ప్రముఖ మెుబైల్ కంపెనీ శాంసంగ్ సరికొత్త గెలాక్సీ స్మార్ట్ఫోన్తో రాబోతున్నట్లు తెలుస్తోంది. ‘Samsung Galaxy A55 5G’ పేరుతో కొత్త ఫోన్ను తీసుకొచ్చేందుకు ఆ సంస్థ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ‘Galaxy A54 5G’ మెుబైల్కు అప్డేట్ వెర్షన్గా ఈ నయా మెుబైల్ను లాంచ్ చేయనున్నట్లు తెలిసింది. అయితే విడుదలకు ముందే ఈ ఫోన్ ఫీచర్ల సమాచారం ఆన్లైన్లో లీకయ్యింది. అవి సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.
ఫోన్ డిస్ప్లే
ఈ నయా గెలాక్సీ మెుబైల్ 6.6 అంగుళాల Super AMOLED స్క్రీన్తో రానున్నట్లు సమాచారం. దీనికి 120Hz రిఫ్రెష్ రేట్, 1080 x 2340 పిక్సెల్స్ క్వాలిటీ, పంచ్ హోల్ డిస్ప్లేను కూడా అందిస్తున్నట్లు తెలిసింది. Android v14 OS, Octa Core ప్రొసెసర్తో ఫోన్ వర్క్ చేయనుంది.
కెమెరా క్వాలిటీ
ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్తో రానున్నట్లు లీకైన సమాచారం చెబుతోంది. 50 MP + 12 MP + 5 MP కెమెరాలు ఫోన్ వెనక భాగంలో ఉండనున్నాయి. ఇక ముందు వైపు 32 MP సెల్ఫీ కెమెరాను ఫిక్స్ చేస్తారని తెలిసింది.
ర్యామ్ & స్టోరేజ్
ఈ Samsung Galaxy A55 5G మెుబైల్ 8GB RAMతో రాబోతున్నట్లు తెలుస్తోంది. 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ను ఫోన్కు అందిస్తారని సమాచారం. microSD కార్డు ద్వారా స్టోరేజ్ సామర్థ్యాన్ని 1TB వరకూ పెంచుకునే ఫెసిలిటీని కల్పిస్తారట.
బ్యాటరీ సామర్థ్యం
ఈ శాంసంగ్ మెుబైల్ పవర్ఫుల్ బ్యాటరీతోనే రానుందట. దీనికి 5000 mAh బ్యాటరీని ఫిక్స్ చేస్తారని తెలిసింది. ఇది 30W ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేయనుందట.
ధర ఎంతంటే?
ఈ ఫోన్ వచ్చే ఏడాది ప్రారంభంలో లాంచ్ అయ్యే అవకాశముందని టెక్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దీని ధర రూ.39,990 వరకూ ఉండొచ్చని సమాచారం. దీనిపై త్వరలోనే శాంసంగ్ క్లారిటీ ఇవ్వనుంది.
Celebrities Featured Articles Movie News Telugu Movies
RGV Comments On SSMB29: మహేష్ – రాజమౌళి చిత్రంపై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్.. ఫుల్ జోష్లో ఫ్యాన్స్!