నేడు ఆదిలాబాద్లో బీజేపీ బహిరంగ సభ
నేడు ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ బహిరంగ సభకు కేంద్రమంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. ఆదిలాబాద్లోని 7 నియోజకవర్గాలు కవర్ అయ్యేలా జనసమీకరణ చేస్తున్నారు. సుమారు లక్షమందిని సభకు తీసుకొచ్చేందుకు కమలనాథులు ప్రయత్నిస్తున్నారు. ఆదిలాబాద్లోని డైట్ మైదానంలో మధ్యాహ్నం ఒంటిగంటకు సభ ప్రారంభం కానుంది. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ సహా ఇతర ముఖ్య నేతలు సభకు హాజరుకానున్నారు.