ఘోర పడవ ప్రమాదం; 145 మంది దుర్మరణం
కాంగోలో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. పడవ మునిగిపోవడంతో అందులో ఉన్న 145 మంది జలసమాధి అయ్యారు. లులోంగా నదిలో మొత్తం 200 మందితో ఒక మోటరైజ్డ్ పడవ కాంగో వెళ్తుండగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 145 మంది మృతి చెందగా, 55 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ప్రయాణికులతో పాటు పశువులు, వస్తువులు కూడా ఉండటంతో ఓవర్ లోడ్ అయ్యి పడవ మునిగింది. వీరు బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తుండగా మృత్యువాతపడ్డారు.