• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చిత్తూరులో బావిలో పడ్డ ఏనుగు

    [VIDEO](url): APలోని చిత్తూరు జిల్లా గుండ్లపల్లి గ్రామంలో బావిలో పడిన ఏనుగుని అధికారులు రక్షించారు. సోమవారం రాత్రి ఇటుగా వచ్చిన ఏనుగు నీటిబావిలో పడిపోయింది. నేడు ఉదయం ఈ విషయాన్ని గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. పోలీసులు స్థానిక జేసీబీ సిబ్బంది సాయంతో బావి గోడను ఒకవైపు తొలగించారు. ఏనుగుకు ఎక్కేందుకు అనువుగా ఉండటానికి మట్టిని తొలగించారు. చాలా సేపటి తర్వాత ఏనుగు అందులో నుంచి పైకి ఎక్కి తన ప్రాణాలను కాపాడుకోగలిగింది. #WATCH | An elephant that fell into … Read more

    బీజేపీ ప్లెక్లీలే తొలగిస్తారా.. సోము వీర్రాజు ఆగ్రహం

    విశాఖలో ప్రధాని మోదీ పర్యటన వేళ.. అధికారులపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో పలు సెంటర్ల వద్ద ఏర్పాటు చేసిన బీజేపీ జెండాలు, ప్లెక్సీలు తొలగించడంపై మండిపడ్డారు.రెండ్రోజులు జెండాలు ఉంచడానికి కష్టం అయిపోయిందా మీకు అంటు నిలదీశారు. ట్రాలీలో ఉన్న పడేసిన జెండాలను తిరిగి తీసుకున్నారు. ప్రధాని మోదీ వస్తుంటే కనీసం స్వాగతం చెప్పే ప్లెక్సీలు కూడా ఉండనివ్వరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ [వీడియో](url) వైరల్‌గా మారింది. Plight Of National Party … Read more

    ఆలోచింపజేస్తున్న పవన్ స్పెషల్ వీడియో

    సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఓ స్పెషల్ వీడియో ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ [వీడియో](url) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో ఏముందంటే.. ‘‘వందల ఏళ్లు పాలించిన బ్రిటీషర్లను ఇప్పుడు రిషి సునాక్ ఏలుతున్నాడు. అలాంటిది ఏపీలో స్వేచ్ఛగా ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేకపోతున్నాం. నిరంకుశతత్వాన్ని ప్రశ్నించాలి’’ అంటూ ఆయన వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఈ వీడియో నెటిజన్లను, అభిమానులను ఆలోచింపజేస్తోంది. pic.twitter.com/qGQrRnaIvf — Pawan Kalyan (@PawanKalyan) November 8, 2022

    వైసీపీ గూండల్లారా జాగ్రత్త: పవన్ కళ్యాణ్

    గుంటూరు-ఇప్పంటంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయిన బాధితులను పరామార్శించేందుకు వచ్చిన పవన్‌ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ‘పోలీసుల వ్యవహారతీరుపై పవన్ [ఆగ్రహం](url) వ్యక్తం చేశారు. మార్చిలో ఇప్పంటం ప్రజలు జనసేనకు భూమిస్తే.. ఏప్రిల్‌లో ఇళ్లు కూల్చివేస్తామని నోటీసులిచ్చారు. వైసీపీ గూండాల్లారా జాగ్రత్త. రోడ్డు విస్తరణ చేయడానికి ఇప్పంటం ఏమైనా కాకినాడనా? రాజమండ్రినా? గుంతలు పూడ్చలేరు, రోడ్డు వేయలేరు కానీ గ్రామంలో రోడ్డు విస్తరణనా?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటం గ్రామం బయలుదేరిన శ్రీ పవన్ … Read more

    మునుగోడులో పరుగులు తీసిన కేఏ పాల్

    ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, మునుగోడు ఉప ఎన్నిక స్వతంత్ర అభ్యర్థి కేఏ పాల్ మునుగోడులో పరుగులు పెట్టారు. పోలింగ్ కేంద్రాల్లోపోలింగ్ సరళిని పరిశీలించి బయటకు పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) నెట్టింట్లో వైరల్‌గా మారింది. నియోజకవర్గంలో బిజీబిజీగా తిరుగుతూ సందడి చేశారు. కాగా మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో కేఏ పాల్ తన విన్యాసాలతో ప్రజలను ఆకట్టుకున్నారు. ప్రజలతో కలసి డ్యాన్స్ చేయడం, పాటలు పాడడం, సైకిల్ తొక్కడం వంటి చేష్టలతో నవ్వించారు. #KAPaul also running in the #Munugodu race … Read more

    మయోసైటిస్‌ త్వరగా నయం కాదు

    మయోసైటిస్‌ వ్యాధి త్వరగా నయం కాదని సన్‌ స్పిరిచ్యువల్‌ వ్యవస్థాపకులు విక్రమాదిత్య అన్నారు. ప్రతి సంవత్సరం 1500 నుంచి 2000 మయోసైటిస్‌ కేసులు నమోదవుతున్నాయని పేర్కొన్నారు. జీవన విధానాల మార్పుల కారణంగానే ఈ వ్యాధి సోకుతుందని వెల్లడించారు. అతిగా శారీరక శ్రమ చేయటంతో పాటు ఆహారపు అలవాట్ల కారణంగా మయోసైటిస్‌ సోకే ప్రమాదం ఉందని విక్రమాదిత్య తెలిపారు. హీరోయిన్‌ సమంత ఈ వ్యాధితోనే బాధపడుతున్నారు.

    న్యాయ రాజధాని కోసం కర్నూలులో మిలయన్ మార్చ్

    ఆంధ్రప్రదేశ్ అవతరణ వేడుకల వేళ.. కర్నూలులో ఉద్రిక్తత నెలకొంది.రాయలసీమ జేఏసీ ఆధ్వర్యంలో [మిలియన్](url) మార్చ్ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్దఎత్తున కర్నూలు ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు, ఇతర ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్.. రాజ్ విహార్ నుంచి కలెక్టరేట్ వరకు మిలియన్ మార్చ్ చేపట్టారు. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని దానిని సీఎం జగన్ నెరవెర్చాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. శ్రీబాగ్ ఒప్పందం అమలు చేయాలంటూ కర్నూలులో మిలియన్ మార్చ్‌ … Read more

    6వేల మందితో చిరు చిత్రం

    మెగాస్టార్ చిరంజీవిపై ఉన్న అభిమానాన్ని విద్యార్థులు వినూత్నంగా చాటుకున్నారు. తమ మైదానంలో మల్లారెడ్డి యూనివర్సిటీ విద్యార్థులు చిరు ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాన్ని డ్రా చేసి.. ఆరు వేల మంది ఆ లైన్‌పై కూర్చున్నారు. ‘క్యాన్సర్‌పై పోరాటం’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెళ్లిన చిరుకి ఈ వీడియో చూపించి సర్‌ప్రైజ్ చేశారు. ఈ వీడియో చూసిన చిరు ఎంతో మురిసిపోయి విద్యార్థులకు ధన్యవాదాలు చెప్పారు. ఈ వీడియోను చిత్ర దర్శకుడు బాబీ ట్విటర్‌లో షేర్ చేయగా.. వావ్ సూపర్ అటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. వీడియో … Read more

    8ఏళ్లలో HYDలో నిర్మించిన ప్లైఓవర్లు ఇవే

    హైదరాబాద్‌లో కీలకమైన నాగోల్ ప్లైఓవర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గత 8 ఏళ్లలో హైదరాబాద్‌లో నిర్మించిన ప్లైఓవర్లను, రోడ్ అండర్ బ్రిడ్జ్‌లను [వీడియో](url) రూపంలో తెలంగాణ డిజిటల్ వింగ్ పోస్ట్ చేసింది. హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య నివారించేందుకు తెలంగాణ ప్రభుత్వం వీటిని వ్యూహాత్మకంగా నిర్మిస్తోంది. వీడియోలో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్, ఎల్బీనగర్ ప్లైఓవర్, మైండ్‌స్పేస్ ప్లైఓవర్, JNTUH ఓవర్లు కనిపించాయి. As the #NagoleFlyover is all set for inauguration by @TSMAUDOnline Minister Sri @KTRTRS today, … Read more

    విజయనగరంలో అగ్నిప్రమాదం

    AP: విజయనగరంలోని విశాల్ మార్ట్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రేపు దీపావళి నేపథ్యంలో ఈరోజు ఉదయం కాస్త త్వరగానే మార్ట్‌ని తెరిచారు. లోనికి వచ్చాక స్విచ్‌లు వేయడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. తొలుత మొదటి ఫ్లోర్‌లో మొదలైన మంటలు మూడో అంతస్థుకు వ్యాప్తించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ.3కోట్ల మేర ఆస్తినష్టం జరిగినట్లు విశాల్ మార్ట్ యాజమాన్యం వెల్లడించింది. విజయనగరం: ఆర్ అండ్ బీ సమీపంలోని విశాల్ మార్ట్‌లో అగ్ని ప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు.. … Read more