• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ధమాకా నుంచి జింతాక్ లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్

    మాస్ మ‌హారాజ ర‌వితేజ యాక్ట్ చేసిన ధమాకా మూవీ నుంచి జింతాక్ లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. వీడియోలో రవితేజ సరసన హీరోయిన్ శ్రీలీల అదిరిపోయే స్టెప్పులేసింది. మంగ్లీ, భీమ్స్ సిసిరోలియో పాడిన ఈ సాంగ్ ఆకట్టుకుంటుంది. ఈ పాటకు ప్రముఖ కొరియోగ్రఫర్ శేఖర్ మాస్టర్ డాన్స్ అందించాడు. ఈ చిత్రానికి త్రినాధరావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. త్వ‌ర‌లోనే విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది.

    ‘ది ఘోస్ట్’ నుంచి ప‌వ‌ర్‌ఫుల్ ప్రోమో రిలీజ్

    కింగ్ నాగార్జున హీరోగా న‌టిస్తున్న ‘ది ఘోస్ట్’ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ ప్రోమోను విడుద‌ల చేశారు. త‌మ‌హ‌గానే అనే ప‌వ‌ర్‌ఫుల్ ఆయుధాన్ని చూపించారు. త‌మ‌హ‌గానే అంటే విలువైన ఉక్కుతో చేసిన ఆయుధం అనే అర్థం. నాగార్జున వైల్డ్ లుక్‌లో ప‌వ‌ర్‌ఫుల్‌గా క‌నిపిస్తున్నాడు. సోనాల్ చౌహాన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తుంది. ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌కుడు. ఆగ‌స్ట్ 25న ది ఘోస్ట్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. సెప్టెంబ‌ర్ మొద‌టివారంలో సినిమా రిలీజ్ కానున్న‌ట్లు తెలుస్తుంది.

    తిరుప‌తి గొప్ప‌త‌నాన్ని చెప్పే సాంగ్ ‘మా తిరుప‌తి’ రిలీజ్

    ‘అలిపిరికి అల్లంత దూరంలో అనే సినిమా నుంచి మా తిరుప‌తి లిరిక‌ల్ సాంగ్ రిలీజ్ అయింది. ఫ‌ణి క‌ళ్యాణ్ మ్యూజిక్ అందించిన ఈ పాట‌ను ర‌మ్య బెహ్ర‌, శంక‌ర్ మ‌హ‌దేవ‌న్ కలిసి ఆల‌పించారు. ఈ చిత్రంలో రావ‌ణ్ రెడ్డి, శ్రీ నికిత త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. ఆనంద్.జె ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ పాట‌లో తిరుప‌తి వాతావ‌ర‌ణాన్ని ఆ గాలిలో ఉండే భ‌క్తిభావాన్ని వివ‌రించారు.

    మనసును మురిపించే రెహమాన్‌ పాట

    చియాన్‌ విక్రమ్‌ హీరోగా భారీ అంచనాలతో వస్తున్న చిత్రం ‘కోబ్రా’. ఇందులో విక్రమ్ 25 గెటప్‌లలో కనిపిస్తారని టాక్. మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ కూడా సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అజయ్‌ జ్ఞానముత్తు తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ఏ.ఆర్‌. రెహమాన్ స్వరాలు అందిస్తున్నారు. ఇప్పటికే పాటల విడుదలను కూడా ప్రారంభించారు. తాజాగా ‘తరంగిని’ తెలుగు లిరికల్ సాంగ్‌ రిలీజ్‌ చేశారు. రెహమాన్‌ బాణీలతో వినసొంపుగా ఈ పాట ఆకట్టుకుంటోంది. ఆగస్టు 31న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

    ‘తీస్ మార్ ఖాన్‌’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సిద్ధూ స్పీచ్

    ఆది సాయి కుమార్, పాయల్ రాజ్‌పుత్ జంటగా నటించిన ‘తీస్ మార్ ఖాన్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు జరిగింది. ఈ కార్యక్రమంలో ‘DJ టిల్లు’ మూవీ హీరో సిద్ధూ జొన్నలగడ్డ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూవీ ట్రైలర్ అద్భుతంగా ఉందని, సినిమా చాల ఫ్రెష్‌గా కనిపిస్తుందన్నాడు. మూవీ కచ్చితంగా హిట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.

    ‘కార్తికేయ 2’ సక్సెస్ మీట్‌లో అల్లు అరవింద్ స్పీచ్

    నిఖిల్, అనుపమ జంటగా నటించిన ‘కార్తికేయ 2’ మూవీ భారీ హిట్ సాధించింది. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ దాటి, భారీ లాభాల దిశగా దూసుకెళ్తుంది. ఈ క్రమంలో చిత్రబృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ మీట్‌లో స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ పాల్గొని మాట్లాడారు. ఈ మూవీ భారీ విజయం సాధించినందుకు సంతోషంగా ఉందని, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు.

    కార్తికేయ2 విమర్శలపై దిల్‌ రాజు క్లారిటీ

    కార్తికేయ సినిమా రిలీజ్‌కు అడ్డుపడుతూ ఇబ్బంది పెట్టారని ప్రముఖ నిర్మాత దిల్‌రాజుపై వచ్చిన ఆరోపణలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ‘ థ్యాంక్యూ సినిమా కోసం నేనే జూలై 22 డేట్ అడిగాను. మా మధ్య క్లాషెస్ ఉంటాయి. కానీ మా మాధ్య ఏదో సమస్య ఉందని క్రియేట్ చేస్తున్నారు.’ అనుకోకుండా జరిగిన పరిణామాల వల్ల మాత్రమే కార్తికేయ-2 వాయిదా పడిందని చెప్పారు. ‘ ఇక్కడ సినిమా ఆడితే మేం ఆనందపడతాం. మా ఇంకో సినిమాకు అది ఊపిరి పోస్తుంది. మీ సబ్‌స్క్రైబర్లు పెంచుకునేందుకు మమ్మల్ని … Read more

    రామ్ మిరియాల ఇండిపెండెన్స్‌ డే సాంగ్

    ‘ఊరెళ్లిపోతా మామా’ మొదలుకుని రామ్‌ మిరియాల నుంచి ఏ పాట వచ్చినా సంగీత అభిమానులను అలరిస్తోంది. విభిన్న గాత్రంతో సామాన్యుల పరిస్థితులపై రామ్‌ మిరియాల చేసే పాటలకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. తాజాగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ‘జెండా వందనం’ పాట విడుదల చేశారు. ఎన్ని కష్టాలొచ్చినా జనగణమణ పాడుదాం, జెండాకు సెల్యూట్‌ చేద్దామంటూ సాగే పాట చాలా అద్భుతంగా ఉంది.

    విజయ్ ఆంటోనీ ‘హత్య’ ట్రైలర్‌ విడుదల

    బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు విజయ్ ఆంటోనీ. ఆ తర్వాత విజయ్ ఆంటోనీ నుంచి వచ్చిన ఇతర సినిమాలపైనా తెలుగు ప్రేక్షకులు ఆసక్తి కనబర్చారు. తాజాగా మరో సస్పెన్స్ థ్రిల్లర్ ‘హత్య’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బాలాజీ కె కుమార్ ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ‘గురు’ ఫేమ్ రితికా సింగ్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది.

    ఏప్రిల్‌లో మొదలు కాబోతున్న ఎన్టీఆర్‌31

    కేజీఎఫ్‌ బ్లాక్‌బస్టర్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌, ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్నవిషయం తెలిసిందే. అయితే సినిమాపై తాజాగా ప్రశాంత్‌ నీల్‌ క్రేజీ అప్డేట్‌ ఇచ్చాడు. ఏప్రిల్‌, మే నెలలో సినిమా షూటింగ్‌ ప్రారంభించబోతున్నామని తెలిపాడు. ఎన్టీఆర్‌ సినిమా మీడియా ప్రశ్నించగా ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ’ ఏం చెప్పాలి కథ చెప్పాలా?, ఏప్రిల్‌, మేలో సినిమా ప్రారంభించబోతున్నాం అని స్పష్టం చేశాడు. ఎన్టీఆర్‌ తర్వాతి చిత్రం కొరటాల శివతో ఉంది. అది కూడా ఇంకా షూటింగ్ మొదలు కాలేదు. [ప్రశాంత్‌ నీల్‌ వీడియో](url) BLOCKBUSTER … Read more