• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నారా భువనేశ్వరి కీలక నిర్ణయం

    చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘నిజం గెలవాలి’ పేరుతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లనున్నారు. వచ్చే వారం నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భువనేశ్వరి పర్యటించనున్నారు. చంద్రబాబు అరెస్టు కారణంగా ఆవేదనతో మృతి చెందిన కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. అలాగే చంద్రబాబు నిర్వహిస్తున్న భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమాన్ని లోకేష్ ప్రారంభించున్నారు. చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత లోకేష్ యువగళం పాదయాత్రకు ప్రారంభిస్తారు.

    ‘జగనన్న పండగోస్తుంది మా జీతాలన్నా’

    టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. ‘చంద్రన్న హయాంలో దసరా, దీపావళి, రంజాన్ వంటి ప్రముఖ పండుగలకు వారం ముందే జీతాలందుకున్న రోజుల నుంచి… జగనన్న పండగోస్తుంది మా జీతాలన్నా.. మమ్మల్ని కరుణించన్న అనే రోజులు వచ్చాయి….అమ్మో ఒకటో తేదీ..ఇది పాత మాట.. ఇప్పుడు ఆ తేదీనే మర్చిపోయిన రోజులు ఇవి..వైసీపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తరువాత ఒకటో తేదీన జీతాలు పడిన సంఘటనలు అరుదులో అరుదు’ అని గంటా పేర్కొన్నారు.

    దసరా సెలవుల్లో మార్పులు

    ఏపీలో దసరా సెలవుల్లో మార్పులు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్యులు జారీ చేసింది. ఈ నెల 24న హాలీడే బదులుగా సాధారణ సెలవుగా మార్పు చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 23, 24 తేదీల్లో సాధారణ సెలవులు ఉండనున్నాయి. దసరా పండుగ దృష్ణ్యా సెలవుల్లో ప్రభుత్వం ఈ మేరకు మార్పులు చేసింది.

    చంద్రబాబు అవినీతిపై ఆధారాలు ఉన్నాయి: సజ్జల

    రాజమండ్రి జైలులో టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యం బాగానే ఉందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. ‘ఆయన ఆరోగ్యం పేరుతో టీడీపీ నేతలు బయట డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. కేసుల విషయంలో ప్రజలను తప్పుదారి పట్టించాలని చూస్తున్నారు. చంద్రబాబు అవినీతిపై ఆధారాలు ఉన్నాయి. రాష్ట్రంలోని కొన్ని పత్రికలు అదే పనిగా ప్రభుత్వంపై తప్పుడు రాతలు రాస్తున్నాయి’ అని ఆరోపించారు.

    తెలంగాణలో బీజేపీ సీఎం అభ్యర్థిగా బీసీ నేత?

    ఎట్టకేలకు తెలంగాణ బీజేపీ అభ్యర్థులను రేపు ఆ పార్టీ హైకమాండ్ ప్రకటించనుంది. 40 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసేందుకు సిద్ధమైంది. అంబర్‌పేట నుంచి కిషన్ రెడ్డి, కేసీఆర్‌కు పోటీగా గజ్వేల్ నుంచి ఈటల రాజేందర్, అలాగే కేసీఆర్‌కు పోటీగా కామారెడ్డి నుంచి విజయశాంతి పోటీ చేయాలని చూస్తున్నారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల వేళ.. బీజేపీ అనూహ్య నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ నేతను సీఎంగా చేస్తానని ప్రకటించనుంది.

    శిశు సంక్షేమ శాఖపై నేడు సీఎం జగన్‌ సమీక్ష

    మహిళా, శిశు సంక్షేమ శాఖపై నేడు సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష చేపట్టనున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో అధికారులతో ఆయన సమావేశం కానున్నారు. ఫౌండేషన్ స్కూల్స్‌లో బోధన, వైఎస్సార్ పోషణ ప్లస్, గర్భిణీలు, బాలింతలకు డ్రై రేషన్, మాంటిస్సోరి విద్యా విధానం తదితర అంశాలపై చర్చించనున్నారు. దీనితో పాటు ఇతర పథకాల అమలుకు సీఎం జగన్ సూచనలు చేయనున్నారు.

    చంద్రబాబు పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

    చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదనలు పూర్తి అయ్యాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పు రిజర్వ్‌ చేసింది. సీఐడీ తరుఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించగా.. చంద్రబాబు తరుఫున సీనియర్ లాయర్ హరీష్‌ సాల్వే వాదనలు వినిపించారు. 17A చంద్రబాబుకు వర్తించదని ముకుల్‌ రోహత్గీ వాదించారు. 17A ప్రకారం గవర్నర్‌ అనుమతి కచ్చితంగా తీసుకోవాలని లాయర్‌ సాల్వే వాదించారు.

    టీడీపీ-జనసేన కార్యాచరణపై పవన్ చర్చ

    ఏపీలో రాజకీయ పరిస్థితులపై జనసేన పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ చెర్చించారు. ఐదో విడత వారాహి యాత్ర, టీడీపీ-జనసేన సమన్వయ కమిటీల ఉమ్మడి సమావేశంపై పార్టీ నేతలతో పవన్ చర్చించారు. రైతుల ఇబ్బందులు సాగునీరందక కృష్ణా, పశ్చిమ డెల్టాలో 4లక్షల ఎకరాలు ఎండిపోయిన అంశంపై పవన్ చర్చించారు. రైతుల పక్షాన నిలవాలని, అందుకు చేపట్టే పోరాటంపై ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని స్థితిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉందని పవన్ ఆరోపించారు.

    ముత్యపు పందిరి వాహనంపై శ్రీవారు

    తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజు స్వామివారు ముత్యపు పందిరి వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ముత్యపుపందిరి వాహనంపై భక్తులకు అభయప్రదానం చేశారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన ముత్యాలహారాలు , రత్నాల వల్ల కలిగే వేడిని, పుష్పాల వల్ల కలిగే సుగంధాన్ని తమలో ఇనుమడింపజేసుకొని ఉత్సాహాన్ని, ప్రశాంతతను పొందుతారు.

    సెక్షన్ 17ఏ చంద్రబాబుకు వర్తించదు: రోహత్గీ

    స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదనలు మొదలయ్యాయి. సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. ‘అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17A చంద్రబాబుకు వర్తించదు. స్కాం జరిగిన టైంలో సెక్షన్ 17ఏ లేదు. అవినీతిపరులకు సెక్షన్ 17ఏ రక్షణకవచం కాకుడదు. సెక్షన్ 17ఏ కేవలం నీతిమంతమైన ప్రభుత్వాధికారులు, ప్రజాప్రతినిధులకు మాత్రమే వర్తిస్తుంది’ అని కోర్టుకు విన్నవించారు. ఈ కేసులో చివరగా చంద్రబాబు తరఫు లాయర్ హరీష్ సాల్వే వాదనలు వినిపించాల్సి ఉంది.