• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • యువతులతో అంబటి ఊరమాస్ స్టెప్పులు

    ఏపీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి మాస్ స్టెప్పులతో ఇరగదీశారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జరిగిన భోగి వేడుకల్లో పాల్గొన్న ఆయన.. అక్కడ ఉన్న మహిళలు, యువతులతో డ్యాన్స్‌ చేశారు. భోగి వేడుకలు చూసేందుకు వచ్చిన వారికి హుషారెత్తించారు.

    భోగి వేడుకల్లో చంద్రబాబు, బాలయ్య

    సొంతఊరు నారావారిపల్లెలో భోగి వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ కుటుంబసభ్యులు భోగి మంటల్లో పాలుపంచుకున్నారు. తెలుగురాష్ట్రాల ప్రజలకు బాలయ్య భోగి శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని దేవున్ని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ఈ వేడుకల్లో నారవారిపల్లే ప్రజలతో పాటు తిరుపతి జిల్లా ముఖ్య నేతలు పాల్గొన్నారు

    రోజా.. అది నోరా.. కుప్పతొట్టా? సినీనటుడు నాగబాబు

    ఏపీ పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజాపై జనసేన నాయకుడు, సినీనటుడు నాగబాబు మండిపడ్డారు. తన సోదరులు చిరంజీవి, పవన్ కల్యాణ్‌ను విమర్శించడంపై రోజాపై ధ్వజమెత్తారు. ‘‘రోజా.. నీది నోరా.. [కుప్పతొట్టా](url)’’ అని ఎద్దేవా చేశారు. పర్యాటక శాఖ మంత్రి అంటే పర్యటనలు చేయడం కాదని.. ఆ శాఖను ఎలా అభివృద్ధి చేయాలో నేర్చుకోమని హితవు పలికారు. రోజా మంత్రి పదవి నుంచి దిగిపోయేసరికి పర్యాటక రంగం సర్వనాశనం అయిపోతుందని చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో ట్రెండింగ్‌లో ఉంది. #KuppaThottiRoja https://t.co/Y1ri1JB8QW — satyam (@SatyamAmp) … Read more

    సంక్రాంతి పందెంకోళ్ల జాతులు ఎన్ని?  వీటిని ఎలా పెంచుతారు?

    సంక్రాంతి అంటే రంగవల్లులు, గంగిరెద్దులు, భోగిమంటలే కాదు. కోడి పందేలు కూడా. ఈ ఆట ఆడనిదే సంక్రాంతి సంపూర్ణం కాదు. ఓ సరదాగా మొదలైన ఈ సంప్రదాయం ఇప్పుడు వ్యాపారంలా మారిపోయింది.  50 రకాలు పందెం కోళ్లలో సుమారు 50 రకాల వరకు ఉన్నాయి. కాకి, నెమలి, డేగ, పచ్చ కాకి, పర్ల, సేతువా, పూల, పింగళి, కౌజు, ఎర్రబోరా, నల్లబోరా, మైల, కొక్కిరాయి, నవల ఇలా చాలానే పేర్లున్నాయి. వీటిలో కాకి, డేగ, నెమలి రకం కోడి పుంజులు పందేలకు పెట్టింది పేరు.  … Read more

    కుప్పంలో రెండో రోజు బాబు పర్యటన; ఏం జరుగుతుందో?

    టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్నారు. పర్యటన తొలి రోజు పోలీసుల నుంచి అడుగడుగునా [ఆంక్షలు](url) ఎదుర్కొన్నారు. నేడు ఆయన నియోజకవర్గంలో ఎలా, ఎక్కడ పర్యటిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఓ వైపు ఈ రోజు మొత్తం పార్టీ కేడర్‌తో భేటీకి కేటాయించారు. బూత్‌ల వారీగా కార్యకర్తలతో సమావేశం అవుతారు. కాగా చంద్రబాబుకు సంబంధించిన ప్రచార రథాన్ని కుప్పం పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. Police deny permission for #ChandrababuNaidu#Chandrababu angrily questioned, "I am the … Read more

    వైసీపీ కోసం 70 ఎకరాలు అమ్ముకున్నా; జెడ్పీటీసీ ఆవేదన

    వైఎస్సార్‌సీపీ కోసం 70 ఎకరాలు అమ్ముకున్నానని ఓ ప్రజాప్రతినిధి వాపోయాడు. ఏపీలోని పల్నాడు జిల్లా బెల్లంకొండ జెడ్పీటీసీ గాదె వెంకటరెడ్డి తన ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఉన్న 120 ఎకరాల్లో 70 ఎకరాలు అమ్ముకుని పార్టీకి ఖర్చు చేసినా తనకు కనీస గౌరవం ఇవ్వడం లేదన్నారు. తన భార్య నగలు తాకట్టు పెట్టి థియేటర్‌లో [‘యాత్ర](url)’ మూవీ ఆడించానని తెలిపారు. ఎంపీ, ఎమ్మెల్యేకు తన గోడు వెళ్లబోసుకున్నా ఫలితం లేదన్నారు. ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదని వాపోయారు. Future … Read more

    సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర సంచలన వ్యాఖ్యలు

    ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేధాలు తారాస్థాయికి చేరాయి. పార్టీలోని ఓ కీలక నేతపై సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో ఉండగా ఒకలా ఇబ్బంది పెట్టారని, ఇప్పుడు బీఆర్ఎస్‌లో మరోలా తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. తనపై నియోజకవర్గంలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తాను టీడీపీలో మంత్రి పదవులు అనుభవించి పార్టీ మారలేదని, కార్యకర్తగానే టీడీపీని చివరిదాకా బతికించేందుకు పోరాడనన్నారు.

    చంద్రబాబు సభలో విషాదం; 8 మంది మృతి

    ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు బహిరంగ సభలో విషాదం చోటు చేసుకుంది. తొక్కిసలాట జరిగి 8 మంది దుర్మరణం పాలయ్యారు. నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఒక్కసారిగా [తోపులాట](url) జరిగి ఒకరిపై ఒకరు పడిపోయారు. దీంతో ఊపిరాడక అక్కడికక్కడే ఇద్దరు మరణించగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతో మరో 6 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతులకు తలో రూ.10 లక్షల చొప్పున సాయం అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. Breaking?JUST IN: Seven persons have … Read more

    నా తమ్ముడయ్య స్వామి: జగన్

    వైఎస్ ఆర్ జిల్లా పర్యటనలో సీఎం జగన్ కు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో [వైరల్](url) అయ్యింది. మూడ్రోజుల పర్యటన ముగించుకొని వెళ్తుండగా ఓ వ్యక్తి అర్జీ ఇచ్చేందుకు వెళ్లాడు. దాన్ని ఎంపీ అవినాశ్ రెడ్డికి అందించమని సీఎం సూచించారు. కానీ, అతడు మాత్రం ముఖ్యమంత్రికే ఇవ్వాలని ప్రయత్నించగా ఎంపీని చూపిస్తూ ఆయనెవరో కాదు..నా తమ్ముడే కద స్వామి అంటూ జగన్ వ్యాఖ్యానించారు. భద్రతా సిబ్బంది ఎంపీని నిలువరిస్తుంటే సీఎం ఇలా స్పందించారని తెలుస్తోంది. Security refuses to allow MP Avinash … Read more

    యువతి కిడ్నాప్.. జంటగా ప్రత్యక్షం..!

    TS: సిరిసిల్ల యువతి కిడ్నాప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తనను బలవంతంగా తీసుకెళ్లలేదని.. తనే ఫోన్ చేసి రమ్మన్నట్లు ఓ వీడియోలో తెలపింది. ప్రియుడు జానీతో వివాహం చేసుకున్న వీడియోను విడుదల చేసింది. అయితే, తీసుకెళ్లేటప్పుడు మాస్కు ఉండటంతో జానీని గుర్తపట్టలేదని తెలిపింది. ‘మా తల్లిదండ్రులు నాకు వేరే సంబంధాలు చూస్తున్నారు. నాలుగేళ్లుగా మేం ప్రేమించుకుంటున్నాం. ఇష్ట పూర్వకంగానే జానీని పెళ్లి చేసుకున్నా. మా కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉంది’ అని షాలిని తెలిపింది. నిన్న నిశ్చితార్థం పూర్తయి.. నేడు … Read more