• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బీఆర్‌ఎస్‌లో చేరిన పొన్నాల

    కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య బీఆర్‌ఎస్‌లో చేరారు. జనగామ బహిరంగ సభలో పొన్నాల సీఎం కేసీఆర్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా పొన్నాలకు పార్టీలో సుముచిత స్థానం కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌లో ఉండి ఎన్నో అవమానాలకు గురయ్యానని పొన్నాల అన్నారు. 45 ఏళ్లు కష్టపడినా పలితం దక్కలేదన్నారు. అందుకే బీఆర్‌ఎస్‌లో చేరానని పొన్నాల పేర్కొన్నారు.

    ప్రతి ఒక్కరికి రూ.5 లక్షల బీమా

    సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ మెనిఫెస్టోని ప్రకటించారు. రేషన్ కార్డు ఉన్న 93 లక్షల మందికి కేసీఆర్ బీమా కింద రూ.5 లక్షల బీమా వర్తింపజేస్తున్నాం. బీమా ప్రిమియం డబ్బును ఎల్‌ఐసీకి ప్రభుత్వమే చెల్లిస్తుంది. దివ్యాంగుల పెన్షన్‌కు రూ.6 వేలకు పెంచుతున్నాం. రైతు బంధు పథకం డబ్బును రూ.16 వేలకు పెంచుతున్నాం. అసరా పెన్షన్లు రూ.5 వేలకు పెంచుతున్నాం. అన్నపూర్ణ పథకం కింద సన్నబియ్యం పంపిణీ చేస్తాం. అక్రిడేషన్‌లో ఉన్న జర్నలిస్టులకు రూ.400కే సిలిండర్లు అందిస్తున్నట్లు చెప్పారు.

    ‘తెలంగాణను ఆంధ్రలో కలపాలనుకుంటున్నారు’

    మంత్రి గంగుల కీలక వ్యాఖ్యలు చేశారు. “కేసీఆర్ లేని తెలంగాణను ఊహించలేం. ఆంద్రవాళ్లు తెలంగాణను తిరిగి ఆంధ్రలో కలపాలని చూస్తున్నారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి తెలంగాణ గురించి ఎందుకు? కాంగ్రెస్ బీ ఫారమ్‌లు బీజేపీ ఆఫీస్‌లో బీజేపీ బీ ఫారమ్‌లు కాంగ్రెస్ ఆఫీసులో తయారవుతున్నాయి. ఎన్నికలప్పుడు వచ్చేవారిని చూసి ప్రజలు మోసపోవద్దు’ అని చెప్పుకొచ్చారు.

    హరీష్, కేటీఆర్‌తో సీఎం కేసీఆర్ కీలక భేటీ!

    ఈరోజు సాయంత్రం సీఎం కేసీఆర్ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్‌తో కీలక సమావేశం కానున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ఇద్దరితో కేసీఆర్ సమాలోచనలు జరపనున్నారు. ఎన్నికలకు ముందే పార్టీలోని అసంతృప్త నేతలను బుజ్జగించడం, మేనిఫెస్టోపై తుది కసరత్తు, పెండింగ్ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించడంపై కేసీఆర్ ఆలోచనలు పంచుకోనున్నారు. ఎలక్షన్స్ ఇన్ఛార్జ్ లుగా ఎవరిని ఎక్కడ నియమించాలనే అంశంపైనా చర్చించనున్నారు.

    17 రోజులు.. 41 భారీ బహిరంగ సభలు

    అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి దూకుడు మీదున్న బీఆర్ఎస్ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళిక సిద్దం చేసుకుంటుంది. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ ప్రచార షెడ్యూల్‌ను ఆ పార్టీ ప్రకటించింది. ఆయన 17 రోజుల్లో 41 భారీ బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యే నవంబంర్ 3వ తేదీ నాటికే సీఎం కేసీఆర్ 26 సభలకు హాజరయ్యేలా ప్రణాళిక రచించారు. కాగా, తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి.

    నవంబర్ 9న కేసీఆర్ నామినేషన్

    అక్టోబర్ 15న హుస్నాబాద్ బహిరంగ సభలో బీఆర్ఎస్ పార్టీ మానిఫెస్టోను కేసీఆర్ ప్రకటించనున్నారు. అదే రోజు పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో, తెలంగాణ భవన్‌లో గులాబీ బాస్ కేసీఆర్ భేటీ కానున్నారు. అభ్యర్థులకు బీ ఫారాలను అందించి పార్టీ మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. నవంబర్ 9న రెండు చోట్ల కేసీఆర్ నామినేషన్లు వేయనున్నారు. అక్టోబర్ 15, 16, 17, 18 తేదీల్లో జిల్లాలు, నియోజకవర్గాల పర్యటన చేపట్టనున్నారు. అక్టోబర్ 16న జనగామ, భువనగిరి బహిరంగ సభల్లో సీఎం పాల్గొంటారు. 17న సిద్దిపేట, సిరిసిల్ల, 18న మధ్యాహ్నం … Read more

    శ్రీవారిని దర్శించుకున్న కేసీఆర్ సతీమణి

    సీఎం కేసీఆర్ సతీమణి శోభ ఈ రోజు తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న రాత్రి తిరుమల చేరుకున్న శోభ ఈ రోజు స్వామి వారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆమెకు టీటీడీ అధికారులు స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు. కాగా, తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వ దర్శనానికి 8 గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. Kalvakuntla Shobha, wife of Telangana CM #KCR, went to #Tirumala Monday … Read more

    15 నుంచి ప్రజల్లోకి సీఎం కేసీఆర్

    ఈ నెల 15 నుంచి వరుస కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లేందుకు సీఎం కేసీఆర్ ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. 15న పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధులతో సమావేశం నిర్వహించి ఎన్నికల ప్రచారంపై దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశంలోనే అభ్యర్థులకు పార్టీ బీ ఫామ్స్ అందజేయడంతో పాటు ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించనున్నారు. అదే రోజు సాయంత్రం హుస్నాబాద్‌లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. 16న జనగామ, భువనగిరి.. 17న సిద్ధిపేట, సిరిసిల్ల.. 18న జడ్చర్ల, మేడ్చల్‌లో నిర్వహించే సభలకు హాజరుకానున్నారు.

    కేసీఆర్‌పై నడ్డా ఘాటు విమర్శలు

    BRSపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఘాటు విమర్శలు చేశారు. మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌లో బీజేపీ కౌన్సిల్‌ సమావేశంలో నడ్డా మాట్లాడుతూ.. ‘తెలంగాణ కోసం కేంద్రం 9 ఏళ్లలో 9 లక్షల కోట్లు కేటాయించింది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో BRS కుటుంబపాలన అంతం కావడం ఖాయం. కేవలం తమ ఆకాంక్షల కోసమే ప్రాంతీయ పార్టీలు ఆవిర్భవించాయి. ఆ ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలుగా మారిపోయాయి. BRS కుటుంబ పార్టీ. కేసీఆర్‌కు ఒక సందేశం ఇస్తున్నా వచ్చే ఎన్నికల్లో అన్నీ ముగిసిపోతాయి’’ అని నడ్డా … Read more

    నేడు ‘సీఎం అల్పాహారం’ ప్రారంభం

    తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ అందించేందుకు తీసుకువస్తున్న ‘సీఎం అల్పాహారం’ పథకం నేడు ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి ఒక స్కూల్‌ చొప్పున ఈ రోజు ప్రారంభించనున్నారు. మహేశ్వరం నియోజకవర్గం రావిర్యాలలో సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ ఆయన స్థానంలో మంత్రి హరీశ్‌రావు హాజరుకానున్నారు. ఉప్మా, కిచిడీ, పొంగల్, ఇడ్లీ, పూరీతో మెనూ సిద్ధం చేశారు.