టైగర్ నాగేశ్వరరావు ‘రన్ టైం’ లాక్
మాస్ మహారాజా రవితేజ నుపుర్ సనన్ జంటగా నటించిన పాన్ ఇండియా చిత్రం టైగర్ నాగేశ్వరరావు. ఈ సినిమా రన్ టైం తాజాగా లాక్ అయింది. టైగర్ నాగేశ్వరరావు రన్ టైం 3 గంటల 2 నిమిషాల నిడివితో కట్ చేసినట్లు సమాచారం. అక్టోబర్ 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది. సినిమా ప్రమోషన్లు సైతం జోరుగా సాగుతున్నాయి. హిందీలో ప్రమోషన్ కోసం రవితేజ స్వయంగా రంగంలోకి దిగాడు.