• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • దానిపై ఒక్క ప్రశ్న కూడా వేయలేదు: లోకేష్

    టీడీపీ నేత నారా లోకేష్ సీఐడీ విచారణ ముగిసింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీఐడీ అధికారులు లోకేష్‌ను ప్రశ్నించారు. విచారణ తర్వాత బయటకు వచ్చిన లోకేష్ మీడియాతో మాట్లాడారు. అధికారులు ఇన్నర్ రింగ్ రోడ్డుతో సంబంధం లేని ప్రశ్నలు అడిగారు. నన్ను సీఐడీ 50 ప్రశ్నలు అడిగింది. అందులో ఈ కేసులో నేను ఎలా లాభపడ్డానో ఒక్క ప్రశ్న కూడా వేయలేదు. కక్ష సాధింపు కోసమే నాపై ఎలాంటి ఆధారాలు లేని కేసు పెట్టారు. మళ్లీ రావాలని … Read more

    చంద్రబాబు క్వాష్ పిటిషన్ శుక్రవారానికి వాయిదా

    చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. ఉదయం 10 గంటల నుంచి హరీష్ సాల్వే, ముకుల్ రోహత్గి మధ్య వాడి వేడిగా వాదనలు జరిగాయి. వాదనలు మొత్తం అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17ఏ చుట్టే తిరిగాయి. 17ఏ చంద్రబాబుకు వర్తిస్తుందని సాల్వే, వర్తించదని రోహత్గి బలంగా వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

    సీఐడీ విచారణకు లోకేష్

    ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సీఐడీ విచారణకు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ హాజరయ్యారు. 10 గంటలకు విచారణ ప్రారంభమైంది. హెరిటేజ్ సంస్థకు లబ్ధి చేకూరేలా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ చేంజ్ చేశారని లోకేష్‌పై సీఐడీ అభియోగాలు మోపింది. రాష్ట్ర విభజనకు ముందు హెరిటెజ్ సంస్థ రాజధానికి 30 కిలోమీటర్ల దూరంలో 9 ఎకరాలు ల్యాండ్ కొంటే అవినీతి ఎలా అవుతుందని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు విచారణ సాగనుంది.

    రాళ్ల మధ్యలో యువతి.. 12 గంటలు నరకం

    విశాఖపట్నం అప్పికొండ బీచ్‌లో రాళ్ల మధ్య ఇరుక్కుపోయిన యువతి 12 గంటల పాటు నరకం అనుభవించింది. కృష్ణా జిల్లాకు చెందిన కావ్య, వర్మ రాజు ఈనెల 2 నుంచి అప్పికొండ ప్రాంతంలో ఉంటున్నారు. ఆదివారం సాయంత్రం ఫొటోలు తీసుకుంటుండగా కావ్య రాళ్ల మధ్యలో జారిపడిపోయింది. దీంతో రాజు అక్కడి నుంచి పరారయ్యాడు. సోమవారం ఉదయం ఆమె కేకలు విన్న జాలర్లు అతికష్టం మీద బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. కాగా, కావ్య కనిపించడం లేదంటూ ఆమె తల్లి మచిలీపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

    చంద్రబాబు పిటిషన్‌పై వాడి వేడిగా వాదనలు

    సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై వాడి వేడిగా వాదనలు జరుగుతున్నాయి. చంద్రబాబు తరఫున సీనియర్ లాయర్ హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. ‘ఈ కేసు మూలంలోనే తప్పు ఉంది. అన్నీ కలిపి ఒక ఎఫ్‌ఐఆర్ తయారు చేశారు. ఇందులోని ఎఫ్‌ఐఆర్ చట్టబద్దం కాదు. 164 కింద తీసుకున్న వాంగ్మూలం ఆధారంగా కేసును నిర్మించారు. దానిని సవాలు చేస్తున్నాం’ అని వాదించారు. సీఐడీ తరఫున ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ.. ‘చంద్రబాబుపై తగినన్ని ఆధారాలు లభించాక 2021లో సీఐడీ కేసు నమోదు చేసింది. 17A చట్ట … Read more

    శ్రీనివాస్ గౌడ్‌కు హైకోర్టులో ఉపశమనం

    మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు హైకోర్టులో ఉపశమనం లభించింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ మహబూబ్ నగర్‌కు చెందిన రాఘవేంద్రరాజు అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల ఆఫిడవిట్‌లో ఆస్తులకు సంబంధించిన అంశాలను శ్రీనివాస్ గౌడ్ తప్పుగా చూపించారని పేర్కొన్నారు. ఒకసారి అఫిడవిట్ సమర్పించాక రిటర్నింగ్ అధికారి నుంచి తిరిగి తీసుకుని దానిని సవరించారని చెప్పుకొచ్చారు. ఇది ఎన్నికల నిబంధలకు విరుద్ధమని తెలిపారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం పిటిషన్‌ను కొట్టివేసింది.

    త్వరలో అన్‌స్టాపబుల్ సీజన్-3

    నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ షో సీజన్-3 త్వరలో ప్రారంభం కానుంది. మొదటి రెండు సీజన్లకు మించి ఈసారి వినోదం పంచేందుకు ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. దసరా నుంచి ప్రారంభం కానున్న ఈ సీజన్ మొదటి ఎపిసోడ్‌లో ‘భగవంత్ కేసరి’ మూవీ టీం సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీని గురించి అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. కాగా, బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ ఈ నెల 19న థియేటర్లలోకి రానుంది.

    శ్రీవారిని దర్శించుకున్న కేసీఆర్ సతీమణి

    సీఎం కేసీఆర్ సతీమణి శోభ ఈ రోజు తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న రాత్రి తిరుమల చేరుకున్న శోభ ఈ రోజు స్వామి వారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆమెకు టీటీడీ అధికారులు స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు. కాగా, తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వ దర్శనానికి 8 గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. Kalvakuntla Shobha, wife of Telangana CM #KCR, went to #Tirumala Monday … Read more

    నేడు ఈడీ ఎదుట నవదీప్ హాజరు

    హైదరాబాద్‌- నేడు ఈడీ ఎదుట హీరో నవదీప్ హాజరుకానున్నారు. మధాపూర్ డ్రగ్స్ కేసులో ముగ్గురు నైజీరియన్లతో హీరో నవదీప్‌కు పరిచయాలు ఉన్నట్టు అభియోగాలు ఉన్నాయి. వీరితో జరిపిన లావాదేవీలపై ఈడీ ఆరా తీయనుంది. మాదాపూర్ డ్రగ్స్ కేసు వివరాలు ఇవ్వాలంటూ ఇప్పటికే నార్కోటిక్ పోలీసులను ఈడీ కోరిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ విక్రయాల ద్వారా మనీ లాండరింగ్ జరిగిందన్న కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది.

    గ్రూప్2 పరీక్షలు జరిగేనా..?

    తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో పలు రకాల పోటీ పరీక్షలు వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. నవంబర్ 3 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో 2, 3 తేదీల్లో జరగాల్సిన గ్రూప్2 పరీక్షలపై సందిగ్ధత నెలకొంది. ఎన్నికల ప్రక్రియతో పాటు గ్రూప్స్ పరీక్షలకు పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు అవసరం ఉండటమే దీనికి కారణం. నవంబర్ 30న ఎన్నికలు ఉన్న నేపథ్యంలో 25 నుంచి 30 వరకు జరగాల్సిన టీఆర్‌టీ-ఎస్‌జీటీ పరీక్షలు సైతం వాయిదా పడే అవకాశం ఉంది.