చంద్రబాబు బెయిల్పై తీర్పు వాయిదా
చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. ఐదు రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని సీఐడీ తరఫు న్యాయవాదులు వాదించారు. ఇదివరకే చంద్రబాబును కస్టడీకి అప్పగించినందునా మరోసారి కస్టడీకి ఇవ్వొద్దని చంద్రబాబు లాయర్లు వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును సోమవారానికి వాయిదా వేసింది.