• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బాలిక మిస్సింగ్ విషాదాంతం

    హైదరాబాద్‌లో అదృశ్యమైన నాలుగో తరగతి విద్యార్థిని ఇందు అనుమానాస్పదంగా మృతి చెందింది. శుక్రవారం మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడెం చెరువులో బాలిక మృతదేహం లభ్యమైంది. ఇందు మృతదేహాన్ని చూసి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. గురువారం ఇందును తండ్రి నరేష్ పాఠశాల వద్ద వదిలి వెళ్లాడు. ఆ తర్వాత బాలికా ఎక్కడా కనిపించలేదు. తల్లిడండ్రులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాలు పరిశీలించగా చెరువు వైపు వెళ్తున్నట్లు కనిపించింది.

    ఆమెను నేను కొట్టలేదు; నవీన్ రెడ్డి

    డెంటల్ విద్యార్థిని వైశాలిని తాను కొట్టలేదని, మాట్లాడటానికే కిడ్నాప్ చేశానని నిందితుడు నవీన్‌రెడ్డి తెలిపాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో ఏముందంటే‘‘ వైశాలి, నేను ప్రేమించుకున్నాం. ఆమె తల్లిడండ్రులే మమ్మల్ని విడదీశారు. ఆమె కోసం చాలా ఖర్చు చేశా. ఇటీవల వైశాలికి ఎన్నారై సంబంధం వస్తున్నట్లు తెలిసింది.దానిని అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే వైశాలి ఇంటికి వెళ్లా. తప్పక కిడ్నాప్ చేశా.’’ అంటూ చెప్పుకొచ్చాడు.

    వారాహి వాహనంపై ఆసక్తికర చర్చ

    జనసేన పవన్‌ కల్యాణ్ ప్రచార రథం వారాహి వాహనానికి తెలంగాణ రవాణా శాఖ రిజిస్ట్రేషన్ నంబర్‌ కేటాయించింది. TS02EX8384 నంబర్‌ ఇచ్చింది. ఇప్పుడు దీనిపై సామాజిక మాధ్యమాల్లో ఓ ఆసక్తికర వీడియో [వైరల్ ](url)అవుతోంది. పవన్ వారాహి వాహనం నంబర్‌, పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఫోన్ నెంబర్‌ చివరి నాలుగు అంకెలు సమానమనే చర్చ జరుగుతోంది. వైసీపీ నేతలు చెప్పినట్లు వారాహి రంగు ఆలివ్ గ్రీన్ కాదని ..ఎమరాల్డ్‌ గ్రీన్ అని ఆర్టీఏ అధికారులు తెలిపారు. 8384 ??@Pawankalyan’s ‘Varahi’ vehicle registration … Read more

    జనసేనాని ప్రచార రథాన్ని చూశారా..!

    [VIDEO:](url) పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్త పర్యటనకు వాహనం సిద్ధమైంది. ‘వారాహి’ పేరుతో ప్రత్యేక వాహనాన్ని జనసేన సిద్ధం చేసింది. ‘ఎన్నికల పోరుకు వారాహం సిద్ధమైంది’ అంటూ జనసేన ఓ వీడియోను ట్విటర్‌లో పంచుకుంది. ప్రజా సమస్యలు తెలుసుకోవడమే ఎజెండాగా పవన్ కళ్యాణ్ ‘బస్సు యాత్ర’కు పిలుపునిచ్చారు. తిరుపతి నుంచి ఈ యాత్ర మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే, హైటెక్ ప్రచార రథంగా ఇది రూపుదిద్దుకుంది. పవన్ కళ్యాణ్ దగ్గరుండి ఈ వాహనాన్ని సిద్ధం చేయించారు. ఆర్మీ రంగు పులుముకున్న ఈ బస్సు చుట్టూ సీసీ … Read more

    జనసేనాని ప్రచార రథాన్ని చూశారా..!

    [VIDEO:](url) పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్త పర్యటనకు వాహనం సిద్ధమైంది. ‘వారాహి’ పేరుతో ప్రత్యేక వాహనాన్ని జనసేన సిద్ధం చేసింది. ‘ఎన్నికల పోరుకు వారాహం సిద్ధమైంది’ అంటూ జనసేన ఓ వీడియోను ట్విటర్‌లో పంచుకుంది. ప్రజా సమస్యలు తెలుసుకోవడమే ఎజెండాగా పవన్ కళ్యాణ్ ‘బస్సు యాత్ర’కు పిలుపునిచ్చారు. తిరుపతి నుంచి ఈ యాత్ర మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే, హైటెక్ ప్రచార రథంగా ఇది రూపుదిద్దుకుంది. పవన్ కళ్యాణ్ దగ్గరుండి ఈ వాహనాన్ని సిద్ధం చేయించారు. ఆర్మీ రంగు పులుముకున్న ఈ బస్సు చుట్టూ సీసీ … Read more

    ట్విటర్‌లో షర్మిల vs కవిత

    తెలంగాణలో రాజకీయం మరింత వేడెక్కింది. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్య నెట్టింట మాటల యుద్ధం నడుస్తోంది. తనకు మద్దతుగా నిలిచిన కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు కృతజ్ఞతలు చెబుతూ షర్మిల ట్వీట్ చేశారు. దీంతో ‘‘తాము వదిలిన ‘బాణం’.. తానా అంటే తందానా అంటున్న ‘తామర పువ్వులు’’’ అని కవిత కౌంటర్ ఇచ్చారు. ఈ ట్వీట్‌కి బదులుగా ‘‘పాదయాత్రలు చేసింది లేదు.. ప్రజల సమస్యలు చూసింది లేదు.. ఇచ్చిన హామీల అమలు లేదు.. పదవులే కానీ పనితనం … Read more

    ‘మనుషులు ప్లాస్టిక్‌కు బానిసలయ్యారు’

    [VIDEO: ](url)ప్లాస్టిక్‌ వినియోగం రోజురోజుకూ పెరిగిపోవడంతో అటవీ ప్రాంతాల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలు భారీగా పేరుకుపోతున్నాయి. దీంతో అడవి జంతువులు ప్లాస్టిక్‌ వస్తువులను తిని మృత్యువాతపడుతున్నాయి. ఈ సందర్భంగా ఐఏస్ అధికారి సుప్రియా సాహు ప్లాస్టిక్ బాటిల్ తింటున్న ఓ ఏనుగు వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. “మానవులు ప్లాస్టిక్‌కు బానిసలుగా మారారు. విసిరివేయబడిన ప్లాస్టిక్ వల్ల మూగజీవాలు బలవుతున్నాయి. ఇది లెక్కకు మించిన విషాదం అంటూ ట్వీట్ చేశారు. When humans become slaves of throwaway plastic the price is paid … Read more

    తెదేపా నాయకుడిపై కత్తి దాడి

    కాకినాడ జిల్లా తునిలో తెదేపా నాయకుడిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. మాజీ ఎంపీపీ పొల్నాటి శేషగిరి రావును హత్య చేసేందుకు ప్రయత్నించాడు. భవాని మాల వేషధారణలో వచ్చిన నిందితుడు భిక్ష తీసుకుంటున్నట్లుగా నటించి కత్తితో పొడిచేందుకు ప్రయత్నించాడు. శేషగిరిరావు తలకు, చేతికి తీవ్ర గాయాలవ్వటంతో ఆస్పత్రికి తరలించారు. నిందితుడు బైక్ పై పారిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శేషగిరిరావును సీనియర్ నేతలు యనమల, రాజప్ప పరామర్శించారు.

    మలబార్ విన్యాసాల్లో భారత్ యుద్ద సన్నద్ధత

    [VIDEO:](url)జపాన్ సముద్రంలో జరుగుతున్న మలబార్ విన్యాసాల్లో భారత నౌకాదళం పాల్గొంది. ఈ విన్యాసాల్లో అణుశక్తితో నడిచే విమాన వాహక నౌకతో పాటు భారత్‌కు చెందిన మరో 11 ఉపరితల నౌకలు పాల్గొన్నాయి. వీటికి అదనంగా సముద్ర గస్తీ విమానం, రెండు హెలికాప్టర్లు, జలాంతర్గాములు యుద్ధవిన్యాసాల్లో అలరించాయి. లక్ష్యాలను ఛేదిస్తూ తమ యుద్ధసన్నద్దతను పరీక్షించుకున్నాయి. భారత్‌తో పాటు ఈ యుద్ధ విన్యాసాల్లో అమెరికా, జపాన్ నౌకాదళాలు కూడా పాల్గొన్నాయి. #WATCH | Indian Navy participates in the Malabar exercise 2022 in seas … Read more

    కృష్ణ భౌతిక కాయానికి ప్రముఖుల నివాళులు

    [VIDEO:](url) సూపర్‌స్టార్‌ కృష్ణ భౌతికకాయానికి ఏపీ సీఎం జగన్ నివాళులర్పించారు. కృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించారు. హీరో ప్రభాస్‌, ఆర్‌ నారాయణమూర్తి, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ కూడా కృష్ణ పార్థీవ దేహానికి శ్రద్ధాంజలి ఘటించారు. అటు సూపర్‌స్టార్‌ కృష్ణ మృతికి సంతాపంగా రేపు తెలుగు సినిమా పరిశ్రమ బంద్‌ పాటించాలని ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ పిలుపునిచ్చింది. షూటింగ్‌ నిలిపివేయాలని కోరింది. #Prabhas Pays Last Respects to Super Star Krishna#RIPSuperStarKrishnaGaru #SuperStarKrishna #Tollywood pic.twitter.com/yqj9RZQMw2 — greatandhra (@greatandhranews) November 15, 2022