• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నిర్మాత దిల్‌ రాజు ఇంట విషాదం

    నిర్మాత దిల్‌ రాజు ఇంట విషాదం నెలకొంది. దిల్‌ రాజు తండ్రి శ్యామ్‌ సుందర్‌రెడ్డి (86) సాయంత్రం కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చేర్పించారు. చికిత్స పొందుతూ శ్యామ్‌ సుందర్‌రెడ్డి తుదిశ్వాస విడిచారు.

    అనుష్కను కోడలిగా చేసుకోవాలనుకున్న డైరెక్టర్!

    స్టార్ డైరెక్టర్ కే రాఘవేంద్రరావు ఒకప్పుడు హీరోయిన్ అనుష్క శెట్టిని తన కోడలిగా చేసుకోవాలని ప్రయత్నించినట్లు సమాచారం. తన కుమారుడు ప్రకాశ్‌ను పెళ్లి చేసుకుంటావా అని డైరెక్ట్‌గా అనుష్కనే అడిగేశాడట. దీనికి అనుష్క నో చెప్పినట్లు టాక్. ఆ తర్వాత కనికతో ప్రకాశ్‌కు పెళ్లి చేశారు. 2017లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. అనంతరం మళ్లీ అనుష్క వద్ద పెళ్లి మ్యాటర్ చర్చించాలని రాఘవేంద్రరావు అనుకున్నారట. కానీ రెండో పెళ్లికి ఒప్పుకుంటుందా అన్న సందేహంతో ఆగిపోయినట్లు సమాచారం.

    ఆ దర్శకుడు నా లోదుస్తులు విప్పమన్నాడు: స్టార్ హీరోయిన్

    ఓ బాలీవుడ్ దర్శకుడు తన లో దుస్తులు విప్పమన్నాడని గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తెలిపింది. ‘‘నా కెరీర్ స్టార్టింగ్‌లో నేను ఒక సినిమా చేస్తున్నా. అందులో డ్యాన్స్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో డైరెక్టర్ నా దగ్గరకొచ్చి డ్యాన్స్ చేసేటప్పుడు నా లో దుస్తులు తీసేయాలన్నాడు. లో దుస్తులు తీసేస్తేనే సినిమా బాగా ఆడుతుందన్నాడు. నేను అందుకు అంగీకరించలేదు. అతడిపై చాలా కోపం వచ్చింది. అందుకే ఆ సినిమా నుంచి తప్పుకున్నా.’’ అంటూ ప్రియాంక చెప్పుకొచ్చింది.

    డైరెక్టర్‌గా మారిన మరో జబర్దస్త్ కమెడియన్

    మరో జబర్దస్త్ కమెడియన్ డైరెక్టర్‌గా మారాడు. జబర్దస్త్ నటుడు శాంతికుమార్ తుర్లపాటి ‘నాతో నేను’ అనే సినిమా డైరెక్ట్ చేశాడు. ఈ మూవీ ఫస్ట్ లుక్, పోస్టర్‌ను ఎంపీ, రచయిత విజయేంద్ర ప్రసాద్ ఆవిష్కరించారు. ఈ చిత్రాన్ని ఫీల్ గుడ్ లవ్‌స్టోరీగా తెరకెక్కంచారు. ఈ సినిమాలో సాయికుమార్, శ్రీనివాస్ సాయి, ఆదిత్య ఓం, రాజీవ్ కనకాల, ఐశ్వర్య ప్రధాన పాత్రలు పోషించారు. సత్య కశ్యప్ స్వర రచన చేశారు. ఈ మూవీకి ప్రశాంత్ కుమార్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా త్వరలో థియేటర్లలో రిలీజ్ … Read more

    ఆ డైరెక్టర్ నంబర్ బ్లాక్ చేశా; రష్మిక

    తన తొలి సినిమా డైరెక్టర్ నంబర్ బ్లాక్ చేసినట్లు నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తెలిపింది. సినీ రంగంలోకి తన ఎంట్రీపై రష్మిక మాట్లాడింది. ‘‘నేను అందాల పోటీల్లో గెలిచిన వెంటనే తమ సినిమాలో నటించాలని డైరెక్టర్ ఫోన్ చేశారు. నేను ఫ్రాంక్ కాల్ అనుకుని ఆ నంబర్ బ్లాక్ చేశా. తర్వాత దర్శక నిర్మాతలు ఎలాగోలా మా టీచర్ ద్వారా నన్ను కలిశారు. ఈ తర్వాత నాతో కొన్ని డైలాగులు చెప్పించారు. అనంతరం ‘కిరిక్ పార్టీ’ మూవీలో హీరోయిన్‌గా ఎంపిక చేశారు.’’ అంటూ … Read more

    ఆ డైరెక్టర్ వ్యాఖ్యలు దురదృష్టకరం; నాని

    ‘కేజీఎఫ్‌’ సినిమాపై టాలీవుడ్ దర్శకుడు వెంకటేశ్ మహా వ్యాఖ్యలు దురదృష్టకరమని న్యాచురల్ స్టార్ నాని అన్నారు. ‘దసరా’ మూవీ ప్రమోషన్లలో భాగంగా నాని స్పందించారు.‘‘నలుగురు దర్శకులు పాల్గొన్న చర్చా కార్యక్రమం చూశా. వెంకటేశ్ మాట్లాడిన విధం బాగా లేదు. అందుకే అతడు విమర్శలు ఎదుర్కొన్నాడు. అక్కడున్న నలుగురు దర్శకులు నాకు తెలిసిన వాళ్లే. చిన్న వీడియో క్లిప్ చూసి ఒక అభిప్రాయానికి రావడం కరెక్ట్ కాదు. ఇలా జరగడం దురదృష్టకరం.’’ అంటూ నాని పేర్కొన్నాడు

    ‘కేజీఎఫ్’పై టాలీవుడ్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు

    [వీడియో;](url) కన్నడ స్టార్ హీరో యశ్ హీరోగా నటించిన ‘కేజీఎఫ్’ సినిమాపై టాలీవుడ్ డైరెక్టర్ వెంకటేశ్ మహా పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఒక తల్లి.. కొడుకును నువ్వు గొప్పోడివి కావాలంటుంది. బాగా సంపాదించి నలుగురికి ఉపయోగపడు అంటుంది. ఆ హీరో వెళ్లి బంగారం సంపాదిస్తాడు. దానిని తీసుకెళ్లి సముద్రంలో పారదొబ్బుతాడు. ఇలాంటి కథను సినిమాగా తీస్తే మనం చప్పట్లు కొడుతున్నాం.’’ అంటూ సెటైర్లు వేశాడు. మహా వ్యాఖ్యలపై యశ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. Kanth gadu dengesina amount antha undav ra nee … Read more

    ఆస్కార్ బరిలో ‘కళాతపస్వి’ చిత్రం

    దిగ్గజ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్ (92) వృద్ధ్యాప్యంతో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన ఎన్నో టాలీవుడ్, బాలీవుడ్ చిత్రాలను నిర్మించారు. అగ్ర కథానాయకులకు ఆయన దర్శకత్వం వహించి ఎన్నో ఆణిముత్యాలను ఇండస్ట్రీకి అందించారు. వాటిలో ‘స్వాతిముత్యం’, ‘సాగరసంగమం’, ‘శంకరాభరణం’, ‘ఆపద్భాంధవుడు’, ‘శృతిలయలు’, ‘సిరివెన్నెల’, ‘స్వరాభిషేకం’, ‘నేరము-శిక్ష’, వంటి చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. [‘స్వాతిముత్యం’](url) సినిమా 59వ ఆస్కార్ చిత్రాల బరిలో నిలిచింది. Telugu audience can never forget Kamal Hassan's role as an autistic individual in #SwathiMuthyam Only … Read more

    సౌండ్ ఆర్టిస్ట్ టు లెజండరీ డైరెక్టర్

    కళాతపస్వి, లెజండరీ డైరెక్టర్ కె.విశ్వనాథ్ (92) వృద్ధాప్యంతో మరణించిన సంగతి తెలిసిందే. కాగా ఆయన స్వస్థలం ఏపీలోని బాపట్ల జిల్లా పెదపులివర్రు. గుంటూరు హిందు కాలేజీలో ఇంటర్, ఏసీ కాలేజీలో డిగ్రీ చదివారు. అనంతరం చెన్నై వెళ్లి విజయవాహినీ స్టూడియోలో సౌండి రికార్డిస్ట్‌గా కెరీర్ ఆరంభించారు. 1965లో ‘ఆత్మగౌరవం’ సినిమాకు దర్శకుడిగా మారాడు. తొలి చిత్రానికే ‘నంది’ అవార్డు అందుకున్నాడు. ఆయన 9 బాలీవుడ్ సినిమాలతో కలిపి మొత్తం 50కి పైగా సినిమాలకు దర్శకత్వం చేపట్టారు.

    తండ్రైన స్టార్ డైరెక్టర్; ఎమోషనల్ పోస్ట్

    తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ తండ్రి అయ్యారు. ఆయన భార్య, నటి ప్రియా మోహన్ మగబిడ్డకు జన్మనిచ్చినట్లు అట్లీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో ఎమోషనల్ [వీడియో](url) పోస్ట్ పెట్టారు. ‘‘మాకు మగబిడ్డ జన్మించాడు. ఇంతకు మించిన ఆనందం మాకు మరెక్కడా లేదు. మా బిడ్డకు మీ అందరి ఆశీర్వాదాలు కావాలి.’’ అంటూ పేర్కొన్నారు. కాగా అట్లీ ప్రస్తుతం షారుఖ్ ఖాన్‌తో ‘జవాన్’ సినిమా తీస్తున్నాడు. ఆ సినిమా పూర్తి కాగానే యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో మరో చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. They … Read more