• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తెలంగాణ గురించి చెబుతూ రాహుల్ ఎమోషనల్

    తెలంగాణ గురించి మాట్లాడుతూ కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ఎమోషనల్ అయ్యారు. ‘తెలంగాణతో మాకు ఉన్నది రాజకీయ సంబంధం కాదు.. కుటుంబ సంబంధం ఉంది. తెలంగాణతో మోదీ, కేసీఆర్‌లకు కేవలం రాజకీయ సంబంధమే ఉంది. మీరంతా ఒక్కసారి గుర్తు పెట్టుకోండి. మీకు మాకు మధ్య ఉంది రాజకీయ సంబంధం కాదు. మీ అభిమానం.. ఆశీర్వాదంతో కూడిన సంబంధం. అందుకే మా చెల్లె ప్రియాంకను తీసుకు వచ్చా. తెలంగాణతో మనకు రాజకీయ సంబంధం కాదు.. కుటుంబ సంబంధం అని చెప్పి తీసుకు వచ్చా’ అని చెప్పుకొచ్చారు.

    దశ దిశ మార్చే సమయమొచ్చింది: రేవంత్

    ఎన్నికల ద్వారా తెలంగాణ దశ దిశ మార్చే సమయమొచ్చిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టును ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలేదని ఆయన ప్రశ్నించారు. వికారాబాద్‌కు కృష్ణా జలాలు, ఎంఎంటీఎస్‌ రైలు రాకపోవడానికి కేసీఆరే కారణమని ఆరోపించారు. కాంగ్రెస్‌ నేతలు ఎంతో కష్టపడి పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు మంజూరు చేయించారని తెలిపారు. ఉద్యోగ పరీక్ష జరగలేదనే బెంగతో మొన్న యువతి ఆత్మహత్య చేసుకుందని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు.

    దెబ్బతీసేందుకు కుట్ర: కేసీఆర్

    తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ బీఆర్‌ఎస్‌ నేతలతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సాంకేతికంగా దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారు.. కోపతాపాలను అభ్యర్థులు పక్కనపెట్టాలి.. మాకే అంతా తెలుసు అనుకోవద్దు. మళ్లీ విజయం మనదే, ఎవరూ తొందరపడొద్దు.. న్యాయపరమైన ఇబ్బందుల వల్లే వేములవాడలో సీటు మార్పు.. సామరస్యపూర్వకంగా సీట్ల సర్దుబాటు.. ప్రతీ కార్యకర్తతో నేతలు మాట్లాడాలి. మనల్ని గెలవలేకే కుయుక్తులు పన్నుతున్నారు అని చెప్పుకొచ్చారు.

    ‘మనుషుల ప్రాణాలకు విలువ లేదు’

    HYD: గ్రూప్ 2 అభ్యర్థిని మర్రి ప్రవల్లిక (23) బలవన్మరణంపై టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ట్విటర్ వేదికగా స్పందించారు. న్యాయం కావాలని వేల గొంతులు నినదిస్తున్నా సీఎం కేసీఆర్ చెవికి వినబడటం లేదని విమర్శించారు. ఈ పెద్దమనిషి (కేసీఆర్) పాలనలో మనుషుల ప్రాణాలకు విలువ లేదని మండిపడ్డారు. రాక్షస పాలనలో హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు తప్ప యువతకు భవిత లేదన్నారు. ప్రవల్లిక సూసైడ్ లెటర్‌ను గమనిస్తే ఇదే అర్థమవుతోందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని రేవంత్ డిమాండ్ చేశారు.

    కేసీఆర్‌పై పోటీ చేస్తా: ఈటల

    బీజేపీ నేత ఈటల రాజేందర్ కీలక ప్రకటన చేశారు. అధిష్టానం అవకాశం ఇస్తే కేసీఆర్ పోటీ చేసే రెండు చోట్లా పోటీ చేస్తానని ప్రకటించారు. హుజూరాబాద్‌లో మీరే కథానాయకులు అవ్వాలంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. భార్య జమున కేసీఆర్‌పై పోటీకి దిగుతారంటూ వస్తున్న ప్రచారం వాస్తవం కాదని రాజేందర్ క్లారిటీ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఈటల ప్రకటనతో కేసీఆర్‌పై పోటీకి బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో కొన్నిరోజులు వేచి చూడాల్సిందే..

    మూడోసారి కేసీఆరే సీఎం: ఓవైసీ

    తెలంగాణలో మూడో సారి కేసీఆర్ సీఎం అవుతారని MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తాము పోటీ చేసే ప్రతిచోటా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో రాజస్థాన్లోనూ పోటీ చేస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా MIM పోటీ చేసే స్థానాల్లో పార్టీ అభ్యర్థులకు, పోటీ చేయని చోట బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేయాలని ముస్లింలకు సూచించారు.

    కల్వకుంట్ల స్కాంలీకి కౌంట్ డౌన్: రేవంత్

    టీకాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పలు విమర్శలతో ఆసక్తికర ట్వీట్ చేశారు. కల్వకుంట్ల స్కాంలీకి కౌంట్ డౌన్ మొదలైందని విమర్శించారు. ‘ఇది.. దగాపడిన యువత, ఆగమైన అన్నదాత కన్నెర్ర చేస్తూ చెప్తున్న కౌంట్ డౌన్. ఇది.. కన్నీళ్లు పెట్టిన సర్కారు బడి చిన్నారి, పింఛన్ కోసం కాళ్లరిగేలా తిరిగిన పెద్ద మనిషి చేస్తున్న కౌంట్ డౌన్. ఇది.. నిలువ నీడలేని పేద కుటుంబం, మాట్లాడే స్వేచ్ఛలేని మేధావి వర్గం నినదిస్తున్న కౌంట్ డౌన్. ఈ 52 రోజుల కౌంట్ డౌన్ నియంత సర్కారుకు రాస్తున్న … Read more

    ‘తెలంగాణలో అభివృద్ధి పరుగులు పెడుతోంది’

    సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణలో అభివృద్ధి పరుగులు పెడుతోందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. గతంలో గోదావరి తలాపున వెళ్తున్నా నీళ్ల కోసం అవస్థలు పడ్డామని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో జరుగుతున్న బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 12.70 లక్షల మందికి కళ్యాణలక్ష్మి అందించామని హరీశ్ రావు పేర్కొన్నారు. గతంలో ప్రైవేట్ ఆస్పత్రులు పెరిగితే ఇప్పుడు ప్రభుత్వ ఆస్పత్రులు పెరుగుతున్నాయని చెప్పారు.

    సీఎం కేసీఆర్‌కు ఛాతిలో ఇన్పెక్షన్

    సీఎం కేసీఆర్‌కు ఛాతిలో బాక్టీరియల్ ఇన్పెక్షన్ సోకిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని, త్వరగా కోలుకుంటున్నారని చెప్పారు. వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న సీఎం కేసీఆర్ గత మూడు వారాలుగా ప్రజలకు దూరంగా ఉంటున్నారు. అయితే పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు ఎలాంటి ఆందోళన అవసరం లేదని, ఆయన కోలుకుంటున్నారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

    కేసీఆర్ ఓవైసీ కుటుంబానికి బానిస: కిషన్ రెడ్డి

    ఓవైసీ కుటుంబానికి కట్టు బానిసలుగా బీఆర్‌ఎస్‌ వ్యవహరిస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ‘అసదుద్దీన్ చేతిలో స్టీరింగ్ ఉన్న ప్రభుత్వాన్ని సాగనంపి సస్యశ్యామల తెలంగాణ సాధించాలి. మహిళల అవమానం చేసిన పార్టీ, రజాకార్ల పార్టీ, ఎంఐఎం పార్టీ హైదరాబాద్‌లో పుట్టింది. అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకుంటారు కేసీఆర్‌. కేసీఆర్‌ కూడా మహిళ వ్యతిరేకి. మహిళ మంత్రి లేని ప్రభుత్వం నడిపాడు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కూడా మహిళ బిల్లు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. తెలంగాణలో మహిళల ఓట్లు అడుగే హక్కు కాంగ్రెస్‌కు లేదు’ అని … Read more