• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం

    ఇంద్రకీలాద్రిలో కనకదుర్గ అమ్మవారికి సీఎం జగన్ పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకున్న సీఎంకు ఆలయ వేద పండితులు వేదమంత్రాలతో ఆశీర్వచనం అందించారు. అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్ని సీఎంకు అందజేశారు.

    ‘బలగం’ డైరెక్టర్‌కి తండ్రిగా ప్రమోషన్

    ‘బలగం’ సినిమా దర్శకుడు, నటుడు వేణు యెల్దండి తండ్రిగా మరోసారి ప్రమోషన్స్ పొందాడు. తనకు అమ్మాయి పుట్టిందని చెబుతూ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. అయితే వేణుకు ఇదివరకే ఓ కొడుకు ఉన్నాడు. ఇక సినిమాల విషయానికి వస్తే ‘బలగం’ తర్వాత మళ్లీ దిల్ రాజు నిర్మాణంలో వేణు మరో సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. అందులో కూడా ప్రియదర్శినే హీరోగా నటిస్తున్నాడని టాక్ నడుస్తోంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

    ప్రజ్ఞాన్‌పై ఇంకా ఆశలున్నాయి: ఇస్రో

    చంద్రుడిపై నిద్రాణ స్థితిలో ఉన్న ప్రజ్ఞాన్ రోవర్ తిరిగి క్రియాశీలమయ్యే అవకాశం ఉందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు. ప్రస్తుతం చందమామపై ప్రజ్ఞాన్ రోవర్ నిద్రిస్తుంది. దానిని పడుకొనిద్దాం. తనంతటే తానే క్రియాశీలం అయ్యే అవకాశాలు ఇంకా మెండుగా ఉన్నాయి. రోవర్‌ను మైనస్ 200 డిగ్రీల వద్ద పరీక్షించినప్పుడు పనిచేసింది. అందుకే ఇప్పటికీ ప్రజ్ఞాన్ రోవర్ క్రియాశీలమవుతుందనే నమ్మకం ఉందన్నారు.

    భారీగా పెరిగిన బంగారం ధరలు

    తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఈరోజు భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 250 పెరిగి రూ.55,700కు చేరింది. అటు 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.270 పెరిగి రూ. 60,760కి ఎగబాకింది. మరోవైపు కేజీ వెండి ధర రూ. 500 తగ్గింది. దీంతో కిలో వెండి రూ. 77,500కు చేరుకుంది.

    గరుడవాహనంపై శ్రీవారు

    తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఐదో రోజు రాత్రి శ్రీమలయప్పస్వామివారు గరుడవాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తకోటికి దర్శనమిచ్చారు. ఏనుగులు, అశ్వాలు భక్తుల కోలాటాలు, డప్పు వాయిద్యాలు, ఇతర కళా ప్రదర్శనల నడుమ వాహన సేవ కోలాహలంగా సాగింది. స్వామివారిని వీక్షించేందుకు లక్షలాది మంది తిరుమలకు పోటెత్తారు..

    భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య

    పెళ్లై మరో మహిళతో సహజీవనం చేస్తున్న భర్తను భార్య పోలీసులకు పట్టించింది. ఈ ఘటన గుంటూరులో చోటుచేసుకుంది. కత్తి శ్రీను కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఓ యువతితో అతడికి వివాహేతర సంబంధం ఉంది. దీంతో శ్నీనుపై ఆయన భార్య పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో గెస్ట్‌హౌస్‌లో యువతితో ఉండగా భర్తను పోలీసులకు పట్టించింది. దీంతో సదరు కానిస్టేబుల్‌ను పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.

    నేడు మోహిని అవతారంలో శ్రీవారు

    నేడు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు మోహిని అవతారంలో కనిపించనున్నారు. ఉదయం 8 గంటలకు మోహినీ అవతారం.. సాయంత్రం 6.30 గంటలకు గరుడ వాహన సేవ.. గరుడ వాహన సేవ సందర్భంగా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 3 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. భక్తుల కోసం ప్రతి 5 నిమిషాలకు బస్టాండ్‌లో ఓ బస్సు నడపనున్నట్లు టీటీడీ తెలిపింది.

    గజ దొంగల ముఠా రాష్ట్రాన్ని లూటీ చేసింది: జగన్

    ఎమ్మిగనూరులో నిర్వహించిన సభలో సీఎం జగన్.. ‘జగనన్న చేదోడు’ పథకం నిధులను విడుదల చేశారు. రజకులు, నాయిబ్రహ్మణ కులాలకు చెందిన లబ్ధిదారుల ఖాతాల్లో రూ.10 వేల చొప్పున జమ చేశారు. ఏటా వారి అవసరాల నిమిత్తం ఆర్థిక సాయంగా ప్రభుత్వం రూ.10 వేలు అందిస్తోంది. ఈసందర్భంగా సీఎం జగన్.. చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు పాలనకు ఇప్పటికీ తేడా చూడండి. ఇచ్చిన హామీలను నాలుగేళ్లలో నిలబెట్టుకున్నాం. అప్పట్లో గజదొంగల ముఠా రాష్ట్రాన్ని లూటీ చేసింది. ఇప్పుడు ప్రతి పైసా ప్రజలకోసమే ఖర్చు పెడుతున్నాం అని … Read more

    ఏపీకి పొంచి ఉన్న తుపాను ముప్పు

    ఆగ్నేయ బంగాళఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలో వానలు కురవనున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. రాబోయే 3రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈనెల 23 వరకు ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించనున్నట్లు వెల్లడించింది. అయితే ఉత్తరాంధ్రకు తుపాను ముప్పు పొంచి ఉందని పేర్కొంది. ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది. దీని ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది.

    స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

    ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 పెరిగి రూ.55,460కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.110 పెరిగి రూ. 60,500కు ఎగబాకింది. మరోవైపు కిలో వెండి ధర రూ.78,000 వద్ద కొనసాగుతోంది.