• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కూసే గాడిద వచ్చి మేసే గాడిదను తిట్టినట్టు: కేసీఆర్

    ఆలేరులో బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ‘యాదగిరిగుట్ట ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది. ఆ లక్ష్మీనరసింహుడే మనతో పని చేయించుకున్నారు. తెలంగాణ వస్తే భూముల ధరలు పోతాయ్‌ అని ఆనాడు అన్నారు. కరెంటు ఉండదు, చిమ్మ చీకట్లు అవుతాయన్నారు.. సునీత నా బిడ్డలెక్క, ఆమె అడిగిన హామీలు నెరవేరుస్తా.. కూసే గాడిద వెళ్లి మేసే గాడిదను తిట్టినట్లు డీకే శివకుమార్‌ మనకు చెబుతున్నారు.. 24 గంటలు కరెంట్‌ ఇచ్చే రాష్ట్రానికి వచ్చి 5 గంటలు కరెంట్ ఇస్తామంటున్నారు’ … Read more

    బస్సు రెడీగా ఉంది కేటీఆర్ సిద్ధమా?: రేవంత్ రెడ్డి

    కర్ణాటక డిప్యూటి సీఎం డీకే శివకుమార్‌పై మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తిప్పి కొట్టారు. ‘కర్ణాటకలో హామీలన్నీ అమలు అవుతున్నాయి. వాటిపై కేసీఆర్, కేటీఆర్ అబద్ధాలు చెబుతున్నారు. కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ విసిరిన సవాల్‌కు కేసీఆర్, కేటీఆర్ తోక ముడిచారు. బస్సు రెడీగా ఉంది, ప్రగతి భవన్ రావాలా, ఫాం హౌస్‌కు రమ్మంటావా.. బస్సులో నేరుగా కాళేశ్వరం వెళ్లి చూద్దాం.. అక్కడి నుండి కర్ణాటకకు వెళ్దాం, సిద్ధమా? అని ప్రశ్నించారు.

    ఇప్పుడు ఎట్లా ఉంది అని అడగాలి: కేటీఆర్

    హైదరాబాద్ మహా నగరంను విశ్వ నగరంగా మార్చే క్రమంలో అడుగులు ముందుకు వేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ అన్నారు. ‘ప్రజలను కలిసినప్పుడు 2014లఎట్లా ఉండే… ఇప్పుడు ఎట్లా ఉంది అని అడగాలి. గతంను మరిచి పోయి గందరగోళం పడిపోతాం. ఇది మానవ నైజం. 2014కు ముందు 10 గంటలు కరెంట్ పోయిన అడిగేవాడు వాడు… చెప్పే వాడు లేడు. ఇప్పుడు 10 నిముషాలు కరెంట్ పోతే ఇదేనా బంగారు తెలంగాణ అని సోషల్ మీడియాలో పెడుతున్నారు. కర్ణాటకలో ప్రజలు కరెంట్ లేక రోడ్లు ఎక్కుతున్నారు’ అని … Read more

    పరిగికి నీళ్లు ఎందుకు తేలేదు: రేవంత్

    కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే కేసీఆర్‌ రెండుసార్లు సీఎం అయ్యారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ‘కేసీఆర్‌ కుటుంబంలో అందరికి పదవులు వచ్చాయి. ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీళ్లు ఇస్తామన్నారు ఏమైంది?.. కొడంగల్‌ వరకు గోదావరి జలాలు తీసుకొస్తామని వైఎస్సార్ హామీ ఇచ్చారు.. ఏపీవాళ్లు తెలంగాణ నీళ్లు తీసుకెళ్లారని కేసీఆర్‌ ఆనాడు విమర్శించారు. పరిగికి కేసీఆర్‌ ఎందుకు నీళ్లు తీసుకురాలేదు? భూముల్ని ఆక్రమించిన మిమ్మల్ని వదిలిపెట్టం’ అని హెచ్చరించారు.

    కేసీఆర్‌ను ఎందుకు గద్దే దించాలి: కేటీఆర్

    టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. ‘ఒకప్పుడు బలిదేవత అని సోనియా గాంధీని విమర్శించిన రేవంత్‌కు ఇప్పుడు ఆమె దేవత అయిందా? కాంగ్రెస్‌కు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటికే 11 సార్లు ప్రజలు ఛాన్స్ ఇచ్చారు. కాంగ్రెస్ ఏం చేసింది? కేసీఆర్‌ను గద్దే దించాలని అంటున్నారు. రైతులకు రైతు బంధు ఇచ్చినందుకు గద్దే దించాలా? ఆడబిడ్డలకు కళ్యాణలక్ష్మి ఇచ్చినందుకు దింపాల? ఆసరా పెన్షన్లు పెంచినందుకు దించాలా? ఎందుకు దించాలి’ అని ప్రశ్నించారు.

    కానిస్టేబుల్‌ను తొక్కుకుంటూ వెళ్లిన కారు

    హైదరాబాద్ – రోడ్డుపై వాహనలు తనిఖీ చేస్తున్న కానిస్టేబుల్ మీద నుంచి కారు దూసుకెళ్లిన ఘటన చిలకలగూడలో జరిగింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈ నెల 18న రాత్రి వాహన తనిఖీ చేస్తున్న కానిస్టేబుల్ మహేష్.. అటుగా వస్తున్న ఓ కారును ఆపే ప్రయత్నం చేశాడు. డ్రైవర్ ఆపకుండా కానిస్టేబుల్‌ను గుద్ది తొక్కుకుంటూ వెళ్లిపోయాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. https://x.com/TeluguScribe/status/1715211924110262641?s=20

    తెలంగాణ గురించి చెబుతూ రాహుల్ ఎమోషనల్

    తెలంగాణ గురించి మాట్లాడుతూ కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ఎమోషనల్ అయ్యారు. ‘తెలంగాణతో మాకు ఉన్నది రాజకీయ సంబంధం కాదు.. కుటుంబ సంబంధం ఉంది. తెలంగాణతో మోదీ, కేసీఆర్‌లకు కేవలం రాజకీయ సంబంధమే ఉంది. మీరంతా ఒక్కసారి గుర్తు పెట్టుకోండి. మీకు మాకు మధ్య ఉంది రాజకీయ సంబంధం కాదు. మీ అభిమానం.. ఆశీర్వాదంతో కూడిన సంబంధం. అందుకే మా చెల్లె ప్రియాంకను తీసుకు వచ్చా. తెలంగాణతో మనకు రాజకీయ సంబంధం కాదు.. కుటుంబ సంబంధం అని చెప్పి తీసుకు వచ్చా’ అని చెప్పుకొచ్చారు.

    రెండో రోజుకు రాహుల్ బస్ యాత్ర

    తెలంగాణలో రాహుల్ గాంధీ బస్సు యాత్ర రెండోరోజుకు చేరుకుంది. ఈరోజు భూపాలపల్లి నుంచి కాటారం వరకు బస్సు యాత్ర కొనసాగనుంది. నిరుద్యోగుల బైక్ ర్యాలీలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. కాటారం పక్కనే రైతులతో సమావేశం కానున్నారు. అక్కడే వారితో కలిసి భోజనం చేయనున్నారు. మంథని బైపాస్ నుంచి నేరుగా పెద్దపల్లికి రాహుల్ చేరుకోనున్నారు. అక్కడ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. రాత్రి కరీంనగర్‌లో బసచేయనున్నారు.

    తెలంగాణలో పోటీపై 2 రోజుల్లో చెప్తా: పవన్

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. ఉదయం హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ పార్టీ కార్యకర్తలు, నేతలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈసారి పోటీ చేయకపోతే.. క్యాడర్ బలహీనమయ్యే ప్రమాదం ఉందని పవన్‌కు నేతలు వివరించారు. అయితే కార్యకర్తల అభిప్రాయాలను గౌరవిస్తానన్న పవన్, రెండు మూడు రోజుల్లో పోటీపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. మరోవైపు పవన్ కళ్యాణ్.. టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డితో సమావేశమయ్యారు. ఎన్నికల్లో కలిసి వెళ్లేందుకు ఉన్న అవకాశాలపై చర్చించారు.

    సిద్ధాంతాల మీద ఓట్టు అడుగుదాం: రేవంత్

    పక్క రాష్ట్రాల నుంచి కాంగ్రెస్‌కు భారీగా నిధులు సమకూరుతున్నాయన్న వార్తలను రేవంత్ రెడ్డి ఖండించారు. కావాలనే బీఆర్ఎస్ తమపై తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నికలో మీరు మద్యం, డబ్బు పంచడం వల్ల బీఆర్ఎస్ గెలిచిందని చాలా మంది అంటున్నారు. ఇప్పుడు చెబుతున్నా.. డబ్బు, మద్యం పక్కన పెడుదాం. ఈ ఎన్నికల్లో కేవలం సిద్ధాంతాల మీద ప్రజలను ఓట్లు అడుగుదాం. మాతో కలిసొచ్చే దమ్ము బీఆర్‌ఎస్‌కు ఉందా అని ప్రశ్నించారు.