• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అన్నం పెట్టిన అమ్మాయిపైనే అత్యాచారం

    ఓ బాలికపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారం చేసిన దారుణ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగింది. బిహార్‌కు చెందిన ధర్మేందర్, ఓ బాలిక వారం రోజులుగా అద్దె ఇంట్లో ఊంటూ సహజీవనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ధర్మేందర్ పార్టీ ఇస్తానని చెప్పడంతో అతడి స్నేహితులు ఇంటికి వచ్చారు. వారందరికీ బాలిక వంట చేసి వడ్డించింది. భోజనం చేసిన తర్వాత ధర్మేందర్‌ను బయటకు గెంటేసి ఆమెపై అత్యాచాారానికి పాల్పడ్డారు. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

    4 కీలక కార్యక్రమాలు ప్రకటించిన జగన్

    వైసీపీ ప్రతినిధులతో సమావేశమైన సీఎం జగన్.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పలు ప్రకటనలు చేశారు. ఈమేరకు నాలుగు కీలక కార్యక్రమాలు రూపొందించారు. జగనన్న ఆరోగ్య సురక్షా, వై ఏపీ నీడ్స్ జగన్, బస్సు యాత్ర, ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాలు జగన్ ప్రకటించారు. అలాగే చంద్రబాబు- పవన్ కళ్యాణ్‌ను ఎలా ఎదుర్కోవాలో పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. చంద్రబాబు అరెస్ట్‌పై ప్రజలకు అర్థం అయ్యేలా వివరించాలని సూచించారు.

    చంద్రబాబుకు గట్టి ఎదురు దెబ్బ

    చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్లు న్యాయస్థానం డిస్మిస్‌ చేసింది. అంగళ్ల అల్లర్ల, ఫైబర్‌ గ్రిడ్‌, ఐఆర్‌ఆర్‌ కేసుల్లో ముందస్తు బెయిల్‌ను హైకోర్టు నిరాకరించింది. బెయిల్ ఇవ్వాలని ఆయన పెట్టుకున్న 3 పిటిషన్లను కోర్టు తిరస్కరించింది.

    కాంగ్రెస్‌లో షర్మిల పార్టీ విలీనానికి బ్రేక్

    కాంగ్రెస్ పార్టీలో షర్మిల పార్టీ విలీనానికి బ్రేక్ పడింది. మొన్నటి వరకు YSRTP పార్టీని కాంగ్రెస్‌లో షర్మిల విలీనం చేస్తారని అందరూ భావించారు. కానీ ఆమె పాలేరు నుంచి పోటీకి సిద్ధమయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. పాలేరు సీటు కోసం ఆమె పట్టుబట్టినప్పటికీ కాంగ్రెస్ ఒప్పుకోలేదు. జాతీయ కార్యదర్శి పదవితో పాటు ఖమ్మం ఎంపీ స్థానానని ఆఫర్ చేసింది. దీంతో డీల్ సెట్ కాకపోవడంతో పాలేరు నుండి పోటీకి షర్మిల రెడీ అయింది. ముందు నుంచి షర్మిల రాకను పీసీసీ … Read more

    39 మందితో బీజేపీ తొలి జాబితా

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా ఆ పార్టీ హైకమాండ్‌కు చేరింది. దీని ఆధారంగా ఈనెల 14 తర్వాత 39 మందితో కూడిన జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో పోటీ చేసి నియోజకవర్గంలో యాక్టీవ్‌గా ఉన్న వారికి తొలి జాబితాలో చోటు కల్పించినట్లు తెలుస్తోంది. కాగా, రేపు అమిత్ షా పర్యటన నేపథ్యంలో ఆదిలాబాద్, రాజేంద్రనగర్‌లో సభలు నిర్వహించాల్సి ఉండగా.. ఆదిలాబాద్ సభ మాత్రమే నిర్వహిస్తున్నారు. ముఖ్య నేతలతో ఆయన సమావేశం కానున్నారు.

    నేడు వైసీపీ ప్రతినిధుల సభ

    నేడు సీఎం జగన్ అధ్యక్షతన వైసీపీ ప్రతినిధుల సభ జరగనుంది. ఉదయం 9.30 నిమిషాలకు సభ ప్రారంభం కానుంది. 10.30 నిమిషాలకు సభ ప్రాంగణానికి జగన్ చేరుకోనున్నారు. 8,500 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. ఈ మీటింగ్‌లో తొలిసారి బార్ కోడింగ్ పాస్‌లను వైసీపీ జారీ చేసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం జగన్ పార్టీ ప్రతినిధులకు దిశా నిర్దేశం చేయనున్నారు.

    భారీగా పెరిగిన బంగారం ధరలు

    తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 400 పెరిగి రూ. 53,150కి ఎగబాకింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 440 పెరిగి 57,980కి పెరిగింది. అటు కిలో వెండి ధర రూ. 75 వేల వద్ద కొనసాగుతోంది. విజయవాడలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. గత కొద్ది రోజులుగా తగ్గుతున్న బంగారం ధరలు.. డిమాండ్ పెరగడంతో మళ్లీ పెరిగాయి.

    బిగ్ బాస్-7 సీజన్‌లో సరికొత్త ట్రెండ్

    బిగ్ బాస్-7 సీజన్‌లో సరికొత్త ట్రెండ్ కనిపిస్తోంది. గత సీజన్లకు భిన్నంగా ఏకంగా ఐదుగురు కంటెస్టెంట్లను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌజ్‌లోకి పంపించి ఆశ్చర్యపరిచారు. వరుసగా 5 వారాల పాటు ఐదుగురు మహిళా కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేసిన బిగ్‌బాస్ ఈ వారం శుభశ్రీ, గౌతమ్ కృష్ణలను ఒకేసారి ఎలిమినేట్ చేసి షాక్ ఇచ్చారు. అంబటి అర్జున్, అశ్వినీశ్రీ, నయని పావని, పూజా మూర్తి, భోలే షావలి హౌజ్‌లోకి ఎంటర్ అయ్యారు. ‘టైగర్ నాగేశ్వరరావు’ ప్రమోషన్స్‌లో భాగంగా రవితేజతో పాటు హీరోయిన్స్ హౌజ్‌లో సందడి … Read more

    తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ

    తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి 4 గంటల వరకు సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్సుల్లోని 2 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 70,515 మంది భక్తులు దర్శించుకున్నారు. మరో 27,230 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఆదివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.23 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

    నేడు చంద్రబాబు పిటిషన్ విచారణ

    సుప్రీంకోర్టులో నేడు చంద్రబాబు పిటిషన్ విచారణకు రానుంది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆయన పెట్టుకున్న క్వాష్ పిటిషన్‌పై న్యాయస్థానం విచారించనుంది. ఈ కేసు ఐటెం నంబర్ 59గా లిస్టైంది. చంద్రబాబు తరఫున హరీష్ సాల్వే, అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించనున్నారు. అవినీతి నిరోధక చట్టంలో కొత్తగా చేర్చిన 17ఏ సేక్షన్‌ను అనుసరించి సీఎం స్థాయి వ్యక్తిని అరెస్ట్‌ చేసేటప్పుడు గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని లాయర్లు వాదిస్తున్నారు.