• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నరరూప హంతకుడు శవమై తేలాడు

    అమెరికాలోని మైనేలో కాల్పులతో విధ్వంసం సృష్టించిన నిందితుడు శవమై తేలాడు. మైనేలో రెండు వేర్వేరు చోట్ల జరిపిన కాల్పుల్లో 18 మందిని పొట్టనపెట్టుకున్న రాబర్ట్ కార్డ్ (40) తుపాకీతో తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. పోలీసులు, FBI ఏజెంట్లు రెండ్రోజులుగా తీవ్రంగా గాలిస్తున్న క్రమంలో అతడి మృతదేహం తాజాగా బయటపడింది. రాబర్ట్ బాడీని లిస్బన్ ఫాల్స్‌లోని రీసైక్లింగ్ సెంటర్‌కు సమీపంలో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు రిటైర్డ్‌ మిలటరీ ఆఫీసర్‌గా గుర్తించారు.

    వీధి కుక్కల దాడితో వ్యాపారవేత్త మృతి

    ప్రముఖ వ్యాపారవేత్త, వాఘ్‌ బక్రీ టీ గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పరాగ్‌ దేశాయ్‌(49) కన్నుమూశారు. మెదడులో తీవ్ర రక్తస్రావం వల్ల ఆదివారం ఆయన మరణించినట్లు కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది. గతవారం ఇంటికి సమీపంలో వీధి కుక్కలు దాడి చేయడంతో పరాగ్‌ దేశాయ్‌ కిందపడిపోయారు. దీంతో ఆయన తలకు తీవ్ర గాయమైంది. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ పరాగ్‌ మరణించారు. పరాగ్‌ మృతిపై రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు విచారం వ్యక్తం చేస్తున్నారు.

    బెల్లంపల్లి PSలో నిందితుడు మృతి

    తెలంగాణలోని బెల్లంపల్లి పోలీస్ స్టేషన్‌లో ఓ నిందితుడు ఫిట్స్‌తో మృతి చెందాడు. అతడు కుప్పకూలిపోవడం సీసీ కెమెరాలో రికార్డైంది. కీర్తి అంజి(27) అనే యువకుడు ఇటీవల ఓ మహిళ ఇంటికి వెళ్లి ఆమెను బెదిరించాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా అతడిని అరెస్ట్ చేశారు. విచారణ కోసం అంజి పోలీస్ స్టేషన్‌లోని కుర్చీలో కూర్చున్నాడు. ఇంతలో ఫిట్స్ వచ్చి అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లలేదని యువకుడి బంధువులు ఆరోపిస్తున్నారు. బెల్లంపల్లి పోలీస్ స్టేషన్లో ఫిట్స్ వచ్చి నిందితుడు మృతి మంచిర్యాల … Read more

    అజాగ్రత్తతో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

    ఓ యువకుడు అజాగ్రత్తతో తన ప్రాణాలనే పోగొట్టుకున్నాడు. ముంబైలో ఉన్న మలాడ్ రైల్వేస్టేషన్‌లోని ఫ్లాట్‌ఫామ్‌పై ఇద్దరు యువకులు చేతులు కడుక్కుంటున్నారు. ఇంతలో అకస్మాత్తుగా వెనుకనుంచి వచ్చిన ఓ లోకల్ ట్రైన్ మయాంక్(17) అనే యువకుడిని బలంగా ఢీకొట్టింది. దీంతో ఆ యువకుడు ఆమడ దూరంలో పడిపోయి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు పలు కామెంట్లు పెడుతున్నారు. Mumbai | The accident took place when he was standing to wash a … Read more

    ప్రముఖ నిర్మాత ఇంట్లో తీవ్ర విషాదం

    [వీడియో;](url) ప్రముఖ నిర్మాత మధు మంతెన ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మధు తండ్రి మురళీరాజు మంగళవారం హైదరాబాద్‌లో పక్షవాతంతో కన్నుమూశారు. కాగా సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మకు మధు మంతెన మేనమామ. ఆర్జీవీ సహకారంతోనే మధు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. మధు పలు బాలీవుడ్ హిట్ చిత్రాలను నిర్మించాడు. ‘ఉడ్తా పంజాబ్’, ‘గజినీ’, ‘83’ వంటి సినిమాలు తెరకెక్కించాడు. ప్రస్తుతం మరో నిర్మాత అల్లు అరవింద్‌తో కలసి ‘రామాయణం’ సినిమాను నిర్మిస్తున్నాడు. #AamirKhan? and #AlluArjun pay respects to the mortal … Read more