• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రాజ‌మౌళి మాకు దారి చూపించాడు: మ‌ణిర‌త్నం

    మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న పొన్నియ‌న్ సెల్వ‌న్ మూవీ నుంచి ‘చోళ చోళ’ అనే పాటను శుక్రవారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా చిత్ర‌బృందం కార్య‌క్ర‌మంలో పాల్గొంది. మ‌ణిర‌త్నం మాట్లాడుతూ ముందుగా రాజ‌మౌళికి థ్యాంక్స్ చెప్పాలి. బాహుబ‌లి సినిమాతో పాన్ ఇండియా మూవీ చేయ‌వ‌చ్చ‌నే న‌మ్మ‌కాన్ని క‌లిగించారు. అదేవిధంగా ఒక సినిమాను రెండు భాగాలుగా చేసి సాక్సెస్ సాధించ‌వ‌చ్చ‌ని నిరూపించారు అని అన్నాడు. దీంతో పాటు మెగాస్టార్‌కు కూడా థ్యాంక్స్ చెప్పాడు. అది ఎందుకో మీకు త్వ‌ర‌లో తెలుస్తుంద‌ని వెల్ల‌డించాడు. ఈ సినిమాను తెలుగులో రిలీజ్ … Read more

    సినీ స్టార్ల క్రికెట్ టోర్నీ మళ్లీ వచ్చేస్తోంది!

    డల్లాస్‌లో సెప్టెంబర్‌ 24 నుంచి మళ్లీ సెలబ్రిటీ క్రికెట్‌ కార్నివాల్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని పార్క్‌హయత్‌ హోటల్‌లో ట్రోఫీ, జెర్సీని ప్రముఖ సినీనటుడు చిరంజీవి ఆవిష్కరించారు. ‘చదువు లేకపోయినా మేము లక్షల్లో సంపాదిస్తున్నామంటే దానికి కారణం ఈ చిత్ర పరిశ్రమే. ఈ చిత్ర పరిశ్రమ మాకెంతో ఇచ్చింది. కష్టాల్లో ఉన్నపుడు ఆదుకోవడంలోనే అసలైన సంతృప్తి ఉంటుంది’ అని చిరంజీవి అన్నారు. చిత్రపురి కాలనీలో నిర్మించే ఆసుపత్రికి రూ.20లక్షల చెక్‌ను చిరంజీవి అందజేశారు. కార్యక్రమంలో సినీనటుడు శ్రీకాంత్‌, ప్రముఖ సంగీత దర్శకుడు తమన్‌ తదితరులు … Read more

    PS-1 నుంచి ‘చోళ చోళ’ సాంగ్ విడుదల

    మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక మూవీ ‘పొన్నియన్ సెల్వన్’. సెప్టెంబర్ 30న విడుదల కానున్న ఈ మూవీ నుంచి ‘చోళ చోళ’ అనే సెకండ్ సాంగ్ విడుదల అయ్యింది. ‘చోళ చోళ’ అంటూ సాగే ఈ సాంగ్ ఆకట్టుకుంటుంది. ఈ మూవీలో విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష కీలక పాత్రల్లో నటించారు.

    ‘కార్తికేయ 2’ నుంచి కృష్ణా ట్రాన్స్ లిరికల్ వీడియో

    నిఖిల్, అనుపమ జంటగా నటించిన ‘కార్తికేయ 2’ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ సాధిస్తుంది. విడుదలైన అన్ని భాషల్లో రికార్డు వసూళ్లతో దూసుకెళ్లిపోతుంది. తాజాగా ఈ మూవీ నుంచి ‘కృష్ణా ట్రాన్స్’ అనే లిరికల్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. ఈ లిరికల్ వీడియో ఆకట్టుకుంటుంది. ఈ సాంగ్ వింటే గూజ్‌బంప్స్ రావడం పక్కా.

    ఇంట‌ర్వ్యూ మ‌ధ్య‌లో విజ‌య్‌ని ప‌ట్టుకొని ఏడ్చేసిన ఛార్మీ

    విజ‌య్‌దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన మూవీ ‘లైగ‌ర్’. పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.. పూరీ కనెక్ట్స్ బ్యాన‌ర్‌పై ఛార్మీ దీనికి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించింది. అయితే ఫ్యాన్స్ త‌ర‌ఫున ఛార్మీ కొన్ని ప్ర‌శ్న‌ల‌ను పూరీ, విజ‌య్‌ను అడిగింది. ఆ త‌ర్వాత నిర్మాత‌గా లాక్‌డౌన్ స‌మ‌యంలో ఎన్ని ఆర్థిక క‌ష్టాలు అధిగ‌మించారో చెప్పుకొచ్చింది. ఆ స‌మ‌యంలో ఓటీటీ నుంచి మంచి ఆఫ‌ర్ వ‌చ్చిన‌ప్ప‌టికీ ధైర్యం చేసి థియేట‌ర్‌లోనే విడుద‌ల చేస్తామ‌ని చెప్ప‌డానికి రెండే కార‌ణాలు ఉన్నాయి. అందులో ఒక‌టి విజ‌య్ దేవ‌ర‌కొండ‌, మ‌రోటి సినిమా కంటెంట్ అని చెప్పింది. … Read more

    ఆగష్టు 21న సాయంత్రం 5.30 నిమిషాలకు..

    రాకింగ్ స్టార్ యష్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘KGF’ ఎంత భారీ విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ మూవీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ఆగష్టు 21న సాయంత్రం 5.30 గంటల నుంచి జీ తెలుగులో జరగనుంది. ఈ మేరకు జీ తెలుగు 100 ఫీట్ల పోస్టర్ ప్రదర్శించి ప్రకటించింది. జీ తెలుగు ప్రకటించిన వీడియోను చూసేందుకు Watch On Twitter గుర్తుపై క్లిక్ చేయండి. Hyderabadis witnessed a never seen phenomenon for a WTP? … Read more

    ‘సీతా రామం’ నుంచి కృష్ణుడి పాట రిలీజ్

    నేడు శ్రీకృష్ణాష్ట‌మి సంద‌ర్భంగా ‘సీతా రామం’ మూవీ నుంచి త‌ర‌లి త‌ర‌లి అనే సాంగ్‌ను రిలీజ్ చేశారు. సీతా రామం మూవీ ఆగ‌స్ట్ 5న విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికీ థియేట‌ర్ల‌లో స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతుంది. దుల్క‌ర్ స‌ల్మాన్, మృణాల్ ఠాకూర్‌ల న‌ట‌న‌కు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ల‌భించాయి. ఈ సినిమాకు హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. విశాల్ చంద్ర‌శేఖ‌ర్ మ్యూజిక్ అందించాడు.

    ఫిల్మ్‌ చాంబర్‌ కీలక నిర్ణయాలు

    సినిమా పరిశ్రమ విషయంలో చర్చలు జరుపుతున్న ఫిిల్మ్‌ చాంబర్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇకపై సినిమా విడుదలైన 8 వారాల తర్వాతనే ఓటీటీ ఇచ్చేలా నిర్మాతలంతా కలిసి నిర్ణయించారు. థియేటర్‌, మల్టీప్లెక్స్‌లలో టికెట్లు, తిను బండారాల ధరలు ప్రేక్షకులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరామని చెప్పారు. అందుకు వారు అంగీకరించారని వెల్లడించారు. వీపీఎఫ్‌ ఛార్జీలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. వేతన సమస్యలపైనా దాదాపుగా తుది నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. నాలుగైదు రోజుల్లో షూటింగులు తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు.

    మ‌హేశ్-త్రివిక్ర‌మ్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్‌

    త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేశ్‌బాబు న‌టిస్తున్న SSMB28 సినిమా గురించి క్రేజీ అప్‌డేట్ వ‌చ్చేసింది. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ఈరోజు ప్ర‌క‌టించారు. ఏప్రిల్ 28, 2023న మూవీ రిలీజ్ కానున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ వార్త‌తో సూప‌ర్‌స్టార్ ఫ్యాన్స్ పండ‌గ చేసుకుంటున్నారు. పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తుంది. త‌మ‌న్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, హారిక హాసిని క్రియేష‌న్స్ సంయుక్తంగా దీన్ని నిర్మిస్తున్నాయి. వీడియో చూసేందుకు watch on twitter గుర్తుపై క్లిక్ చేయండి. The Reigning Superstar will arrive on … Read more

    న‌వీన్ చంద్ర ‘రిపీట్’ ట్రైల‌ర్ విడుద‌ల‌

    న‌వీన్ చంద్ర హీరోగా న‌టిస్తున్న ‘రిపీట్’ మూవీ ట్రైల‌ర్ విడుద‌లైంది. ఈ సినిమాలో ఆయ‌న ఐపీఎస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ఒక క్రైమ్ మిస్ట‌రీని ఛేదించే దిశ‌గా పోలీసాఫీస‌ర్ చేసే ప్ర‌య‌త్నాలు ఆస‌క్తిని పెంచుతున్నాయి. ఆగ‌స్ట్ 25 నుంచి మూవీ హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. న‌వీన్ చంద్ర వ‌రుస‌గా సినిమాలు, వెబ్‌సిరీస్‌ల‌తో బిజీగా మారాడు. ప్ర‌తి అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ స‌రికొత్త పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నాడు. ఇటీవ‌ల హాట్‌స్టార్‌లో నవీన్ చంద్ర న‌టించిన ప‌రంప‌ర వెబ్‌సిరీస్‌కు మంచి విజ‌యం సాధించింది. https://youtube.com/watch?v=QsURblraGtE