• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 20 ఏళ్ల మాట నిజమైంది: బన్నీ

    మైత్రీ మూవీ మేకర్స్‌ ఇచ్చిన గ్రాండ్‌ పార్టీలో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బాలీవుడ్‌కు వెళ్లమని దేవిశ్రీకి ఎన్నో సార్లు చెప్పానని పేర్కొన్నాడు. ‘ముందు నువ్వు వెళ్లు.. నీతో పాటు నేనూ వచ్చేస్తా’ అని దేవీ అనేవాడని తెలిపాడు. అయితే ‘పుష్ప’ చిత్రం ద్వారా ఇద్దరం ఒకేసారి బాలీవుడ్‌లో అడుగుపెట్టామని, జాతీయ అవార్డులు సైతం అందుకున్నామని బన్నీ సంతోషం వ్యక్తం చేశాడు. 20 ఏళ్ల నుంచి దేవితో అంటున్న మాట నిజమైనందుకు సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు.

    భయపెట్టిస్తున్న ‘కంగువా’ గ్లింప్స్

    సూర్య, డైరెక్టర్ శివ కాంబినేషన్‌లో వస్తున్న ‘కంగువా’ మూవీ గ్లింప్స్ వచ్చేసింది. 2.21 నిమిషాల నిడివి ఉన్న ఈ గ్లింప్స్ గూస్‌బమ్స్ తెప్పిస్తోంది. డార్క్ మోడ్‌లో సాగుతున్న గ్లింప్స్‌లో సూర్య లుక్ భయపెట్టిస్తోంది. కంగువా రాజ్యంలోకి మీకు స్వాగతం అంటూ బోల్డ్ వెల్‌కం చెబుతోందీ గ్లింప్స్. ముఖ్యంగా, డీఎస్పీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. 2024లో 10 భాషల్లో 3Dలో ఈ మూవీ రిలీజ్ కానుంది.

    త్వరలో దేవీశ్రీ ప్రసాద్ పెళ్లి! వధువు ఎవరంటే?

    టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ త్వరలో వివాహం చేసుకోనున్నట్ల తెలుస్తోంది. 43 ఏళ్ల దేవిశ్రీ ప్రసాద్ తమ దూరపు బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. దేవీకి ఆమె వరుసకు మరదలు అవుతుందని.. వారిద్దరి మధ్య 17 సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉన్నట్లు టాక్. పెళ్లి విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా దేవిశ్రీప్రసాద్ గతంలో ఓ టాప్ హీరోయిన్‌తో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడు. ఆ తర్వాత వారిద్దరి మధ్య బ్రేకప్ అయ్యింది. ఇదిలా ఉంటే గతంలో … Read more

    DSPతో ఊర్వశి రౌటేలా స్టెప్పులు అదుర్స్

    హీరోయిన్ ఊర్వశి రౌటేలా స్పేషల్ [వీడియో](url)ను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. వాల్తేరు వీరయ్య మూవీలో చిరంజీవితో స్పేషల్ సాంగ్‌లో ఊర్వశి స్టెప్పులేసిన సంగతి తెలిసిందే. తాజాగా సంతోషం అవార్డ్స్ రిహార్సల్స్‌లో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్‌తో కలిసి ‘బాస్ పార్టీ సాంగ్‌’కు చిందులేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. వాల్తేరు వీరయ్య సినిమా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. https://www.instagram.com/p/Cmqqbavou1m/

    ఆకట్టుకుంటున్న ‘శ్రీదేవి.. చిరంజీవి’ సాంగ్

    వాల్తేరు వీరయ్య సినిమాలోంచి రెండో పాట విడుదలైంది. ‘నువ్వు శ్రీదేవి అయితే.. నేనే చిరంజీవి అంటా’ అనే గీతాన్ని చిత్రబృందం విడుదల చేసింది. ఈ పాటకు సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ లిరిక్స్ అందించాడు. జస్ప్రీత్ జాజ్, సమీర భరద్వాజ్ ఈ గీతాన్ని ఆలపించారు. డీఎస్పీ స్వరాలు సమకూర్చారు. కాగా, రొమాంటిక్‌గా సాగుతున్న ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇందులోని మొదటి పాట ‘బాస్ పార్టీ’ మంచి ఆదరణను పొందింది. బాబీ డైరెక్ట్ చేయగా.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. జనవరి 13న విడుదల … Read more

    దేవీ శ్రీ ప్రసాద్‌పై కేసు నమోదు

    ప్రముఖ సినీ సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్‌పై కేసు నమోదైంది. ‘ఓ పిల్లా’ అనే ఆల్బమ్‌లో ‘హారే రామ హరే కృష్ణ’ మంత్రాన్ని అసభ్యంగా చిత్రీకరించాలని కరాటే కల్యాణి, హిందూ సంఘాలు చేసిన ఫిర్యాదు మేరకు సైబర్‌ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. పవిత్రమైన ఆ మంత్రాన్ని అశ్లీల దుస్తులు, నృత్యాలతో చిత్రీకరించి హిందువుల మనోభావాలు దెబ్బతీశారని ఆరోపించాయి. ఆ గీతంలో వినిపించే మంత్రాన్ని వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేశారు. అక్టోబర్‌లో ఈ పాట విడుదలైంది.

    దేవీ శ్రీ ప్రసాద్‌పై సైబర్‌ క్రైం పీఎస్‌లో ఫిర్యాదు

    టాలివుడ్‌ స్టార్‌ మ్యూజిషియన్‌ దేవీ శ్రీ ప్రసాద్‌పై సైబర్‌ క్రైం పీఎస్‌లో ఫిర్యాదు నమోదైంది. నటి కరాటే కల్యాణి, పలు హిందూ సంఘాలు ఆయనపై ఫిర్యాదు చేశాయి. ‘హరేరామ హరేకృష్ణ’ మంత్రాన్ని ‘ఓ పిల్లా’ అనే ఆల్బమ్‌లో ఐటెం సాంగ్‌గా చిత్రీకరించారని వారు ఆరోపించారు. దేవిశ్రీ ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. పవిత్రమైన ఆ మంత్రాన్ని అశ్లీల దుస్తులు, నృత్యాలతో చిత్రీకరించి DSP హిందువుల మనోభావాలు దెబ్బతీశారని ఆరోపించారు. వెంటనే ఆ మంత్రాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు.