• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అన్‌స్టాపబుల్ సీజన్-3 డేట్స్ ఫిక్స్

    నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ షో సీజన్-3 ఈనెల 17 నుంచి ఆహాలో టెలికాస్ట్ కానుంది. ఫస్ట్ ఎపిసోడ్‌లో ‘బాలయ్య నటించిన భగవంత్ కేసరి’ మూవీ టీం సందడి చేయనుంది. డెరెక్టర్ అనిల్ రావిపూడితో పాటు కాజల్, శ్రీలీల, అర్జున్ రామ్‌పాల్‌తో కూడిన ఫొటోలను విడుదల చేయగా ప్రస్తుతం అవి వైరల్‌గా మారాయి. బాలకృష్ణ మరోసారి ఈ ప్రోగ్రామ్‌లో సందడి చేయనుండటంతో నందమూరి అభిమానులు ఖుషీ అవుతున్నారు. కాగా, బాలయ్య నటించిన ‘భగవంత్ కేసరి’ 19న రిలీజ్ కానుంది.

    కవితను కాపాడేది బీజేపీనే: నారాయణ

    కేసీఆర్‌ కుమార్తె కవితను కాపాడేది బీజేపీ ప్రభుత్వమే అని సీపీఐ నేత నారాయణ ఆరోపించారు. మద్యం కుంభకోణంలో రాజీ ఒప్పందం కుదిరిన తర్వాతనే. వైసీపీ, కేసీఆర్‌, బీజేపీ కలిసి ఆమ్ ఆద్మీ పార్టీని అంతం చేయాలని కుట్ర పన్నారని చెప్పారు. అదానీ కుంభకోణంలో ఎందుకు సెబీ ఎంక్వెయిరీ వేయలేదని ప్రశ్నించారు. పెద్ద కుంభకోణం బయట పెడితే ఆయనను కాపాడుకుంటున్నారని నారాయణ దుయ్యబట్టారు.

    ఆ ప్రశ్నలనే తిప్పి తిప్పి అడిగారు: లోకేష్

    IRR కేసులో టీడీపీ నేత నారా లోకేష్ సీఐడీ విచారణకు హాజరయ్యారు. అధికారులు లోకేష్‌ను దాదాపు 47 ప్రశ్నలు అడిగారు. విచారణ తర్వాత బయటకు వచ్చిన లోకేష్ మీడియా మాట్లాడారు. హైకోర్టు ఒక్కరోజే విచారణకు హాజరవ్వాలని చెప్పింది. అధికారుల నోటీసు మేరకు రెండో రోజు హాజరైయ్యా.. వాషింగ్‌ మెషిన్‌లో తిప్పినట్లు మంగళవారం అడిగిన ప్రశ్నలనే తిప్పి తిప్పి అడిగారు. కొత్తగా ఎలాంటి ఆధారాలు నా ముందు పెట్టలేదు’ అని లోకేష్ తెలిపారు.

    విద్యార్థినిపై అధ్యాపకుడు అత్యాచారం

    Ap: విద్యాబుద్దులు నేర్పాల్సిన ఓ ప్రైవేటు అధ్యాపకుడు దారి తప్పాడు. ఓ విద్యార్ధిని బెదిరిస్తూ పులుమార్లు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ క్రమంలో గర్భం దాల్చిన ఆమెపై దాడికి కూడా పాల్పడ్డాడు. ఈ ఘటన మార్కాపురంలో చోటుచేసుకుంది. స్థానికంగా ఉండే ఓ కళాశాలలో విద్యార్ధిని ఇంటర్మీడియట్ చదువుతుంది. ఇంటి వద్ద దింపే నెపంతో సదరు విద్యార్థినిని ఓ రోజు అధ్యాపకుడు బైక్‌పై తీసుకెళ్లాడు. పట్టణ శివార్లలోకి తీసుకెళ్లి ఆమె అసభ్యకర చిత్రాలను ఫొటోలు తీసుకున్నాడు. అనంతరం బెదిరించి ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.

    హైకోర్టులో చంద్రబాబుకు స్వల్ప ఊరట

    చంద్రబాబు పిటిషన్‌లపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. అంగళ్ల కేసులో చంద్రబాబును రేపటి వరకు అరెస్టు చేయోద్దని ఆదేశించింది. IRR కేసులో వచ్చే సోమవారం వరకు చంద్రబాబును అరెస్టు చేయోద్దని స్టే ఇచ్చింది. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టు నేడు విచారణ జరిపింది. చంద్రబాబును అరెస్టు చేయకుండా ఉత్తర్యులు ఇవ్వాలని కోర్టును చంద్రబాబు తరపు న్యాయవాది కోరారు. ఈ దశలో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వదని సీఐడీ తరపు న్యాయవాది కోర్టుకు వాదనలు వినిపించారు.

    అన్నీ వేళ్లు చంద్రబాబు వైపే: సజ్జల

    చంద్రబాబు అరెస్ట్‌పై టీడీపీ నాయకులు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల విమర్శించారు. ‘నేరం జరగలేదని చంద్రబాబు నిరూపించుకోగలరా? ఊరు పేరు లేకుండా అగ్రిమెంట్ తయారు చేయించారు. సీమెన్ సంస్థ కూడా మాకు సంబంధం లేదని తెలిపింది. అన్ని వేళ్లు చంద్రబాబు వైపే చూపిస్తున్నాయి. అన్నీ ఆధారాలతోనే సీఐడీ అధికారులు చంద్రబాబును అరెస్ట్ చేశారు’ అని చెప్పుకొచ్చారు.

    చంద్రబాబు, లోకేష్‌ వాగుడుతోనే ఇదంతా: అంబటి

    చంద్రబాబు, లోకేష్‌ వాగుడుతోనే ఇక్కడ దాకా తెచ్చుకున్నారని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. ‘వైఎస్ రాజశేఖర్ రెడ్డి నన్నేం చేయలేక పోయాడు. జగన్ నన్ను ఏం పీకుతాడన్న చంద్రబాబు మాటలకు సమాధానం ఇప్పుడు వచ్చింది. రెండు పీకి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపారు. టీడీపీ పాలనలో చేసిన దోపిడీ బయటపడింది. పైగా కక్ష సాధింపు అని మాట్లాడుతున్నారు. అదే అయితే మొదటి సంవత్సరమే లెక్క చూసే వాళ్లం. ఆధారాలు బయట పడ్డాయి కాబట్టే సీఐడీ అరెస్ట్‌ చేసింది’ అని చెప్పుకొచ్చారు.

    IND VS AFG: టాస్ గెలిచిన అఫ్గానిస్థాన్

    వరల్డ్‌కప్‌లో భాగంగా ఢిల్లీ వేదికగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గానిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. జట్ల వివరాలు: ఆఫ్ఘనిస్తాన్: రహ్మానుల్లా గుర్బాజ్(w), ఇబ్రహీం జద్రాన్, రహమత్ షా, హష్మతుల్లా షాహిదీ(సి), నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, నవీన్-ఉల్-హక్, ఫరూఖల్ హాక్. భారత్ : రోహిత్ శర్మ (సి), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (W), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ … Read more

    ఆధారాలతోనే చంద్రబాబు అరెస్ట్: మంత్రి అంబటి

    తమకు కక్ష సాధించాల్సిన అవసరం లేదని.. చంద్రబాబు అవినీతిపై ఆధారాలు ఉన్నాయి కాబట్టే పోలీసులు అరెస్టు చేశారని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. గుంటూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఏపీలో త్వరలో ఎన్నికలు రాబోతున్నాయని, 175 స్థానాల్లో విజయం సాధించడమే తమ లక్ష్యమని అంబటి అన్నారు. ఈ నెల 26 నుంచి బస్సు యాత్రతో పాటు ‘మళ్లీ జగనే ఎందుకు కావాలి’ అనే కార్యక్రమం సైతం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

    ప్రయాణికులకు ఏపీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్

    ఏపీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. దసరా రద్దీని దృష్టిలో ఉంచుకొని అదనంగా 5500 ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకువస్తోంది. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది సైతం ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయడం లేదని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ప్రత్యేక బస్సుల్లో పది శాతం డిస్కౌంట్ సైతం ఇస్తున్నామన్నారు. గత ఏడాది రావడానికి, వెళ్లడానికి రెండు వైపులా టికెట్ తీసుకుంటేనే రాయితీ ఇచ్చామని.. ఈ సారి మాత్రం ఒకవైపు టికెట్ తీసుకున్నా ఇది వర్తిస్తుందని చెప్పారు.