• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేడు CBN బెయిల్‌ పిటిషన్‌పై విచారణ

    AP: నేడు హైకోర్టులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌కు సంబంధించి విచారణ జరగనుంది. మధ్యంతర బెయిల్‌ కోసం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌లపై దసరా సెలవుల ప్రత్యేక బెంచ్‌ విచారణ చేపట్టనుంది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ఏసీబీ కోర్టు బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించడంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నెల 19న హైకోర్టు ఈ పిటిషన్‌పై విచారణ జరిపి వెకేషన్‌ బెంచ్‌ ముందుకు వాయిదా వేసింది.

    హైకోర్టులో CBN అత్యవసర పిటిషన్

    AP: తెలుగుదేశం అధినేత చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ జరపాలంటూ హైకోర్టులో హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలైంది. ఈ మేరకు ఆయన తరఫు న్యాయవాదులు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 3 నెలల క్రితం చంద్రబాబు ఎడమ కంటికి కాటరాక్ట్‌ ఆపరేషన్‌ జరిగిందని పేర్కొన్నారు. ఇప్పుడు కుడి కంటికి ఆపరేషన్‌ జరపాల్సిన అవసరం ఉందని పిటిషన్‌లో వివరించారు. కాగా, చంద్రబాబు కంటికి అత్యవసర చికిత్స అవసరమని కంటి వైద్యులు సూచించారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

    నేడు హైకోర్టు జడ్జిల ప్రమాణం

    నేడు హైకోర్టు అడిషనల్ న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం జరగనుంది. ఉదయం 11 గంటలకు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నలుగురు అడిషనల్ జడ్జిలు హరినాథ్ నూనెపల్లి, కనపర్తి కిరణ్మయి, జగడం సుమతి, న్యాపతి విజయ్‌తో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరుకానున్నారు.

    చంద్రబాబు బెయిల్ విచారణ వాయిదా

    ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు దాఖలు చేసుకున్న మందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను ఏపీ హైకోర్టు ఈ నెల 18కి వాయిదా వేసింది. అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌లో అవినీతి జరిగిందని చంద్రబాబుపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై చంద్రబాబు ముందస్తు బెయిల్‌కు పిటిషన్ దాఖలు చేయగా కోర్టు విచారణను వాయిదా వేసింది.

    లోకేష్ బెయిల్ పిటిషన్ హైకోర్టు డిస్పోజ్

    స్కిల్ స్కాం కేసులో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు డిస్పోజ్ చేసింది. కోర్టు ముందు వాదనలు వినిపించిన సీఐడీ.. లోకేష్‌ను అరెస్ట్ చేయం. కానీ 41ఏ కింద నోటీసులు అందిస్తాం. విచారణకు పిలుస్తాం అని పేర్కొంది. మరోవైపు ఆంగళ్లు కేసులో చంద్రబాబు పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది. రేపు బెయిల్ పిటిషన్‌పై తీర్పు వెలువరించనుంది.

    చంద్రబాబుకు గట్టి ఎదురు దెబ్బ

    చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్లు న్యాయస్థానం డిస్మిస్‌ చేసింది. అంగళ్ల అల్లర్ల, ఫైబర్‌ గ్రిడ్‌, ఐఆర్‌ఆర్‌ కేసుల్లో ముందస్తు బెయిల్‌ను హైకోర్టు నిరాకరించింది. బెయిల్ ఇవ్వాలని ఆయన పెట్టుకున్న 3 పిటిషన్లను కోర్టు తిరస్కరించింది.

    ఏపీ హైకోర్టు తరలింపుపై కేంద్రం క్లారిటీ

    ఏపీ హైకోర్టు తరలింపు అంశం న్యాయస్థానాల పరిధిలో ఉందని కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. రాష్ట్ర పునర్విభజన అనంతరం హైకోర్టును అమరావతిలో ఏర్పాటు చేశారని కేంద్రమంత్రి కిరణ్ రిజుజు స్పష్టం చేశారు. అమరావతి నుంచి కర్నూలుకు తరలించాలంటే రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు కలిసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. రాజ్యసభలో ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి కిరణ్ రిజుజు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. నాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించిన అనంతరం పునర్విభజన చట్టం ప్రకారం హైకోర్టును అమరావతిలో ఏర్పాటు … Read more