఇక హీరోయిన్ పాయల్ రాజపుత్ ఈ పాటలో వయ్యారాలు ఒలకబోస్తూ అందాల కనువిందు చేసింది. ఈ చిత్రానికి కళ్యాణ్‌జీ గోగన దర్శకత్వం వహించగా, సాయి కార్తీక్ మ్యూజిక్ అందించాడు. ఈ మూవీ ఆగస్టు 19న రిలీజ్ కానుంది.

    దుల్కర్ సల్మన్ సీతారామం ట్రైలర్‌ విడుదల

    దుల్కర్ సల్మన్ యాక్ట్ చేసిన సీతారామం ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్లో దుల్కర్ డైలాగ్స్, యాక్టింగ్ అదరగొట్టాడు. మరోవైపు లోకేషన్స్ కూడా అదిరేలా ఉన్నాయి. రొమాంటిక్ డ్రామా, యుద్ధం నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న, సుమంత్, తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఈ మూవీ ఆగస్టు 5న రిలీజ్ కానుంది.

    రామారావు ఆన్ డ్యూటీ టిక్కెట్ల రేట్లు ఫిక్స్

    రామారావు ఆన్ డ్యూటీ టిక్కెట్ల రేట్లు ఖరారయ్యాయి. ఆదివారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో డైరెక్టర్ శరత్ మండవ ఈ మేరకు వెల్లడించారు. తెలంగాణలో మల్టీప్లెక్స్ లో టెక్కెట్ ధర రూ.195, సింగిల్ స్క్రీన్‌లలో రూ.150, రూ.100, రూ.50గా నిర్ణయించారు. ఏపీలో రూ.177, రూ.147, రూ.80గా ఉంటుందన్నారు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే రూ.30 ఎక్కువ తీసుకుంటారని పేర్కొన్నారు. కొంచెం కష్టమైనా థియేటర్‌కి వెళ్లి కౌంటర్‌లో టికెట్‌ తీసుకోవాలని సూచించారు. ఇక ఈ చిత్రం జూలై 29న విడుదల కానుంది.

    స్టేజీపై పానీపూరి తినిపించుకున్న చిరంజీవి-అమీర్‌ఖాన్

    నేడు లాల్‌సింగ్ చ‌డ్డా తెలుగు ట్రైల‌ర్ రిలీజ్ అయింది. ఈ సంద‌ర్భంగా చిత్ర‌బృందం హైద‌రాబాద్‌లో ప్రెస్‌మీట్‌ను ఏర్పాటుచేసింది. చిరంజీవి ఈ చిత్రాన్ని తెలుగులో స‌మ‌ర్పిస్తున్న సంగ‌తి తెలిసిందే. అందుకే ఈ కార్య‌క్ర‌మంలో ఆయ‌న కూడా పాల్గొన్నారు. ట్రైల‌ర్‌లో ఉన్న పానీపూరీ డైలాగ్‌ను తెలుగులో అమీర్‌ఖాన్‌తో నాగ‌చైత‌న్య చెప్పించే ప్ర‌య‌త్నం చేశాడు. ఇక డైలాగ్ చెప్పిన త‌ర్వాత పానీపూరీని చిరంజీవి, అమీర్‌ఖాన్ ఒక‌రికొక‌రు తినిపించుకున్నారు. లాల్‌సింగ్ చ‌డ్డా మూవీ ఆగ్ట్ 11న థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది.