• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చంద్రబాబు ఆడేది సింపతి గేమ్: అమర్నాథ్

    టీడీపీ అధినేత చంద్రబాబు సింపతి కోసం ప్రయత్నిస్తున్నారని మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. చంద్రబాబు వెల్ నెస్ సెంటర్‌లో కాదు జైల్లో ఉన్నారు.. నేరం చేసినవాళ్లు ఉండేందుకే జైళ్లను పెట్టింది. డీహైడ్రేషన్ వచ్చినా, దోమలు కుట్టిన జైళ్లలో అన్ని రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్య ఇబ్బందులపై ప్రచారంతో సింపతీ కోసం చంద్రబాబు గేమ్ ఆడుతున్నారు అని ఆరోపించారు.

    శంషాబాద్‌లో భారీ భూ కుంభ కోణం

    శంషాబాద్ పరిధిలో భారీ భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. కొంత ప్రభుత్వాధికారులు, రియల్టర్‌లతో కలిసి రూ.1000 కోట్ల విలువైన భూముల రికార్డులు మార్చేశారు. సుమారు 150 ఎకరాల భూమిని రియాల్టర్లకు అప్పగించారు. పెద్ద గొల్కొండ గ్రామంలో 190 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. 25 ఏళ్ల కిందట ఈ భూమిని పేద రైతులకు పంపిణీ చేసింది. ఇవి అసైన్డ్ భూములు వీటిని కొనడం గాని అమ్మటం గాని చేయరాదు. అయితే వీటి రికార్డులు మార్చి రియాల్టర్లకు అప్పగించారు ప్రభుత్వాధికారులు.

    మీడియాకు రేవంత్ రెడ్డి వార్నింగ్

    టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియాకు వార్నింగ్ ఇచ్చారు. ఇష్టారీతిన తప్పుడు వార్తలు రాస్తే ఉపేక్షించమని స్పష్టం చేశారు. రాజకీయ నిరసనతో పాటు క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. కొన్ని మీడియా సంస్థలు అదే పనిగా కాంగ్రెస్ నాయకుల మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు రాస్తున్నట్లు విమర్శించారు. ఈ వార్తల వల్ల కిందిస్థాయి కాంగ్రెస్ కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం దెబ్బతింటోందని చెప్పుకొచ్చారు.

    నేడు సీఐడీ విచారణకు నారా లోకేష్

    సీఐడీ ముందు రెండో రోజు విచారణకు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ హాజరుకానున్నారు. ఐఆర్ఆర్ కేసులో ఏ14 గా ఉన్న లోకేష్‌ను నిన్న ఆరు గంటల పాటు సీఐడీ అధికారులు ప్రశ్నించారు. మరింత లోతుగా ప్రశ్నించాల్సి ఉందని మరోసారి 41ఏ నోటీసు ఇచ్చారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని సీఐడీ ఆఫీసుకు లోకేష్ రానున్నారు. మరోవైపు నిన్న జరిగిన విచారణలో కేసుతో సంబంధం లేని ప్రశ్నలను అధికారులు అడిగారని ఆరోపించారు.

    దసరా వేడుకలకు రావాలని సీఎం జగన్‌కు ఆహ్వానం

    దసరా మహోత్సవాలకు రావాలని సీఎం జగన్‌ను దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణతో పాటు ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ, శ్రీశైల మల్లన్న ఆలయాల ధర్మకర్తల మండలి ప్రతినిధులు కలిసి ఆహ్వానించారు. ఈ నెల 15 నుంచి 23 వరకు ఇంద్రకీలాద్రిపై, 15 నుంచి 24 వరకు శ్రీశైలంలో దసరా ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో వేడుకలకు రావాలని సీఎం జగన్‌కు ఆహ్వానపత్రికలు అందజేశారు.

    110 స్థానాల్లో బీజేపీకి డిపాజిట్లు దక్కవు: కేటీఆర్

    అబద్దాల అమిత్ షా పార్టీకి తెలంగాణలో ప్రజలు గుణపాఠం చెప్పక తప్పదని మంత్రి కేటీఆర్ అన్నారు. ‘అమిత్ షా ప్రసంగం ఆసాంతం అబద్ధాలే. అమిత్ షా- మోదీ ఎన్ని అబద్ధాలు ఆడిన తెలంగాణలో బీజేపీకి ప్రజల చేతుల్లో తిరస్కారం తప్పదు. మళ్లీ ఎన్నికల్లోనూ 110 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతు అవడం ఖాయం. పరివార్ వాద్ అంటూ అమిత్ షా మాట్లాడితే ప్రజలు పరిహాసం చేస్తున్నారు. అమిత్ షా కొడుకు ఎప్పుడు క్రికెట్ ఆడారో దేశ ప్రజలకు స్పష్టం చేయాలి అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

    నేడు చంద్రబాబు పిటిషన్ విచారణ

    నేడు ఏపీ హైకోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్ (IRR) కేసు, అంగళ్లు కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు వేసిన పిటిషన్లపై విచారణ జరగనుంది. అటు ఏసీబీ కోర్టులో IRR, ఫైబర్ నెట్ కేసుల్లో చంద్రబాబుపై సీఐడీ వేసిన పిటి వారెంట్లపై కూడా విచారణ జరగనుంది. మరోవైపు సుప్రీంకోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ విచారణను శుక్రవారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

    నిబంధనల అమలులో కఠినంగా వ్యవహరించాలి

    ఎన్నికల నిబంధనల అమలులో కఠినంగా వ్యవహరించాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలకు సూచించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. నగదు, మద్యం పంపిణీని అడ్డుకునేందుకు తనిఖీలు ముమ్మరం చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో 46 సమస్యాత్మక నియోజకవర్గాలు ఉండగా, అందులో 13 తీవ్ర సమస్యాత్మకమైనవిగా గుర్తించామన్నారు. ఈనెల 31 వరకు ఓటు నమోదు చేసుకోవచ్చని చెప్పారు.

    17 రోజులు.. 41 భారీ బహిరంగ సభలు

    అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి దూకుడు మీదున్న బీఆర్ఎస్ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళిక సిద్దం చేసుకుంటుంది. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ ప్రచార షెడ్యూల్‌ను ఆ పార్టీ ప్రకటించింది. ఆయన 17 రోజుల్లో 41 భారీ బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యే నవంబంర్ 3వ తేదీ నాటికే సీఎం కేసీఆర్ 26 సభలకు హాజరయ్యేలా ప్రణాళిక రచించారు. కాగా, తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి.

    చంద్రబాబుకు డీహైడ్రేషన్‌

    చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై కుటుంబసభ్యులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఉక్కపోతతో డీహైడ్రేషన్‌కు గురయ్యారు. గత కొద్ది రోజులుగా జైల్లో ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గుల కారణంగా తీవ్రమైన ఉక్కపోత నెలకొంది. చంద్రబాబు ఉంటున్న బ్లాక్‌లో ఫ్యాన్‌ కూడా లేకపోవడంతో ఆయన ఉక్కపోతకు గురయ్యారు. తాను డీహైడ్రేషన్‌కు గురయ్యాననే విషయాన్ని చంద్రబాబు.. వైద్యాధికారికి కూడా ఫిర్యాదు చేశారు.