• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కంగన ‘ఎమర్జెన్సీ’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

    కంగన రనౌత్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘ఎమర్జెన్సీ’. ఈ మూవీ విడుదల తేదీ ఖరారైంది. నవంబర్ 24న సినిమాని రిలీజ్ చేయనున్నారు. భారత దేశ చరిత్రలో చీకటి అధ్యాయం ఎమర్జెన్సీ. 1975 లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఈ ఘటనల నేపథ్యంలో సినిమాను తెరకెక్కించింది కంగన. ఇందిర పాత్రలో కంగన నటించింది. ఎమర్జెన్సీని ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? ఇందుకు దారితీసిన పరిణామాలను ఇందులో చూపించే అవకాశం ఉంది.

    నాకు పెళ్లి చేసుకోవాలనుంది: కంగనా రనౌత్

    తనకు పెళ్లి చేసుకోవాలని ఉందని బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ తెలిపింది. ‘‘నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది. నాకంటూ సొంత కుటుంబం ఉండాలని ఉంది. కానీ నేను తొందర పడితే అది జరగదు. ఎప్పుడు ఏది జరగాలని రాసిపెట్టి ఉందో అదే జరుగుతుంది. ’’ అంటూ కంగనా చెప్పుకొచ్చింది. కాగా కంగనా ప్రస్తుతం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ బయోపిక్ ‘ఎమర్జెన్సీ’లో నటిస్తోంది. ‘చంద్రముఖి2’ సినిమాలోనూ నటిస్తోంది.

    వారి వల్ల రూ.40 కోట్లు పోగొట్టుకున్నా: హీరోయిన్

    దేశ వ్యతిరేక శక్తులపై గళమెత్తడం వల్ల రూ.30 కోట్ల నుంచి రూ.40 వరకు నష్టపోయానని బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ తెలిపారు. ముఖ్యంగా కొందరు రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా మాట్లాడటం వల్ల 20 నుంచి 25 యాడ్స్ తాను కోల్పోయానని చెప్పారు. తనకు ప్రకటనల్లో నటించే అవకాశం లేకుండా చేశారని చెప్పారు. రాత్రికి రాత్రే కొందరు ఒప్పందాలను రద్దు చేసుకున్నారని తెలిపారు. ఇప్పడు తాను స్వేచ్ఛాజీవినని పేర్కొంది. కాగా కంగనా ప్రస్తుతం ‘ఎమర్జెన్సీ’ చిత్రంలో నటిస్తోంది.

    ఇందిరాగాంది అచ్చం కంగ‌నా ర‌నౌత్‌లా న‌టించింది

    బాలీవుడ్ హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్ ప్ర‌స్తుతం ‘ఎమ‌ర్జెన్సీ’ అనే సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. మాజీ ప్ర‌ధాన‌మంత్రి ఇందిరాగాంధీ జీవిత క‌థ ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కుతుంది. కంగ‌నా ఇందిరా పాత్ర‌లో న‌టిస్తూ..స్వీయ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుంది. అయితే ఆమె రిలీజ్ చేసిన టీజ‌ర్‌, పోస్ట‌ర్స్‌లో కంగ‌నా అచ్చం ఇందిరాగాంధీలాగానే క‌నిపించ‌డం అంద‌రినీ ఆశ్ఛ‌ర్య‌ప‌రిచింది. ఈ పాత్ర‌కు ఆమె ప‌ర్‌ఫెక్ట్‌గా సెట్ అయ్యిందంటూ చెప్తున్నారు. అయితే తాజాగా సంచ‌ల‌న డైరెక్ట‌ర్ ఆర్‌జీవీ దీనిపై ట్వీట్ చేశాడు. 1984లో ఇందిరాగాంధీ ఇచ్చిన ఒక ఇంట‌ర్వ్యూను షేర్ చేస్తూ..మీరు … Read more

    ప‌ద్మ అవార్డులు-2020 వరించింది వీరికే..

    రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో 2020 సంవ‌త్సరానికి సంబంధించి ప‌ద్మ అవార్డుల‌ను రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ చేతుల‌మీదుగా అందించారు. నాలుగు ప‌ద్మ‌విభూష‌ణ్‌, ఆరు ప‌ద్మ‌భూష‌ణ్‌, 49 ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారాల‌ను విజేత‌ల‌కు అందించారు. తెలుగు రాష్ట్రాల‌ నుంచి స్పిరిచ్యుయ‌లిజంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి చెందిన ముంతాజ్ అలీ ప‌ద్మ‌భూష‌న్ అవార్డును పొందారు. చింత‌ల వెంక‌ట్‌రెడ్డి, అగ్రిక‌ల్చ‌ర్ (తెలంగాణ‌) ప‌ద్మ‌శ్రీ, య‌డ్ల గోపాల్‌రావు, ఆర్ట్ (ఆంధ్ర‌ప్ర‌దేశ్) ప‌ద్మ‌శ్రీ అవార్డుల‌ను అందుకున్నారు. స్పోర్ట్స్ విభాగంలో..  పి.వి.సింధు ప‌ద్మ‌భూష‌ణ్‌ అవార్డు అందుకోగా.. ఒయ‌న‌మ్ బెమ్‌బెబ్ దేవీ, (మ‌ణిపూర్‌),  త‌రుణ్‌దీప్ రాయ్(సిక్కిం), రాణి,(హ‌ర్యానా)లకు ప‌ద్మ‌శ్రీ వ‌రించింది. ఆర్ట్ … Read more