• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వావ్‌ కోహ్లీ! నవ్వొక గ్రేట్ టీం ప్లేయర్‌!!

    ఆదివారం ఇండియా వర్సెస్‌ సౌతాఫ్రికా మ్యాచ్‌లో టీమిండియా టాప్‌ ఫోర్‌ బ్యాటర్స్‌ చితక్కొట్టారు. ఇటీవలే ఫామ్‌లోకి వచ్చిన విరాట్‌ కోహ్లీ కూడా చెలరేగి ఆడాడు. అయితే ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో కోహ్లీ చేసిన పనికి నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. చివరి ఓవర్‌లో 49 రన్లతో కోహ్లీ నాన్‌ స్ట్రైకర్‌ ఎండ్‌లో ఉన్నాడు. డీకే స్ట్రయిక్‌ చేస్తున్నాడు. అయితే కోహ్లీ హాఫ్‌ సెంచరీ కోసం సింగిల్‌ తీసి ఇవ్వాలా డీకే అడిగినప్పుడు..అదేం వద్దు నీ ఆట నువ్‌ ఆడు అన్నట్లుగా కోహ్లీ చెప్పాడు. దీనికి … Read more

    ‘ఆదిపురుష్’పై నెగెటివ్ ఫీడ్‌బ్యాక్

    ప్రభాస్ రాముడిగా నటించిన ‘ఆదిపురుష్’ టీజర్ ఎట్టకేలకు విడుదలైంది. కానీ, టీజర్‌ని చూస్తుంటే యానిమేటెడ్ మూవీని తలపిస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. గ్రాఫిక్స్ తేలిపోయిందని వారు భావిస్తున్నారు. టీజర్‌లో పాత్రల కదలికలను చూస్తుంటే ఇది స్పష్టమవుతోందని అంటున్నారు. అయితే, తన డైలాగులతో ప్రభాస్ హోరెత్తిస్తున్నాడని ఫ్యాన్స్ అంటున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.

    LIVE: ఆదిపురుష్ టీజర్ ఈవెంట్

    అయోధ్యలో ‘ఆదిపురుష్’ టీజర్ ఈవెంట్ జరుగుతోంది. ఈ మేరకు చిత్రబృందం అక్కడికి చేరుకుంది. ఇదివరకే విడుదల చేసిన ఆదిపురుష్ పోస్టర్ అదిరింది. రాముడి లుక్‌లో ప్రభాస్ ఆకట్టుకున్నాడు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 12న విడుదల చేసేందుకు మేకర్స్ బృందం సిద్ధమవుతోంది. ఓం ప్రకాశ్ రౌత్ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.

    కర్నూలులో రజకుల వినూత్న నిరసన

    కర్నూలు నగరపాలక సంస్థ అధికారుల తీరుపై స్థానిక రజకులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. కార్యాలయంలోకి గాడిదలను తీసుకెళ్లి రజకులు ఆందోళన చేశారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగుతోందంటూ తమ గాడిదలను తీసుకెళ్లిన అధికారులు వాటికి తిండి పెట్టలేదని వారు ధర్నా చేశారు. అధికారుల తీరు వల్ల రెండు గాడిదలు చనిపోవడంతో పాటు మరికొన్ని గాయాల పాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ధోబీ ఘాట్లు నిర్మించడంతో పాటు గాడిదల ఆవాసానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు.

    అంబులెన్స్‌ కోసం కాన్వాయ్‌ ఆపిన మోదీ

    ప్రధాని మోదీ తన నిరాడంబరత్వాన్ని నిత్యం చాటే ప్రయత్నం చేస్తుంటారు. ఇవాళ కూడా అలాంటి సంఘటన వెలుగుచూసింది. గుజరాత్‌లో పర్యటనకు వెళ్లిన ప్రధాని రహదారిపై వెళ్తున్నారు. ప్రధాని కాన్వాయ్‌ వస్తుందంటే ఆ దారిలో ట్రాఫిక్‌ అంతా ఆపేసి దారి వదలడం సహజం. కానీ ప్రధాని స్వయంగా ఓ అంబులెన్స్‌కు దారి ఇచ్చేందుకు తన కాన్వాయ్‌ను పక్కకు ఆపించారు. అంబులెన్స్‌ వెళ్లిపోయాక తిరిగి తన కాన్వాయ్‌ తీసుకెళ్లారు. అహ్మాదాబాద్‌ నుంచి గాంధీనగర్‌ వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. #WATCH | Gujarat: Prime Minister Narendra … Read more

    పూరీ జగన్నాథ్‌ జీవన మార్గం

    పూరీ మంచి దర్శకుడే కాదు, మంచి ఫిలాసఫర్ కూడా. తన పూరీ మ్యూజింగ్స్‌ ద్వారా ఎన్నో పాడ్‌కాస్ట్‌లలో ఎన్నో విషయాలు చెప్పాడు. అందుకో కొన్ని..

    LIVE: ‘గాడ్‌ ఫాదర్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌

    అక్టోబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న గాడ్‌ఫాదర్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ అనంతపురంలో ఘనంగా జరుగుతోంది. ఇప్పటికే సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. వేదికపై చిరంజీవి మాటలు వినేందుకు అభిమానులు ఎదురుచూస్తున్నారు.

    ‘గాడ్ ఫాదర్‌’ ట్రైలర్‌ వచ్చేసింది

    మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ మూవీ ట్రైలర్‌ వచ్చేసింది. అక్టోబర్‌ 5న సినిమా విడుదల కానుండగా చిత్రబృందం ట్రైలర్‌ విడుదల చేసింది. పూరీ వాయిస్‌ ఓవర్‌తో సాగిన ఈ ట్రైలర్‌ ఆసక్తిగానే అనిపించింది. చివర్లో సల్మాన్‌ ఖాన్‌ డైలాగ్‌ అభిమానులకు ఊపునిచ్చేలా ఉంది. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్‌ గుడ్ ఫిల్మ్స్‌ బ్యానర్‌పై విడుదల అవుతోంది. మళయాలంలో సూపర్ హిట్‌ అయిన లూసిఫర్‌క్‌ రీమేక్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

    ‘కండోమ్‌లు కూడా ఇవ్వాలా?’ బిహార్‌ అధికారి వ్యాఖ్యలు

    బిహార్‌ మహిళా, శిశు సంక్షేమాభివృద్ధి శాఖ అధికారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. పాట్నాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అధికారి ఓ బాలిక అడిగన ప్రశ్నకు అనుచిత రీతిలో సమాధానమిచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న ఓ బాలిక ‘ ప్రభుత్వం ఇన్ని ఉచితంగా ఇస్తోంది కదా! రూ.20-30 ఉండే శానిటరీ నాప్కిన్స్‌ ఇవ్వలేదా?’ అని ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు అక్కడున్న వారంతా చప్పట్లు కొట్టడంతో అసహనానికి గురైన అధికారి హర్జోత్‌ కౌర్‌ భమ్రా..తీవ్రంగా స్పందించారు. ‘ఇప్పుడు నాప్కిన్లు, రేపు జీన్స్, ఎల్లుండి కండోమ్‌లు.. అన్నీ మీకు … Read more

    బాలయ్య ‘అన్‌స్టాపబుల్‌’ ఆంథమ్‌ చూశారా?

    ‘ఆహా’ ఓటీటీలో మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ టాక్‌ షోగా నిలిచిన బాలయ్య ‘అన్‌స్టాపబుల్‌’ రెండో సీజన్‌ ప్రారంభానికి సిద్ధమవుతున్న వేళ…. ,షో ఆంథమ్‌ను విడుదల చేశారు. మహతి స్వర సాగర్ స్వరాలు సమకూర్చి, ర్యాపర్‌ రోల్‌ రిడా పాడిన ఈ పాట బాలయ్య మాస్‌ డైలాగ్స్‌తో స్టార్ట్‌ అయి ఊపునిచ్చేలా సాగింది. ‘ఎంటర్‌టైన్‌మెంట్‌ నీ ఫుడ్‌లో ఉందేమో నా బ్లడ్‌లోనే ఉందిరా బ్లడీ ఫూల్‌’ అంటూ బాలయ్య డైలాగ్స్‌ బాగా పేలాయి.