• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అమిత్‌షాతో పురందేశ్వరి భేటి

    కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ఏపీ భాజపా చీఫ్‌ పురందేశ్వరి భేటి అయ్యారు. ఏపీలో గత నాలుగున్నరేళ్లలో మద్యం విధానంలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. మద్యం కొనుగోళ్లు, అమ్మకాలకు సంబంధించిన విషయాలపై హోం మంత్రికి వినతిపత్రం అందజేశారు. ఓ మద్యం దుకాణంలో రూ.లక్ష వరకూ విక్రయాలు జరగ్గా.. కేవలం రూ.700కు మాత్రమే డిజిటల్‌ చెల్లింపులు జరిగాయని ఇటీవల పురందేశ్వరి ఆరోపించారు. మద్యం ద్వారా వచ్చిన నగదు వైకాపా నేతల జేబుల్లోకి వెళ్తున్నాయని విమర్శించారు.

    ఫ్లాగ్‌ను మార్చిన భారత వైమానిక దళం

    భారత వైమానిక దళం తన ఫ్లాగ్‌ను మార్చింది. వైమానిక దళం 91వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లో ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి కొత్త జెండాను ఆవిష్కరించారు. 72 సంవత్సరాల తర్వాత వైమానిక దళం ఫ్లాగ్‌ను మార్చడం విశేషం. CDS జనరల్ అనిల్ చౌహాన్ సమక్షంలో ఎయిర్‌ ఫోర్స్‌ ఫ్లాగ్‌ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కొత్త జెండాను వైమానిక దళం విలువలు, సేవలను ప్రతిబింబించేలా రూపొందించారు. పాత ఫ్లాగ్‌ను ఎయిర్‌ఫోర్స్‌ మ్యూజియంలో ప్రదర్శించనున్నారు.

    వైసీపీ ఎమ్మెల్యేపై హత్యాయత్నం

    AP: వైసీపీకి చెందిన పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణపై హత్యాయత్నం జరిగింది. ఎమ్మెల్యే శంకర్ నారాయణ కారుపై దుండగులు బాంబు దాడి చేశారు. బాంబు పేలకపోవటంతో ప్రమాదం తప్పింది. గోరంట్ల మండలం గడ్డం తాండాలో ఈ ఘటన జరిగింది. ఎమ్మెల్యే తన సిబ్బందితో కలిసి కారులో ప్రయాణిస్తుండగా దుండగులు బాంబులు విసిరారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఓ అనుమానితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఎలక్ట్రికల్ డిటోనేటర్లు విసిరినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

    మంత్రి ఇంటిపై బాంబు దాడి

    మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు కొనసాగుతునే ఉన్నాయి. తాజాగా ఇంఫాల్‌లో ఆ రాష్ట్ర మంత్రి యుమ్నం ఖేమ్‌చంద్ ఇంటి బయట బాంబు పేలింది. శనివారం రాత్రి 10 గం.ల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి బైక్‌పై వచ్చాడు. మంత్రి ఇంటిపై గ్రెనెేడ్‌ వంటి బాంబు విసిరాడు. అది పేలడంతో అక్కడ సెక్యూరిటీగా ఉన్న CRPF జవాన్, స్థానిక మహిళ గాయపడ్డారు. పేలుడు గురించి తెలుసుకున్న సీఎం బీరెన్ సింగ్ ఘటనాస్థలానికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితిని సమీక్షించారు. మంత్రి భద్రత పెంచాలని ఆదేశించారు.

    బండారుపై సుప్రీంకోర్టుకు వెళ్తా: రోజా

    AP: టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి వ్యాఖ్యలపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు మంత్రి ఆర్కే రోజా అన్నారు. న్యాయపరంగా పోరాడతానని స్పష్టం చేశారు. ‘మహిళలను కించపరిస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారు. చంద్రబాబు జైలుకెళ్లడంతో టీడీపీ నేతలకు పిచ్చెక్కింది. చంద్రబాబు తప్పు చేయకుంటే ఎందుకు బయటకు రాలేకపోతున్నారు?. టీడీపీ ఫెయిల్యూర్‌ను డైవర్ట్ చేయడానికే నన్ను టార్గెట్ చేశారు. టీడీపీ, జనసేనకు దిగజారుడు రాజకీయాలే తెలుసు’ అని రోజా అన్నారు.

    బైడెన్‌పై ట్రంప్‌ సంచలన ఆరోపణలు

    ఇరాన్‌కు అమెరికా అందించిన నిధులతోనే హమాస్‌ ఇజ్రాయెల్‌పై దాడి చేస్తోందని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. అమెరికా ప్రజలు చెల్లించిన పన్నులతోనే ఈ దాడులకు నిధులు అందడం అవమానకరమని ట్రంప్ పేర్కొన్నారు. ‘ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడులు బాధాకరం. బలమైన శక్తితో దాడులను తిప్పికొట్టే హక్కు ఇజ్రాయెల్‌కు ఉంది. ఈ దాడులకు అమెరికా నుంచి నిధులు అందడం అత్యంత అవమానకరం. బైడెన్‌ యంత్రాంగం నుంచి బయటికి వచ్చిన పలు నివేదికలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి’ అని ట్రంప్ ఆరోపించారు.

    ‘రూ.1500 కోట్లకు పవన్‌ అమ్ముడుపోయారు’

    AP: జనసేన అధ్య­క్షుడు పవన్‌ కళ్యాణ్‌ రూ.1,500 కోట్లకు అమ్ము­డుపోయాడని ప్రజాశాంతి పార్టీ చీఫ్‌ కేఏ పాల్‌ ఆరోపించారు చెప్పారు. పవన్‌ రోజుకో మాట మాట్లాడతారని మండిపడ్డారు. ఒక రోజు ఎన్డీఏలో ఉన్నానంటాడని, మరొక రోజు లేనని చెబుతాడని విమర్శించారు. చంద్రబాబు స్టీల్‌ ప్లాంట్‌ కోసం ఏనాడు పోరాటం చేయలేదని ధ్వజమెత్తారు. ఆయన అదానీకి అమ్ముడుపోయాడని ఆరో­పించారు. చంద్రబాబు అమరావతి కడతానని కట్టలేదని, పోలవరం పూర్తి చేయలేదని, ప్రత్యేక హోదా సాధించలేదని మండిపడ్డారు.

    హనీమూన్‌కు తీసుకెళ్లి భర్త రాక్షసత్వం

    కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి తన భార్యతో కర్కసంగా ప్రవర్తించాడు. బెంగళూరుకు చెందిన నిందితుడు భార్యను హనీమూన్‌కు తీసుకెళ్లి నగ్న వీడియోలను ఫోన్‌లో చిత్రీకరించాడు. వాటిని అడ్డం పెట్టుకొని రూ.10 లక్షలు డబ్బుతోపాటు, ప్రతి నెలా వచ్చే జీతం మెుత్తాన్ని తనకే ఇవ్వాలని బెదిరించాడు. వివాహిత ఫిర్యాదుపై బసవనగుడి మహిళా ఠాణాలో కేసు నమోదైంది. తనకు సొంత నిర్మాణ సంస్థ ఉందని పెళ్లికి ముందు చెప్పిన తన భర్త.. నిజానికి నిరుద్యోగి అని ఆమె పోలీసులకు వివరించింది.

    స్వల్పంగా పెరిగిన గోల్డ్.. ధర ఎంతంటే!

    పసిడి ధరలు వరుసగా రెండో రోజూ స్వల్పంగా పెరిగాయి. 22, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌పై రూ. 250, రూ.310 చొప్పున పెరిగింది. దీంతో ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ. 52,900కు పెరిగింది. అలాగే 24 క్యారెట్ల మేలిమి బంగారం రూ.57,690 చేరింది. ఢిల్లీతో పోలిస్తే హైదరాబాద్‌లో గోల్డ్ రేటు చాలా తక్కువగా ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల గోల్డ్ రూ.52,750 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.57,540 చేరింది. అటు ఏపీలోని విజయవాడ, విశాఖ నగరాల్లోనూ … Read more

    చంద్రబాబుకు మద్దతుగా ‘కాంతితో క్రాంతి’

    చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా టీడీపీ నేతలు వినూత్న కార్యక్రమం చెప్పట్టారు ‘కాంతితో క్రాంతి’ పేరుతో టీడీపీ నిరసన చేపట్టింది. రాత్రి 7 గంటల నుంచి టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఇళ్లలో లైట్లు ఆపి, దీపాలు వెలిగించి నిరసన తెలిపారు. రాజమహేంద్రవరంలో నారా భువనేశ్వరి, దిల్లీలో లోకేష్, హైదరాబాద్‌లో బ్రాహ్మణి దీపాలు వెలిగించి చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు.