• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చంద్రబాబు బెయిల్‌పై తీర్పు వాయిదా

    చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. ఐదు రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని సీఐడీ తరఫు న్యాయవాదులు వాదించారు. ఇదివరకే చంద్రబాబును కస్టడీకి అప్పగించినందునా మరోసారి కస్టడీకి ఇవ్వొద్దని చంద్రబాబు లాయర్లు వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును సోమవారానికి వాయిదా వేసింది.

    ఏపీలో టీడీపీ అల్లకల్లోలం సృష్టిస్తోంది: కారుమూరి

    ఏపీలో అల్లకల్లోలం సృష్టించాలని టీడీపీ కుట్రలు పన్నుతోందని వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావు ఆరోపించారు. ‘ప్రజలు చంద్రబాబు గురించి ఆలోచించడం లేదు. చంద్రబాబు ప్రజల దగ్గరకు యాక్టర్లను పంపిస్తుంటే.. జగన్ డాక్టర్లను పంపిస్తున్నారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు చెప్పుకోవటానికి ఒక్క పథకం కూడా లేదు. చంద్రబాబు ఇన్నేళ్ళు స్టేల మీదే బతికాడు. శిశుపాలుడిలా చంద్రబాబు పాపం పండింది అంటూ విమర్శలు గుప్పించారు.

    లండన్ పర్యటనకు ఎమ్మెల్సీ కవిత

    బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత లండన్ పర్యటనకు వెళ్లారు. ఆమె శుక్రవారం బ్రిడ్జ్ ఇండియా సంస్థ నిర్వహించే ఓ కార్యక్రమంలో పాల్గొననున్నారు. సెంట్రల్ హాల్ వెస్ట్ మినిస్టర్‌లో ‘మహిళా రిజర్వేషన్ చట్టం- ప్రజాస్వామ్య ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం’ అనే అంశంపై ఉపన్యాసం ఇవ్వనున్నారు. శనివారం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్, అటుమ్ని సమావేశంలో కవిత పాల్గొంటారు.

    తెలంగాణకు ఎంతో ప్రాధాన్యత ఉంది: సీఈసీ

    రాబోయే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ‘యంగెస్ట్ స్టేట్ తెలంగాణ.. తెలంగాణ రాష్ట్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది.. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికల నిర్వహణ కోసం మేము కమిట్మెంట్ తో పనిచేస్తున్నాం. రాజకీయ పార్టీలతో కలిసినప్పుడు వాళ్ల నుంచి అనేక విజ్ఞప్తులు వచ్చాయి.. అక్రమ నగదు – మద్యంను కట్టడి చేయాలని విజ్ఞప్తి చేశారు’ అని పేర్కొన్నారు.

    పోలీసులతో మీ మక్కెలు విరగ్గొట్టిస్తాం: పవన్

    మచిలిపట్నం వారాహి యాత్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఏపీని వైసీపీ రహిత రాష్ట్రంగా మార్చుతాం. మేం ఏమీ మర్చిపోలేదు. ఇదే పోలీసు స్టేషనులో పంచాయితీ పెడతాం మీకు. ఏ పోలీసులను మీరు ఇబ్బంది పెట్టారో అదే పోలీసులతో మీ మక్కెలు విరగ్గొట్టిస్తాం. కొల్లేరు ప్రజలకు జనసేన, టీడీపీ వచ్చి బలమైన న్యాయం చేస్తాం. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్ధులకు అసలు సర్టిఫికేట్‌లు ఇవ్వలేకపోయారు. ప్రింటింగ్ ప్రెస్‌లతో షేర్ కుదరలేదా?’ అని విమర్శించారు.

    అమరావతికి మోదీ ఇచ్చింది గుండు సున్నా: KTR

    ఏపీలో అమరావతి నిర్మాణానికి ప్రధాని మోదీ గుండు సున్నా ఇచ్చారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ కూడా ప్రజలు గుండు సున్నా ఇవ్వాలని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ అభివృద్ధి చూసి రజనీకాంత్ అమెరికాలో తిరిగినట్లు ఉందన్నారని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో కరెంట్ ఉంటే వార్త. నేడు కరెంట్ పోతే వార్త అని ఉచిత విద్యుత్‌ను రైతులకు అందిస్తున్న ఘనత కేసీఆర్‌దని మంత్రి చెప్పుకొచ్చారు.

    ఎన్డీయేలో ఉంటే ఏంటి లేకపోతే ఏంటి?: పవన్

    కైకలూరు వద్ద ముదినేపల్లిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. ‘టీడీపీ-జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల సమస్యలు తీరుస్తాం. నేను ఎన్డీయే కూటమితో ఉంటే ఏంటి లేకపోతే ఏంటి? వైసీపీకి ఎందుకు అంత భయం. మేము గెలిచిన రోజున దమ్ముంటే వైసీపీ నేతలు ఇళ్లలోనో ఆఫీసుల్లోనో కూర్చోండి చూద్దాం. ఏ పోలీసులతో కేసులు పెట్టించారో అదే పోలీసులతో మక్కెలు ఇరగతీయిస్తాం. భవిష్యత్తులో వైసీపీ గెలిస్తే ప్రజలు ఆస్తి ప్రతాలు జగన్ చేతుల్లో ఉంటాయి’. అని పవన్ ఆరోపించారు.

    చంద్రబాబు రిమాండ్ పొడిగింపు

    సిల్క్ స్కామ్ కేసులో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్‌ను పొడిగించింది. ఈ నెల 19 వరకు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగిస్తున్నట్లు పేర్కొంది. చంద్రబాబు బెయిల్ పిటిషన్‌, కస్టడీ పిటిషన్‌ను రేపటికి వాయిదా చేసింది. చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై నేడు ఏసీబీ కోర్టులో వాదనలు జరిగాయి. చంద్రబాబు తరపు లాయర్ ప్రమోద్ కుమార్ తన వాదనలు వినిపించారు. సీఐడీ తరపున ఏజీ పొన్నవోలు సుధాకర్ వాదనలు వినిపించారు.

    ‘సైంధవ్’ రిలీజ్ అప్పుడే

    విక్టరీ వెంకటేశ్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘సైంధవ్’ సంక్రాంతి బరిలో నిలవనుంది. వచ్చే ఏడాది జనవరి 13న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. వెంకటేశ్ సరసన శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తోంది. యువ దర్శకుడు సైలేశ్ కొలను తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీకి సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.

    ‘స్కిల్‌లో స్కామ్ ఎక్కడుంది’

    చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు తరపు లాయర్ ప్రమోద్ కుమార్ తన వాదనలు వినిపిస్తున్నారు. సీఐడీ తరపున ఏజీ పొన్నవోలు సుధాకర్ వాదనలు వినిపిస్తున్నారు. ప్రమోద్ వాదిస్తూ ‘స్కిల్ కేసులో చంద్రబాబుకు సంబంధం లేదు. రాజకీయ కక్ష్య తోనే ఆయనను ఈ కేసులో ఇరికించారు. ఒప్పందం ప్రకారం 40 స్కిల్ సెంటర్లు, 2లక్షల మందికిపైగా ఉద్యోగ శిక్షణ ఉపాధి కల్పించారు. అంతా ఓపెన్‌గానే జరిగింది. ఇందులో స్కామ్ ఎక్కడుంది’. అని చంద్రబాబు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు.