• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చంద్రబాబు ఆరోగ్యంపై కోర్టులో పిటిషన్

    టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్య సరిస్థితిపై చంద్రబాబు తరపు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. రాజమహేంద్రవరం జైలు అధికారులు ప్రభుత్వ వైద్యుల సూచనలను పాటించేలా చూడాలని అందులో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు వాదనలు విననుంది. చంద్రబాబును చల్లని వాతావరణంలో ఉంచాలని ఇప్పటికే ప్రభుత్వ వైద్యులు జైలు అధికారులకు సూచించారు. చంద్రబాబు కుటుంబసభ్యులు కూడా ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    లోకేష్, భువనేశ్వరి భావోద్వేగం

    జైలులో చంద్రబాబును కలిసి ఆయన సతీమణి భువనేశ్వరి, లోకేష్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. చంద్రబాబు ఆరోగ్యపరిస్థితి ఆందోళన చెందారు. ములాఖత్‌ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడకుండానే భువనేశ్వరి, లోకేష్ దుఃఖంతో నేరుగా బస కేంద్రానికి వెళ్లిపోయారు. జైలులో చంద్రబాబును చూసి చాలా బాధేసిందని కాసాని జ్ఞానేశ్వర్‌ తెలిపారు.

    ‘జైలులో చంద్రబాబు హత్యకు కుట్ర’

    AP: అనారోగ్యం పేరుతో తెదేపా అధినేత చంద్రబాబును అంతమొందించే కుట్ర జరుగుతోందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. వ్యవస్థలను మేనేజ్‌ చేస్తూ చంద్రబాబును రిమాండ్‌లోనే ఉంచాలనే కుట్ర జరుగుతోందన్నారు ‘చంద్రబాబు జీవితం ప్రమాదంలో ఉంది. భద్రతలేని జైలులో ఆరోగ్యం క్షీణించేలా చేసి ప్రాణహాని తలపెడుతున్నారు. ఏ తప్పూ చేయని చంద్రబాబు పట్ల ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరిస్తోంది. చంద్రబాబుకు ఏ హాని జరిగినా.. జగన్‌ సర్కార్‌దే బాధ్యత. ఆయన ఆరోగ్యంపై ఎందుకీ కక్ష?’ అని ప్రశ్నించారు.

    పెళ్లి చేయలేదని కన్న తండ్రి హత్య

    AP: ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో దారుణం జరిగింది. పెళ్లి చేయలేదనే నెపంతో తండ్రిని కుమారుడు హత్య చేశాడు. తెల్లవారుజామున తండ్రి బాలభద్రాచారిని ఇంటి నుంచి బయటకి తీసుకెళ్లిన కుమారుడు గురునారాయణ పథకం ప్రకారం హతమార్చాడు. తొలుత తన వెంట తెచ్చుకున్న కత్తితో తండ్రి గొంతు కోసి చంపాడు. ఆ తర్వాత తాను కూడా గొంతు కోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. స్వల్ప గాయాలైన గురునారాయణను ఒంగోలు ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

    అన్న ఫ్యామిలీనే బలిగొన్న తమ్ముడు

    పంజాబ్‌లోని మొహాలి జిల్లాలో మత్తు పదార్థాలకు బానిసైన ఓ యువకుడు సొంత అన్న కుటుంబాన్ని అంతం చేశాడు. ఖరడ్‌లో ఈ దుర్ఘటన జరిగింది. ఆర్థికంగా స్థిరపడిన అన్న సత్వీర్‌సింగ్‌పై నిందితుడు కక్ష పెంచుకున్నాడు. సత్వీర్‌సింగ్‌, అమన్‌దీప్‌ కౌర్‌ దంపతులతోపాటు వారి కుమారుడు లఖ్‌వీర్‌ సింగ్‌ను చంపేశాడు. తొలుత అన్న భార్యను కత్తితో పొడిచి అనంతరం అన్నను పారతో బాది హత్య చేశాడు. ఆ తర్వాత రెండేళ్ల చిన్నారిని నిర్దాక్షిణ్యంగా చిదిమేశాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

    ‘మనుషుల ప్రాణాలకు విలువ లేదు’

    HYD: గ్రూప్ 2 అభ్యర్థిని మర్రి ప్రవల్లిక (23) బలవన్మరణంపై టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ట్విటర్ వేదికగా స్పందించారు. న్యాయం కావాలని వేల గొంతులు నినదిస్తున్నా సీఎం కేసీఆర్ చెవికి వినబడటం లేదని విమర్శించారు. ఈ పెద్దమనిషి (కేసీఆర్) పాలనలో మనుషుల ప్రాణాలకు విలువ లేదని మండిపడ్డారు. రాక్షస పాలనలో హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు తప్ప యువతకు భవిత లేదన్నారు. ప్రవల్లిక సూసైడ్ లెటర్‌ను గమనిస్తే ఇదే అర్థమవుతోందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని రేవంత్ డిమాండ్ చేశారు.

    తొలిసారి మహాచండీ అలంకారం

    AP: దసరా ఉత్సవాల్లో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారు మహాచండీ అలంకారంలో దర్శనమివ్వనున్నారు. ఈ నెల 19న సింహ వాహనంపై కొలువుదీరిన మహాచండీ రూపంలో అమ్మవారు దర్శనమిస్తారని ఆలయ నిర్వాహకులు తెలిపారు. త్రిశక్తి స్వరూపిణి అయిన మహాచండీని ప్రార్థిస్తే సర్వదేవతలనూ కొలిచినట్లేనని భక్తుల విశ్వాసం. మరోవైపు దసరా శరన్నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిని విద్యుత్తు దీపాలతో అలంకరించారు.

    బంగారం ప్రియులకు భారీ ఊరట

    వారం రోజులుగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు ఇవాళ మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. నిన్నటితో పోలిస్తే 22, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధరలో ఎలాంటి మార్పు లేదు. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ రూ.54,150 పలుకుతోంది. 24 క్యారెట్ల మేలిమి బంగారం రూ.59,060 వద్ద ట్రేడింగ్ అవుతోంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54 వేల వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి ధర రూ.58,910గా ఉంది. ఏపీలోని విశాఖ, … Read more

    నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

    AP: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ఇవాళ రాత్రి 7-8 గంటల మధ్య శాస్త్రోక్తంగా అంకురార్పణ జరగనుంది. ఈ సందర్భంగా శ్రీవారి తరఫున సేనాధిపతి అయిన విష్వక్సేనులవారు ఆలయ మాడ వీధు­ల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. ఈ ఘట్టం తరువాత రంగనాయకుల మం­డపంలో ఆస్థానం నిర్వహిస్తారు. అక్టోబర్‌ 15–23వ తేదీల మధ్య ఈ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. తొలి రోజు ఉ. 9-11 గంటల మధ్య బంగారు తిరుచ్చి ఉత్సవం, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు పెద్దశేష వాహనసేవ నిర్వహిస్తారు.

    నేడు, రేపు ఎస్‌ఐ మెయిన్స్ పరీక్షలు

    AP: నేటి నుంచి రెండ్రోజుల పాటు రాష్ట్రంలో ఎస్‌ఐ మెయిన్స్‌ పరీక్షలు జరగనున్నాయి. విశాఖపట్నం, ఏలూరు, గుంటూ­రు, కర్నూలు జిల్లా కేంద్రాల్లో శని, ఆదివారాల్లో మెయిన్స్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్‌ విధానంలో రెండు పేపర్లు, డిస్క్రిప్టివ్‌ విధానంలో రెండు పేపర్లు చొప్పున మొత్తం నాలుగు పేపర్లుగా ఈ పరీక్షలను జరగనున్నాయి. మెయిన్‌ పరీక్షలకు మొత్తం 31,193 మంది అర్హత సాధించారు. వారిలో పురుషులు 27,590, మహిళలు 3,603. పరీక్షలకు సంబంధించి సందేహా­లుంటే slprb@ap.gov.inలో సంప్రదించవచ్చు.