• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వీడియో చూశాక నిద్ర పట్టలేదు: స్వాతి

    మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా రోడ్డుపై పరేడ్ చేపించడం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ స్వాతి మాలివాల్ స్పందించారు. ‘ఆ వీడియో చూశాక నాకు రాత్రి నిద్ర పట్టలేదు. 2 నెలల కిందట జరిగిన ఘటన ఇది. అయినా, ఒక్కరినీ అరెస్ట్ చేయకపోవడం సిగ్గచేటు. కేంద్రం నిశ్శబ్దంగా ఉంటుంది. ప్రధాని ఒక్క మాటా మాట్లాడరు. హింసాఖాండకు తెరదించాలని మణిపూర్ సీఎం, మోదీకి లేఖలు రాస్తా’ అని ఆమె చెప్పారు. #WATCH | DCW chief Swati … Read more

    బాస్టిల్ డే పరేడ్‌లో మోదీ, మెక్రాన్

    ఫ్రాన్స్ పర్యటనలో రెండో రోజు ప్రధాని వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఫ్రాన్స్ స్వాతంత్య్ర వేడుకలకు భారత ప్రధాని గౌరవ అతిథిగా హాజరయ్యారు. ప్రధానితో పాటు ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్, ప్రథమ మహిళ(అధ్యక్షుడి భార్య) బ్రిగిట్టె మెక్రాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాస్టిల్ డే పరేడ్‌ని సిబ్బంది నిర్వహించగా వీరు తిలకించారు. అంతకుముందు ప్రధానికి ఆ దేశ అత్యున్నత సైనిక, పౌర పురస్కారాన్ని మెక్రాన్ ప్రసాదించారు. #WATCH | Prime Minister Narendra Modi, French President Emmanuel Macron, France's First … Read more

    భార్య లేని పీఎం ఉండొద్దు: లాలూ

    బిహార్ ఆర్జేడీ పార్టీ అగ్రనేత లాలూ ప్రసాద్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భార్య లేని వారు ప్రధాని నివాసంలో ఉండటం తప్పని చెప్పారు. ప్రధాని అయ్యే వ్యక్తులకు తప్పనిసరిగా శ్రీమతి ఉండాలని లాలూ వ్యాఖ్యానించారు. ఇటీవల పాట్నాలో జరిగిన విపక్షాల ఐక్యతా సమావేశంలో పెళ్లి చేసుకోవాలని రాహుల్ గాంధీకి లాలూ సూచించడం వైరల్ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా లాలూ ఈ వ్యాఖ్యలు చేశారు. అర్ధాంగి లేకుండా పీఎం నివాసంలో ఉండే సంప్రదాయాన్ని వచ్చే ఎన్నికల్లో 300 సీట్లతో కడిగేస్తామని ఆయన చెప్పారు. … Read more

    ఢిల్లీ మెట్రోలో ప్రయాణించిన మోదీ

    ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీ మెట్రోల పర్యటించారు. స్వయంగా టికెట్ తీసుకుని మెట్రో రైలు ఎక్కారు. అయితే, మోదీ రాక సందర్భంగా ఢిల్లీ యూనివర్సిటీ విధించిన నిబంధనలు విమర్శలకు దారితీస్తున్నాయి. కార్యక్రమానికి నల్ల దుస్తులు వేసుకు రావొద్దని, కచ్చితంగా హాజరు కావాలని నోటీసులు జారీ చేయడం వివాదాస్పదమైంది. #WATCH | Prime Minister Narendra Modi travels by metro to attend centenary … Read more

    మోదీజీ దేవుడికే పాఠాలు చెబుతారు: రాహుల్

    ప్రధాని మోదీ భారత ప్రజలను భయపెడుతున్నారని రాహుల్ గాంధీ విమర్శించారు. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ అక్కడి ప్రవాస భారతీయులతో చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగం చేస్తున్నారు. అంతా తమకే తెలుసనుకునే వారు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. చరిత్రకారులకే చరిత్ర చెప్పేలా, సైన్యానికే యుద్ధం నేర్పేలా చేస్తారు. చివరికి దేవుడికి కూడా పాఠాలు చెప్పేలా తయారయ్యారు. అలాంటి వారిలో ఒకరు మోదీ’ అంటూ కాలిఫోర్నియాలో జరిగిన మీటింగ్‌లో రాహుల్ విరుచుకు పడ్డారు. Just listen the speech of Mr #RahulGandhi "Santa … Read more

    సినిమా స్టార్ల ట్వీట్.. ప్రధాని రిప్లై

    సినీ సెలబ్రిటీలు రజినీకాంత్, షారూక్ ఖాన్, అక్షయ్ కుమార్‌లకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. నూతన పార్లమెంట్ భవనం విశిష్ఠతలను వివరిస్తూ వీరు తమ వాయిస్ ఓవర్ ఇచ్చి ట్వీట్ చేశారు. వీరికి మోదీ రిప్లై ఇచ్చారు. షారూక్ ట్వీట్‌కి స్పందిస్తూ అద్భుతంగా వర్ణించారన్నారు. ‘అద్భుతంగా వర్ణించారు. ప్రజాస్వామ్య పురోగతికి ఈ నూతన పార్లమెంట్ భవనం నిదర్శనం. సంప్రదాయం, ఆధునికతల మేళవింపు’ అని రిప్లై ఇచ్చారు. తలైవా రజినీకాంత్, అక్షయ్ కుమార్ ట్వీట్ చేసిన వీడియోను సైతం ప్రధాని రీట్వీట్ చేశారు. Beautifully expressed! … Read more

    ఆనాడు గవర్నర్ గుర్తు రాలేదా?: తమిళిసై

    పార్లమెంట్ నూతన భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించబోతుండడాన్ని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ సమర్థించారు. తెలంగాణ నూతన సెక్రటేరియట్ ఓపెనింగ్ గురించి గవర్నర్ ప్రస్తావించారు. ‘నూతన సెక్రటేరియట్ ఓపెనింగ్‌ గవర్నర్‌ చేతుల మీదుగా జరగాలని ప్రతిపక్షాలు చెప్పాయి. కానీ, కార్యనిర్వహక భవనం పేరుతో కనీసం నన్ను ఆహ్వానించలేదు. మరి, ఇప్పుడెలా రాష్ట్రపతి ప్రారంభించాలని అంటున్నారు? ఆ నాడు గవర్నర్ రాష్ట్ర ప్రథమ పౌరురాలు అని గుర్తు రాలేదా?’ అని గవర్నర్ ప్రశ్నించారు. తమిళిసై పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కూడా. #WATCH | #NewParliamentBuilding … Read more

    మోదీపై ఫోన్ విసిరేసిన దుండగుడు

    కర్ణాటక ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోదీకి చేదు అనుభవం ఎదురైంది. మైసూరులో మోదీ పాల్గొన్న మెగా రోడ్ షోలో భద్రతా వైఫల్యం తలెత్తింది. ప్రజలకు అభివాదం చూస్తుండగా ఓ వ్యక్తి ప్రధానిపైకి ఫోన్ విసిరేశారు. అయితే, విసిరేసిన ఫోన్ వాహనం ముందు పడటంతో ప్రధాని కొద్దిలో తప్పించుకున్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు, ఈ రోడ్ షోకు భారీ సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు హాజరయ్యారు. మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. Security breach during PM Modi's Karnataka … Read more

    ‘ఎయిరో ఇండియా’ వేడుకలో ‘ప్రచండ’ విన్యాసం

    బెంగుళూరులో ఎయిరో ఇండియా ఎయిర్ షో ప్రారంభమైంది. ప్రధాని మోదీ లాంఛనంగా ఈ ఎగ్జిబిషన్‌ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దేశీయంగా తయారైన తేలికపాటి యుద్ధ విమానం ‘ప్రచండ్’ గాలిలో విన్యాసాలు చేసింది. గగనతలంలో ఫ్లిప్ చేస్తూ విమానం చేసిన విన్యాసాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. హిందూస్థాన్ ఎయిరోనాటిక్ లిమిటెడ్ ఈ విమానాన్ని రూపొందించింది. 700 కి.మీ రేంజ్ కలిగి ఉన్న ‘ప్రచండ్’.. గరిష్ఠంగా గంటకు 268కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. #WATCH | Light Combat Helicopter 'Prachand' performs aerobatic display at #AeroIndia in … Read more

    నేతాజీని గుర్తు చేసుకున్న మోదీ

    నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బోస్ సేవలను మోదీ గుర్తు చేసుకున్నారు. యువ కార్యకర్త స్థాయి నుంచి ప్రధాని మంత్రి వరకు చంద్రబోస్‌ని ఆదర్శంగా తీసుకుని చేసిన కార్యక్రమాల గురించి ఓ వీడియోను పంచుకున్నారు. ఇందులో బోస్ జయంతి రోజున మోదీ తీసుకున్న నిర్ణయాలను పొందుపర్చారు. బోస్ 125వ జయంతి సందర్భంగా ఆయన జయంతి రోజున పరాక్రమ దివాస్ నిర్వహించాలని ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని కూడా వీడియోలో చూపించారు. 2021 నుంచి కేంద్ర … Read more