• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చంద్రబాబును ఆస్పత్రికి తరలిస్తారా?

    AP: తెదేపా అధినేత చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఆయన్ను రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి ఆస్పత్రికి తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు కనిపిస్తోంది. నిన్న రాత్రి రాజమహేంద్రవరం GGH ఆస్పత్రిలో ఉన్న వీఐపీ చికిత్స గదిని అధికారులు అత్యవసరంగా పరిశీలించారు. గదిలో రెండు ఆక్సిజన్‌ బెడ్లు, ఒక ఈసీజీ మిషన్‌, వెంటిలేటర్‌, వైద్య పరికరాలు, మందులు అందుబాటులో ఉంచారు. దీన్ని బట్టి ఆయన్ను ఆస్పత్రికి తరలించే ఛాన్స్‌ ఉందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.

    16న ఉత్తరాంధ్రలో జగన్ పర్యటన

    AP: సీఎం జగన్‌ ఈ నెల 16న విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో పర్యటిస్తారు. ఉ. 9 గం.లకు తాడేపల్లి నుంచి బయలుదేరి విశాఖలోని ఇన్ఫోసిస్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను సీఎం ప్రారంభిస్తారు. తర్వాత హెలిప్యాడ్‌ వద్ద జీవీఎంసీ బీచ్‌ క్లీనింగ్‌ మిషన్లు ప్రారంభిస్తారు. దాని తర్వాత అనకాపల్లి జిల్లా పరవాడ చేరుకోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఫార్మాసిటీలో యుజియా స్టెరైల్‌ ప్రెవేట్‌ లిమిటెడ్‌ ప్రారంభోత్సవంలో సీఎం పాల్గొంటారు. తర్వాత అచ్యుతాపురంలో లారస్‌ ల్యాబ్స్‌ యూనిట్‌ 2 ఫార్ములేషన్‌ బ్లాక్‌ ప్రారంభిస్తారు. తిరిగి సాయంత్రం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

    హైదరాబాద్ పోలీస్ బాస్ ఎవరు..?

    ఎన్నికల వ్యవహారాల్లో నిర్లక్ష్యం వహించారనే కారణంతో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌పై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన నేపథ్యంలో ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే దానిపై సస్పెన్స్ నెలకొంది. తెలంగాణ సీఎస్ శాంతికుమారి ముగ్గురు పేర్లతో కూడిన లిస్టును సీఈసీకి పంపించారు. ఈ ముగ్గురిలో ఒకరి పేరును నగర సీపీగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ రోజు సాయంత్రం లోపు ఈసీ నిర్ణయం వెలువడుతుందనే చర్చ జరుగుతోంది. కీలకమైన పోస్ట్ కావడంతో అందరి దృష్టి దీనిపైనే ఉంది.

    లోకేష్ ట్వీట్ బాధ కలిగించింది: KTR

    చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై లోకేష్ ట్వీట్ బాధను కలిచిందని మంత్రి కేటీఆర్ అన్నారు. కుమారుడిగా లోకేష్ ఆవేదన ఎలా ఉంటుందో తనకు తెలుసన్నారు. కేసీఆర్ నిరాహార దీక్ష సమయంలో తనకు ఆందోళన కలిగిందని చెప్పారు. హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలనే చంద్రబాబు అరెస్టుపై ఆందోళనలు వద్దంటున్నానని కేటీఆర్ పేర్కొన్నారు.

    జైలులో చంద్రబాబుకు ప్రాణహాని: లోకేష్

    ‘భ‌ద్ర‌త‌లేని జైలులో చంద్రబాబు ఆరోగ్యం క్షీణించేలా చేసి ఆయ‌న‌కి ప్రాణ‌హాని తల‌పెడుతున్నారని టీడీపీ నేత లోకేష్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. ‘ఎన్న‌డూ ఏ త‌ప్పూ చేయ‌ని 73 ఏళ్ల చంద్ర‌బాబు ప‌ట్ల రాక్ష‌సంగా వ్య‌వ‌హ‌రిస్తోంది ఈ ప్ర‌భుత్వం. వ్య‌వ‌స్థ‌ల్ని మేనేజ్ చేస్తూ, జ్యుడీషియ‌ల్ రిమాండ్‌లో ఉంచుతూనే 73 ఏళ్ల చంద్ర‌బాబు గారిని అనారోగ్య కార‌ణాల‌తో అంత‌మొందించే ప్ర‌ణాళిక ఏదో ర‌చిస్తున్నారు. చంద్ర‌బాబు గారి ఆరోగ్యంపై జైలు అధికారుల తీరు సందేహాస్ప‌దంగా ఉంది. చంద్ర‌బాబు ఏ హాని జ‌రిగినా, సైకోజ‌గ‌న్ బాధ్య‌త‌’ … Read more

    ఏపీలో రూ.750 కోట్లతో స్టార్ హోటల్స్

    టెక్ మహీంద్రా సంస్థ ఏపీలో రూ.750 కోట్ల పెట్టుబడితో మూడు స్టార్ హోటల్స్ ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు టెక్ మహీంద్రా సీఈఓ, ఎండీ సీపీ గుర్నానీ సీఎం జగన్‌ను కలిసి వివరాలు వెల్లడించారు. వైజాగ్ సహా మూడు పర్యాటక ప్రాంతాల్లో ఒక్కోదానికి రూ.250 కోట్ల చొప్పున ఖర్చు చేసి మూడు స్టార్ హోటల్స్ నిర్మించనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. మరో రెండు నెలల్లో ఫైవ్ స్టార్, సెవెన్ స్టార్ హోటల్స్ నిర్మాణానికి శంకుస్థాప చేస్తామని చెప్పారు.

    అందుకే రాజీనామా చేశా: పొన్నాల

    కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన పొన్నాల లక్ష్మయ్య తాను ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని అమ్మకానికి పెట్టారు. గత రెండేళ్లుగా పార్టీ విధానాలకు వ్యతిరేకంగా కార్యకలపాలు జరుగుతున్నాయి. సొంత పార్టీలోనే తాము పరాయి వాళ్లము అయ్యాం. మా బాధలు చెప్పుకునేందుకు 50 మంది బీసీ నేతలం వెళ్తే ఏఐసీసీ అపాయింట్ మెంట్ ఇవ్వదు. ఎక్కడైనా రేవంత్‌కు నమస్తే పెడితే కనీసం స్పందించడు అని ఆవేదన వ్యక్తం చేశారు.

    జగన్‌పై అభిమానంతో సినిమా తీశా: RGV

    ‘వ్యూహం’ ట్రైలర్ రిలీజ్ చేసిన రామ్‌ గోపాల్‌ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఈ సినిమా వెనుక ఎలాంటి వ్యూహం ఏమి లేదు నిజం మాత్రమే ఉంది.. వ్యూహం రెండు భాగాలుగా వస్తుంది.. వైఎస్ మరణం తర్వాత నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలతో ఈ రెండు సినిమాలు ఉంటాయి. పబ్లిక్ డొమైన్‌లో ఉన్న జీవితాలను సినిమా తీయడానికి ఎవరి పర్మిషన్ అవసరం లేదు.. నేను లక్ష్మిస్ ఎన్టీఆర్, సర్కార్ సినిమాలు అలా తీసినవే. నేను వైఎస్‌ జగన్ మీద ఉన్న అభిమానంతో సినిమా … Read more

    ఫోన్ చేసి చెప్పినా తప్పుకుంటా: అనిల్ కుమార్

    మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తప్పుకోమని సీఎం జగన్ ఆదేశిస్తే.. ఎమ్మెల్యేగా పోటీ నుంచి తప్పుకుంటానని పేర్కొన్నారు. ఫోన్‌లో ఆదేశించినా సిద్ధంగా ఉన్నాను అని స్పష్టం చేశారు. YSR కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావానికి ముందు నుంచి జగనన్నతోనే ఉన్నాను. పదవిలో ఉన్నా లేకపోయినా జగనన్నతోనే ఉంటానని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీ అన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

    ఇద్దరు కుమార్తెలతో సహా తండ్రి సూసైడ్

    హైదరాబాద్ నగరంలోని బోయిన్‌పల్లిలో ఓ వ్యక్తి ఇద్దరు కుమార్తెలతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు. మృతులు శ్రీకాంత్ చారి(42), స్రవంతి(8), శ్రావ్య(7)గా గుర్తించారు. మృతదేహాల పక్కన నిద్ర మాత్రలు ఉండటంతో వీరు గురువారం రాత్రి భోజనం చేసిన తర్వాత నిద్ర మాత్రలు మింగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారి ఆత్మహత్యకు గల కారణాలు ఏంటనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.