• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • TS Elections: రూ.1 గ్యాస్ సిలిండర్లు

    తెలంగాణలో పోలింగ్ తేదీ దగ్గరపడుతుండడంతో ప్రధాన పార్టీలు ప్రచారంలో నిమగ్నమయ్యాయి. తమ మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు రాబట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ అభ్యర్థి కుమ్మరి వెంకటేష్‌ యాదవ్‌. రూపాయికే ఉచిత విద్య, రూపాయికే వైద్యం, రూపాయికే న్యాయ సలహాలిస్తానని చెబుతున్నారు. ప్రతి వంద కుటుంబాలకు ఒక వాలంటీరును నియమిస్తామని, 70 ఏళ్లు దాటిన వారు ఎమర్జెన్సీ పానిక్‌ బటన్‌ నొక్కగానే వచ్చి సాయం అందిస్తానంటూ ప్రచారం చేస్తున్నారు.

    TS: నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

    తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల నుంచి నేటి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి 10వ తేదీ సాయంత్రం 3గంటల వరకు నామినేషన్ స్వీకరణ ఉంటుంది. 13వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. అలాగే 15వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు ఎన్నికల సంఘం గడువు విధించింది. నామినేషన్ల స్వీకరణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు

    BSP రెండో జాబితా.. ట్రాన్స్‌జెండర్‌కు టికెట్

    తెలంగాణ అసెంబ్లీ నేపథ్యంలో 43 మంది అభ్యర్థులతో రెండో జాబితాను BSP విడుదల చేసింది. 43 మందిలో 26 మంది బీసీలు, ఏడుగురు ఎస్టీలు, ఆరుగురు ఎస్సీలు, ముగ్గురు ఓసీలకు సీట్లు కేటాయించినట్లు ఆ పార్టీ వెల్లడించింది. ఇందులో ట్రాన్స్‌జెండర్‌కు వరంగల్‌ తూర్పు టికెట్‌ కేటాయించింది. ఇప్పటికే 20 మంది అభ్యర్థులతో తొలి జాబితాను బీఎస్పీ ప్రకటించింది. తాజాగా మరో 43 మంది అభ్యర్థులను ప్రకటించింది.

    45 మంది పేర్లతో కాంగ్రెస్ రెండో జాబితా

    తెలంగాణలో అంబ్లీ ఎన్నికల సంబంధించి కాంగ్రెస్ రెండో విడతా జాబితాను విడుదల చేసింది. తాజాగా విడుదల చేసిన జాబితాలో 45 మంది అభ్యర్థులను ప్రకటించింది. గద్దర్ కూతురికి సికింద్రాబాద్ కంటోన్నెంట్ సీటు ఖరారు చేసింది, ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరావు, పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కూకట్‌పల్లి నుంచి బండి రమేష్, హుస్నాబాద్ నుంచి పొన్నం సుధాకర్, జూబ్లీహిల్స్ నుంచి హజారుద్ధిన్‌ను భరిలో నిలవనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది.

    TS Elections: పట్టుబడ్డ నగదు ఎంతో తెలుసా?

    తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి డబ్బు, మద్యం, ఆభరణాలు, విలువ మొత్తం రూ.130 కోట్ల మార్కును దాటింది. నిన్నటి నుంచి ఇప్పటి వరకు రూ.21,84,92,242 విలువైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.71 కోట్లకు పైగా నగదు, 52,091 లీటర్ల మద్యం, స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ మొత్తం రూ.7,55,79,917. రూ.4,58,4,720 విలువైన 1,694 కేజీల గంజాయి పట్టుబడిందని అధికారులు వెల్లడించారు.

    TS Elections: పట్టుబడ్డ నగదు ఎంతో తెలుసా?

    తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి డబ్బు, మద్యం, ఆభరణాలు, విలువ మొత్తం రూ.130 కోట్ల మార్కును దాటింది. నిన్నటి నుంచి ఇప్పటి వరకు రూ.21,84,92,242 విలువైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.71 కోట్లకు పైగా నగదు, 52,091 లీటర్ల మద్యం, స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ మొత్తం రూ.7,55,79,917. రూ.4,58,4,720 విలువైన 1,694 కేజీల గంజాయి పట్టుబడిందని అధికారులు వెల్లడించారు.

    ‘బీఆర్ఎస్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు’

    రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎన్నికల సందర్భంగా 54 మందితో కూడిన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిల తొలి జాబితాను ఆయన విడుదల చేశారు. వారితో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన కేటీఆర్ గత పదేళ్లలో ప్రభుత్వం సాధించిన ప్రగతిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. రాబోయే 45 రోజుల పాటు నియోజకవర్గాల్లోనే ఉండి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని కోరారు.

    TS Election: భోజనం రూ.80.. సమోసా రూ.10

    అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఖర్చులపై ఈసీ ప్రత్యేక దృష్టి పెట్టింది. నీళ్ల ప్యాకెట్ నుంచి మొదలుకుని ఆహారం, సభల్లో ఏర్పాటు చేసే భారీ బెలూన్లు, ఎల్‌ఈడీ తెరలకు సైతం ధరలను నిర్ణయించింది. అభ్యుర్థులు ఎన్నికల ఖర్చులను ఈసీకి సమర్పించే ముందు వ్యయంలో కుర్చీలు, టేబుళ్లు, వాహనాల కిరాయి, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే కళాకారుల పారితోషికం వివరాలు ఉండాలని ఈసీ స్పష్టం చేసింది. ఎన్నికల ఖర్చులో భాగంగా చికెన్ బిర్యానీ రూ.140, భోజనం రూ.80 సమోసా రూ.10 మాత్రమే ఖర్చుగా లెక్కిస్తామని ఈసీ … Read more

    హైదరాబాద్ ఇన్‌చార్జ్‌ సీపీగా విక్రమ్‌సింగ్

    హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ సీవీ ఆనంద్‌పై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన నేపథ్యంలో ఇన్‌చార్జ్ సీపీగా విక్రమ్‌సింగ్ మాన్ నియమితులయ్యారు. ఈ మేరకు డీజీపీ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల వ్యవహారాల పర్యవేక్షణలో నిర్లక్ష్యంగా ఉన్నారనే కారణంతో ముగ్గురు పోలీస్ కమిషనర్లు, నలుగురు కలెక్టర్లు, పది మంది ఎస్పీలతో సహా మొత్తం 20 మంది ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో బదిలీ అయిన వారి స్థానంలో ఇన్‌చార్జ్‌లను నియమించారు.

    ఎన్నికల గుర్తులపై ఢిల్లీ హైకోర్టుకు బీఆర్ఎస్

    బీఆర్ఎస్ ఎన్నికల సింబల్ అయిన కారును పోలిన గుర్తును అసెంబ్లీ ఎన్నికల్లో మరో పార్టీకి కేటాయించొద్దంటూ ఆ పార్టీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై కోర్టు నేడు విచారణ చేపట్టనుంది. కెమెరా, చపాతీ రోలర్, రోడ్డు రోలర్, సోప్‌డిష్, టెలివిజన్, కుట్టుమెషిన్, ఓడ, ఆటోరిక్షా వంటి కారును పోలిన గుర్తులను వచ్చే ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్థులు, గుర్తింపు లేని రాజకీయ పార్టీలకు కేటాయించొద్దని బీఆర్ఎస్ ఢిల్లీ హైకోర్టును అభ్యర్థించనుంది.