• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నానితో లిప్‌ లాక్‌తో రెచ్చిపోయిన మృణాల్

    నేచురల్ స్టార్ నాని మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ‘హాయ్ నాన్న’ మూవీ నుంచి తాజాగా టీజర్ రిలీజ్ అయింది. తండ్రి కూతుళ్ల మధ్య సాగే ఎమోషనల్‌ డ్రామాగా మూవీ సాగనున్నట్లు టీజర్‌ను బట్టి తెలుస్తోంది. ఎప్పటిలాగే మృణాల్ ఠాకూర్ తన గ్లామర్‌ ప్రదర్శనతో రెచ్చిపోయింది. నాని లిప్‌ లాక్ చేసి సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ సినిమా డిసెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. https://youtube.com/watch?v=GDVT4raMjRY%26t

    ‘ఫస్ట్‌ 10 నిమిషాలు అస్సలు మిస్‌ కావొద్దు’

    సరిగ్గా ఐదు రోజుల్లో రిలీజ్‌ కాబోతున్న లియో చిత్రంపై విజయ్‌ ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. తమిళనాడు సహా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆన్‌లైన్‌లో టిక్కెట్‌లు హాట్‌ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. తాజాగా ఈ సినిమా గురించి దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ ఓ క్రేజీ అప్‌డేట్‌ బయపెట్టాడ. ఈ మూవీలో ఫస్ట్‌ పది నిమిషాలు అస్సలు మిస్సవ్వద్దని సూచించారు. సినిమాకు సోల్ అదేనని చెప్పుకొచ్చాడు. దీంతో విజయ్‌ ఫ్యాన్స్‌లో సినిమాపై ఉన్న ఆసక్తి మరింత పెరిగిందని చెప్పవచ్చు.

    ఆస్కార్‌ బరిలో అక్షయ్‌ చిత్రం!

    బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ నటించిన ‘మిషన్‌ రాణిగంజ్‌’ చిత్రం ఆస్కార్‌ బరిలో నిలవనుంది. జనరల్‌ కేటగిరిలో ఇండిపెండెంట్‌గా ఈ చిత్ర బృందం నామినేషన్ వేసింది. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో వైరల్‌గా మారింది. గతంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ కూడా ఇలానే ఇండిపెండెంట్‌గా కొన్ని కేటగిరీల్లో నామినేషన్‌ వేసిన సంగతి తెలిసిందే. ‘ఆస్కార్‌ 2024’ అధికారిక ఎంట్రీ కోసం పలు భారతీయ చిత్రాలు పోటీ పడగా, జ్యూరీ మలయాళ మూవీ ‘2018’ను ఎంపిక చేసింది. Courtesy Twitter: Courtesy Twitter:

    అమేజాన్ ప్రైమ్‌లో ‘మార్క్ ఆంటోనీ’

    కోలీవుడ్ హీరో విశాల్ నటించిన ‘మార్క్ ఆంటోనీ’ చిత్రం అమేజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతోంది. అదిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన ఈ ఇంట్రెస్టింగ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా మూవీ హిట్ టాక్ సొంతం చేసుకుంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజైన ‘మార్క్ ఆంటోనీ’ మంచి విజయం సాధించి విశాల్ కెరీర్‌లో అత్యధిక గ్రాస్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ మూవీలో విశాల్‌తో పాటు డెరెక్టర్ ఎస్‌జే సూర్య నటించాడు.

    వ్యూహం ట్రైలర్ విడుదల

    సంచలన దర్శకుడు ఆర్జీవీ వ్యూహం సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌లో చంద్రబాబు, పవన్ పాత్రలు ఉన్నాయి. జగన్ పాదయాత్ర, ఓదార్పు యాత్రకు సంబంధించిన సంఘటనలు ఉన్నాయి. ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. మరో 6 నెలల్లో ఏపీ ఎలక్షన్లు ఉన్న నేపథ్యంలో ఈ సినిమా పొలిటికల్ హీట్ పెంచుతోంది.

    ‘బలగం’ సినిమా మరో రికార్డు

    కమెడియన్ వేణు ఎల్దంది డైరెక్షన్‌లో వచ్చిన సూపర్ హిట్ మూవీ బలగం మరో రికార్డు సృష్టించింది. థియేటర్లు, ఓటీటీలోనూ అదరగొట్టిన ఈ సినిమా టీవీలోనూ ప్రేక్షకాదరణ పొందుతోంది. ఈ సినిమా ఇటీవల స్టార్ ‘మా’ లో ప్రసారం అయ్యింది. అందుకు సంబందించిన టీఆర్పీ రేటింగ్ తాజాగా విడుదలైంది. బలగం మూవీకి ఏకంగా 8.42 TRP రేటింగ్ వచ్చింది. దీంతో బలగం సత్తా మరోసారి నిరూపితమైంది.

    ఓటీటీలోకి మార్క్ ఆంటోని సినిమా

    తమిళ్ స్టార్ హీరో విశాల్ నటించిన మార్క్ ఆంటోని సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. నేటి నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళ్ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. SJ సూర్య విలక్షణ పాత్రలో నటించాడు. డైరెక్టర్ అదిక్ రవిచంద్రన్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా ‘మార్క్ అంథోని’ని తెరకెక్కించారు. తమిళ్‌లో భారీ వసూళ్లు సాధించింది ఈ సినిమా. విశాల్ కెరీర్ హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది.

    చిరు మూవీ టైటిల్ ‘ముల్లోక వీరుడు’?

    వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కనున్న మెగాస్టార్ చిరంజీవి 157వ చిత్రానికి ‘ముల్లోక వీరుడు’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో చిరు గెటప్‌‌ను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారట. ఈ సోషియో ఫాంటసీ మూవీలో చిరు పాత్ర ఎప్పటికీ గుర్తుండి పోయేలా ఉంటుందని చెబుతున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీని వచ్చే ఏడాది చివరి నాటికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

    సినీ అభిమానులకు బంపర్ ఆఫర్

    ఈ నెల 13న నేషనల్ మూవీ డే సందర్భంగా మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సినీ అభిమానులకు బంపరాఫర్ ప్రకటించింది. ఆ రోజు దేశ వ్యాప్తంగా ఉన్న మల్టీప్లెక్స్‌లలో కేవలం రూ.99కే టికెట్ బుక్ చేసుకోవచ్చిన చెప్పింది. అయితే ఈ ఆఫర్ ఎంపిక చేసిన నగరాలు, థియేటర్లలో మాత్రమే ఉంటుంది. పీవీఆర్, ఐనాక్స్, సినీ పోలీస్, మిరాజ్, సిటీ ప్రైడ్, ఏషియన్, ముక్తా ఏ2, మూవీ టైమ్, వేవ్, డిలైట్, ఎం2కేలో ఆన్‌లైన్ టికెట్స్ బుక్ చేసుకునే వారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది.

    మరికాసేపట్లో ‘సైంధవ్’ టీజర్

    ఈ రోజు సాయంత్రం 4.05 గంటలకు విక్టరీ వెంకటేశ్ హీరోగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘సైంధవ్’ మూవీకి సంబంధించి బిగ్ అప్డేట్ ఇవ్వనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో ఈ సినిమా టీజర్ రిలీజ్ కాబోతుందనే చర్చ మొదలైంది. వెంకటేశ్ సరసన శ్రద్ధా శ్రీనాథ్ నటించిన ఈ మూవీని శైలేశ్ కొలను తెరకెక్కిస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా ‘సైంధవ్’ రాబోతోంది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నాడు.