• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఉగాది స్పెషల్(మార్చి 22): ఈ వారం థియేటర్లు / ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలు

    తెలుగు కొత్త సంవత్సరం ఉగాది పురస్కరించుకొని వివిధ సినిమాలు సందడి చేయనున్నాయి. థియేటర్లు / ఓటీటీల్లో విడుదలకు సిద్ధమయ్యాయి. దర్శకుడిగా విశ్వక్‌ సేన్‌, పెళ్లి తర్వాత కాజల్ అగర్వాల్ మళ్లీ అలరించేందుకు రెఢీ అయ్యారు.  దాస్ కా ధమ్కీ టాలీవుడ్ యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ మళ్లీ మెగా ఫోన్ పట్టుకున్నాడు. దాస్ కా ధమ్కీ  చిత్రం ద్వారా ప్రేక్షకులను పలకరించనున్నాడు. మార్చి 22న ఉగాది రోజున సినిమాను విడుదల చేస్తున్నారు. పాగల్ తర్వాత విశ్వక్‌ సేన్‌, నివేదా పెతురాజ్‌ మరోసారి జంటగా నటించారు. … Read more

    పాలుతాగే బిడ్డను వదిలి దేశసేవకు మహిళా జవాన్‌

    సైన్యంలో చేరడమంటే జీవితాన్ని దేశానికి అంకితం చేయడమే. అందుకు తార్కాణమే ఈ వీడియో. మహారాష్ట్రకు చెందిన వర్షారాణి BSF జవాను. 10 నెలల క్రితమే ఓ బిడ్డకు జన్మనిచ్చారు. మెటర్నిటీ సెలవులు పూర్తి కావడంతో 10 నెలల పాపను తండ్రి చేతుల్లో వదిలి విధులకు బయల్దేరారు. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

    ఆ సీన్‌ షూట్‌ చేస్తుంటే కన్నీళ్లు ఆగలేదు: కృష్ణవంశీ

    ‘రంగమార్తాండ’ చిత్రం షూటింగ్‌కు సంబంధించి డైరెక్టర్‌ కృషవంశీ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘ఈ సినిమా లాస్ట్‌ చాప్టర్‌లో రమ్యకృష్ణను షూట్‌ చేయడానికి చచ్చిపోయాననుకో!. దాదాపు 36 గం.పాటు షూటింగ్‌ జరిగింది. తనను ఆ సీన్‌లో చిత్రీకరించడానికి సెంటిమెంట్‌ అడ్డొచ్చింది. కళ్ల వెంబడి నీళ్లు కారుతూనే ఉన్నాయి. ఆ రాత్రి నేను సరిగా నిద్రపోలేదు. గుండె రాయి చేసుకుని షూటింగ్‌ చేశా’ అని కంటతడి పెట్టుకున్నారు. కాగా ఈ చిత్రం మార్చి 22న విడుదల కానుంది.

    ‘మగధీర’ రీరిలీజ్ రద్దుపై క్లారిటీ

    సాంకేతిక కారణాల వల్ల ‘మగధీర’ సినిమాను రీరిలీజ్ చేయట్లేదని గీతా ఆర్ట్స్ ప్రకటించింది. 2009లో విడుదలైన మగధీర బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. దీంతో రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను స్పెషల్ ప్రింట్‌లో రీరిలీజ్ చేయనున్నట్లు మొదట్లో ప్రకటించారు. కానీ, మగధీర రీరిలీజ్ చేయడానికి వీలు కావట్లేదని గీతా ఆర్ట్స్ అధికారికంగా ప్రకటించింది. సరైన సందర్భంలో సినిమాను రీరిలజ్ చేస్తామని హామీ ఇచ్చింది. అయితే, చరణ్ బర్త్‌డేకు ‘ఆరెంజ్’ సినిమాను రీరిలీజ్ చేస్తున్నట్లు నాగబాబు ప్రకటించారు.

    Virat Kohli Biopic: విరాట్‌ కోహ్లీగా రామ్‌చరణ్ సెట్ అవుతాడా? సినిమా స్టోరీ, క్లైమాక్స్‌, డైరెక్టర్ల‌పై నెట్టింట్లో రచ్చ..

    రామ్‌చరణ్.. ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకడు. సినిమా సినిమాకు తనలోని నటుడుని మెరుగు పరుచుకుంటూ స్థాయిని పెంచుకుంటున్న హీరో. RRR తర్వాత చరణ్ మేనియా మరింత పెరిగింది. దీంతో చెర్రీ అప్‌కమింగ్ ప్రాజెక్టులపై ఫ్యాన్స్‌కి ఎనలేని ఆసక్తి ఏర్పడింది. ఈ క్రమంలో రామ్‌చరణ్ చెప్పిన చేసిన వ్యాఖ్యలు టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారాయి.  అవకాశం వస్తే రన్ మెషిన్ Virat Kohli Biopicలో నటిస్తానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు చరణ్. ఎప్పటి నుంచో క్రీడా నేపథ్యం కలిగిన సినిమా చేయాలని భావిస్తున్నట్లు … Read more

    RC15: రామ్‌ చరణ్ CEO  స్టోరీ ఇదేనా? కథ అయితే మాములుగా లేదు!

    ‘RRRకు  ఆస్కార్ అవార్డు రావడంతో రామ్‌చరణ్ చేసే అప్‌కమింగ్ ప్రాజెక్టులపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుతం రామ్‌చరణ్ శంకర్ డైరెక్షన్‌లో ‘RC15’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న సినిమాతో బిజీబిజీగా గడుపుతున్నాడు. అయితే, ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు ఒకొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా సినిమా కథ గురించి ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. మరి ఆ విశేషాలు తెలుసుకుందాం.  కథ ఇదేనా? పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌ ఉన్న కథను దర్శకుడు శంకర్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. రామ్‌చరణ్ ఇందులో డ్యుయల్ రోల్‌లో చేయనున్నారట. ఈ మేరకు కొన్ని … Read more

    యూట్యూబ్ ట్రెండింగ్‌ కస్టడీ #1

    నాగచైతన్య నటించి కస్టడీ మూవీ టీజర్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ట్రెండింగ్‌లో #1 ర్యాంకులో కొనసాగుతోంది. మాస్ డైలాగ్స్ ఫ్యాన్స్‌ను అలరిస్తున్నాయి. ఫవర్ ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా కస్టడీ మూవీ తెరకెక్కింది. ఈ సినిమాలో నాగచైతన్య పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. అరవింద్ స్వామి కీలక పాత్ర పోషించాడు. హీరోయిన్‌గా కృతిశెట్టి నటిస్తోంది.

    NTR కుటుంబంతో 35 ఏళ్లుగా పోటీ

    ఢిల్లీలో జరిగిన ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న రామ్‌చరణ్ మీడియాతో ఆసక్తికరమైన [విషయాన్ని](url) వెల్లడించారు. భవిష్యత్తులో అవకాశం వస్తే విరాట్ కోహ్లీ బయోపిక్‌లో నటించాలని ఉందని మనసులో మాట బయటపెట్టారు.అలాగే గత 35ఏళ్లుగా ఎన్టీఆర్ కుటుంబంతో సినిమాల పరంగా, ఫ్యాన్స్‌పరంగా తీవ్రమైన పోటీ నడుస్తూనే ఉందన్నారు. అయితే వ్యక్తిగతంగా తమ కుటుంబాల మధ్య ఆత్మీయమైన అనుబంధం ఉందని గుర్తు చేశారు. జూ.ఎన్టీఆర్ తనకు మంచి మిత్రుడని చెప్పుకొచ్చారు. Ram Charan said, "Virat Kohli is an inspiration. It'll be amazing if … Read more

    ‘ఎన్టీఆర్ 30’ లాంఛ్; గెస్ట్ అతడే?

    యంగ్‌టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివల కాంబినేషన్‌లో ‘ఎన్టీఆర్ 30’ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ నెల 23న ఈ సినిమా ఓపెనింగ్ సెర్మనీ జరగనుంది. కాగా ఈ మూవీ లాంఛ్‌ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా రాబోతున్నారని సమాచారం. అలాగే రామ్‌చరణ్, కళ్యాణ్‌రామ్, రాజమౌళి, కీరవాణి కూాడా ఈ ఈవెంట్‌కు హాజరు కానున్నారు. కాగా ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటించనుంది. కళ్యాణ్‌రామ్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. సినిమా లాంఛ్ కార్యక్రమానికి చిరంజీవి గెస్ట్‌గా వస్తారని అనుకున్నప్పటికీ రాలేదు. … Read more

    మహేశ్‌- రాజమౌళి ఫోటో వైరల్‌

    ఇంటర్నెట్‌లో ఓ ఫోటో వైరల్‌ మారింది. లక్షల లైకులు, కామెంట్లతో ట్రెండింగ్‌లోకి వెళ్లింది. రాజమౌళి-మహేశ్‌ బాబు ఇటీవల ఎక్కడో కలిసిన ఫోటో ఇది. ఇది ఎలా బయటకొచ్చిందో తెలియదుగానీ నిమిషాల వ్యవధిలోనే ట్రెండింగ్‌లోకి దూసుకెళ్తోంది. #SSMB29 వర్కింగ్‌ టైటిల్‌తో పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. అయితే వారు ఎక్కడ కలిశారు? ఎలా కలిశారు అని ఆరా తీస్తున్నారు.