ఆ నలుగురు వృద్ధుల పోరాటం వల్లే కూలిన ట్విన్‌ టవర్స్‌
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆ నలుగురు వృద్ధుల పోరాటం వల్లే కూలిన ట్విన్‌ టవర్స్‌

    ఆ నలుగురు వృద్ధుల పోరాటం వల్లే కూలిన ట్విన్‌ టవర్స్‌

    August 28, 2022
    in India, News

    © ANI Photo

    దాదాపు దశాబ్ద కాలం పాటు నలుగురు సీనియర్‌ సిటిజన్ల పోరాట ఫలితంగానే ఇవాళ నోయిడాలోని సూపర్‌టెక్‌ ట్విన్‌ టవర్స్‌ నేలమట్టమయ్యాయి. విరాళాలు పోగేసుకుని మరీ ఈ నలుగురు వృద్ధులు కోర్టుల చుట్టూ తిరిగారు. 2009లో సూపర్‌టెక్‌ ఈ భారీ ప్రాజెక్టు చేపట్టింది. నిబంధలన్నీ గాలికొదిలేసి నిర్మాణం చేపట్టారు. దీనిపై యూబీఎస్‌ టియోటియా (80), ఎస్‌కే శర్మ(74), రవి బజాజ్‌(65), ఎంకే జైన్‌(59) కలిసి లీగల్ కమిటీగా ఏర్పడి కోర్టుకెళ్లారు. 2014లోనే అలహాబాద్‌ కోర్టు టవర్ల కూల్చివేతకు ఆదేశించింది. అయితే ఫిన్‌టెక్‌ కంపెనీ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఏడేళ్ల విచారణ తర్వాత సొంత ఖర్చులతోనే ట్విన్ టవర్లు కూల్చివేయాలని సుప్రీం ఆదేశించింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version