• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు

    నేడు దేశీయ స్టాక్‌ మార్కెట్‌లు స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ నష్టాలతోనే ప్రారంభమైయ్యాయి. ఉదయం 9:24 గంటల సమయంలో సెన్సెక్స్‌ 27 పాయింట్ల నష్టంతో 63,847 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 4 పాయింట్ల స్వల్ప నష్టంతో 19,075 దగ్గర కొనసాగుతోంది. యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, నెస్లే ఇండియా, టీసీఎస్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, టాటా స్టీల్‌, సన్‌ఫార్మా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

    మళ్లీ నష్టాల్లోకి దేశీయ మార్కెట్‌ సూచీలు

    దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. అమెరికాలో ఫెడ్‌ వడ్డీరేట్ల పెంపుపై నిర్ణయం మార్కెట్‌పై ప్రభావం చూపింది. ఉదయం పాజిటివ్‌గా ప్రారంభమైన మార్కెట్లు కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ఆఖర్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలు మరింత కిందకు దిగజారాయి. ఉదయం సెన్సెక్స్‌ 64,449.65 దగ్గర లాభాలతో ప్రారంభమైంది. చివరకు 237.72 పాయింట్ల నష్టంతో 63,874.93 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 19,232.95 దగ్గర ప్రారంభమై చివరకు 61.30 పాయింట్లు నష్టపోయి 19,079.60 దగ్గర ముగిసింది. .

    Stock Market: రెండో రోజు లాభాల్లో మార్కెట్లు

    నేడు దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా రెండో రోజూ లాభాల్లో ముగిశాయి. మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు, కార్పొరేట్‌ ఫలితాలు మార్కెట్లకు దన్నుగా నిలిచాయి. ఉదయం సెన్సెక్స్‌ 63,885.56 దగ్గర నష్టాలతో ప్రారంభమైంది. చివరకు 329.85 పాయింట్ల లాభంతో 64,112.65 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 19,053.40 దగ్గర ప్రారంభమై 93.65 పాయింట్లు లాభపడి 19,140.90 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.25 వద్ద నిలిచింది.

    నష్టాలకు బ్రేక్‌ పంజుకున్న స్టాక్ మార్కెట్లు

    గత ఆరు రోజుల నష్టాలను చవిచూస్తున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌‌లు నేడు బలంగా పుంజుకున్నాయి. ఉదయం నుంచి లాభాలతో ట్రేడింగ్‌ ప్రారంభమైంది. ఈ రోజంతా అదే జోరును కొనసాగింది. దేశియంగా కార్పొరేట్‌ ఫలితాలు సానుకూలంగా ఉండటం కలిసొచ్చింది. ఉదయం సెన్సెక్స్‌ 63,559.32 దగ్గర లాభాలతో ప్రారంభమైంది. చివరకు 634.65 పాయింట్ల లాభంతో 63,782.80 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 18,928.75 దగ్గర ప్రారంభమై 190 పాయింట్లు లాభపడి 19,047.25 దగ్గర ముగిసింది.

    భారీగా నష్టపోయిన దేశీయ స్టాక్ మార్కెట్లు

    దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి. ఉదయమే భారీ పతనంతో మొదలై అదే ట్రెండ్ కనసాగింది. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూలతలు మార్కెట్ల పతనానికి దారితీశాయి. ఉదయం సెన్సెక్స్‌ 63,774.16 దగ్గర నష్టాలతో ప్రారంభమైంది. చివరకు 900.91 పాయింట్ల నష్టంతో 63,148.15 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 19,027.25 దగ్గర ప్రారంభమై 259.20 పాయింట్లు నష్టపోయి 18,862.95 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.23 వద్ద నిలిచింది.

    నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

    దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. 102 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ 66,325 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. 18 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ 19,792 పాయింట్ల వద్ద కదలాడుతోంది. ఇన్ఫోసిస్, ఎస్‌బీఐ, సన్‌ఫార్మా, విప్రో, ఐటీసీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, HDFC బ్యాంక్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.22 వద్ద ప్రారంభమైంది.

    స్వల్ప నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

    దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ప్రారంభమయ్యాయి. 69 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ 66,213 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. 11 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ సూచీ 19,740 పాయింట్ల వద్ద కదలాడుతోంది. HCL టెక్, ONGC, కోల్ ఇండియా షేర్లు లాభాల్లో ఉన్నాయి. దివీస్ ల్యాబ్, ఏషియన్ పేయింట్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అటు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.24 వద్ద ప్రారంభమైంది.

    స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు

    దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 55 పాయింట్ల వృద్ధితో 66,528 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సూచీ 16 పాయింట్లు లాభపడి 19,828 పాయింట్ల వద్ద కదలాడుతోంది. SBI, ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. టెక్ మహీంద్రా, టీసీఎస్, నెస్లే ఇండియా, పవర్ గ్రిడ్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.83.15 వద్ద ప్రారంభమైంది.

    లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

    దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. 405 పాయింట్లు లాభంతో సెన్సెక్స్.. 65,361 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. 59 పాయింట్లు వృద్ధి చెందిన నిఫ్టీ 19,605 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. టాటా మోటార్స్, టైటాన్, సన్‌ఫార్మా, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఎయిర్ టెల్, టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 83.22 పైసల వద్ద కొనసాగుతోంది.

    వరుస నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

    దేశీయ స్టాక్ మార్కెట్లలో నష్టాల పరంపర కొనసాగుతోంది. 383 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ 65,129 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. 108 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ సూచీ 19,420 పాయింట్ల వద్ద కదలాడుతోంది. నెస్లే ఇండియా, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పేయింట్స్, HUL షేర్లు లాభాల్లో ఉన్నాయి. మారుతీ, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, పవర్ గ్రిడ్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. అటు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.24 వద్ద కొనసాగుతోంది.