• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సలార్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

    పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం సలార్. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్సైంది. డార్లింగ్ బర్త్‌డే కానుకగా అక్టోబర్ 23న ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు తెలిసింది. ప్రశాంత్ నీల్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్ పట్ల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. రవి బసృర్‌ సంగీతం అందిస్తుండగా… హోంబళే పిక్చర్స్ సలార్ చిత్రాన్ని నిర్మిస్తోంది.

    Sai Pallavi: సీతారాములుగా సాయిపల్లవి, రణ్‌బీర్‌.. రావణుడిగా యష్‌.. బాలీవుడ్‌లో మరో ‘రామాయణం’!

    అందాల తార సాయి పల్లవి బాలీవుడ్‌లోకి గ్రాండ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా తెరకెక్కనున్న ‘రామాయణం’ చిత్రంలో ఆమె సీతా దేవి పాత్రను పోషించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  2024లో ఈ చిత్రం ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో సీత పాత్రలో నటించేందుకు అలియా భట్, దీపికా పదుకొణె, కరీనా కపూర్‌ల పేర్లు పరిశీలిస్తున్నట్లు గతంలో ప్రచారం సాగింది. చివరికీ సాయిపల్లవిని ఫిక్స్‌ చేసినట్లు సమాచారం అందుతోంది.  రామయాణం చిత్రాన్ని బాలీవుడ్‌ డైరెక్టర్‌ నితీశ్‌ కుమార్‌ తెరకెక్కించనున్నట్లు బీటౌన్‌లో టాక్‌ వినిపిస్తోంది. అంతేగాక ఈ … Read more

    డీసెంట్ వసూళ్లు రాబడుతున్న స్కంద

    ఎనర్జిటిక్ స్టార్ రామ్‌ పొత్తినేని కుర్ర హీరోయిన్ శ్రీలీల జంటగా నటించిన చిత్రం స్కంద. గతవారం రిలీజైన ఈ మూవీ డీసెంట్ కలెక్షన్లను రాబడుతోంది. మొత్తం ఆరు రోజుల్లో స్కంద మూవీ తెలుగు రాష్ట్రాల్లో రూ.23.68కోట్లు మార్క్‌ను క్రాస్ చేసింది. ఈ వీకెండ్స్‌లోనూ పెద్ద సినిమాలు లేకపోవడంతో స్కంద కలెక్షన్లు పెరగనున్నాయి. కాగా ఈ చిత్రాన్ని బోయపాటి డైరెక్ట్ చేయగా.. థమన్ సంగీతం అందించాడు.

    సామాజిక సందేశంతో రజినీ సినిమా

    తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తన 170 వ చిత్రం గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. ఈ సినిమా సామాజిక సందేశంతో తెరకెక్కనున్నట్లు తెలిపారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుపాటి కీలక పాత్రల్లో నటించనున్నట్లు పేర్కొన్నారు. కాగా హీరోయిన్లుగా రతికా సింగ్, మంజువారియర్, దుషారా విజయ్‌ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ‘జై భీమ్’ ఫేమ్ జ్ఞానవేల్ డైరెక్ట్ చేస్తుండగా.. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.

    Meenakshi Chaudhary: గోల్డెన్ ఛాన్స్‌ కొట్టేసిన మీనాక్షి చౌదరి.. లక్‌ అంటే ఈ భామదే!

    హరియాణా బ్యూటీ మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary)ని గోల్డెన్ ఛాన్స్ వరించింది. త్రివిక్రమ్‌-మహేశ్‌ బాబు కాంబోలో వస్తున్న ‘గుంటూరు కారం’ (Guntur Karam)లో హీరోయిన్‌గా ఈ భామ ఛాన్స్‌ కొట్టేసింది. ఈ ప్రాజెక్ట్‌ నుంచి పూజా హెగ్డే (Pooja Hegde) తప్పుకోవడంతో ఆ స్థానంలోకి మీనాక్షి చౌదరి వచ్చి చేరింది.  మీనాక్షి చౌదరి తన కెరీర్‌ని సుశాంత్‌తో కలిసి ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ (Ichata Vahanamulu Niluparadu)తో ప్రారంభించింది. ఆ చిత్రం అంతగా ఆడలేదు. కానీ ఈ భామ అందానికి మంచి మార్కులే పడ్డాయి. … Read more

    టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్ విడుదల

    మాస్ మహారాజ్‌ రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు మూవీ నుంచి ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్‌లో రవితేజ లుక్స్‌ యాక్టింగ్ గూస్ బంప్స్ తెప్పించారు. మాస్ లుక్‌లో రవితేజ అదరగొట్టాడు. ట్రైలర్‌ సినిమాపై అంచనాలను పెంచింది. కాగా ఈ సినిమా అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ నటించింది. వంశీ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు.

    ప్రభాస్ చెంప మీద కొట్టిన యువతి

    ప్రభాస్‌ను ఓ యువతి చెంపదెబ్బ కొట్టిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎయిర్‌పోర్టులో ప్రభాస్‌ను గుర్తించిన యువతి సెల్ఫీ కోసం డార్లింగ్ దగ్గరకు వెళ్తుంది. ప్రభాస్‌తో ఫొటో దిగిన ఆనందంలో ఆ యువతి డార్లింగ్ చెంపపై చిన్నగా కొడుతుంది. ఆ తర్వాత గట్టిగా నవ్వుతూ ఆనందంతో తబ్బిబ్బు అవుతుంది. ఈవీడియో సాహో టైంలో జరిగిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కాగా ప్రభాస్ నటించిన సలార్ సినిమా డిసెంబర్‌లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. https://www.instagram.com/p/BumBLdvnEqw/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again

    ‘మ్యాడ్’ ట్రైలర్ విడుదల చేసిన జూ.ఎన్టీఆర్

    జూ.ఎన్టీఆర్ బావమర్ది నార్నే నితిన్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం మ్యాడ్. ఈ ట్రైలర్‌ను జూ. ఎన్టీఆర్ విడుదల చేశారు. ముగ్గురు స్నేహితుల జీవితాల మధ్య జరిగే సరదా సంఘటనలు సినిమాగా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేశాడు. బీమ్స్ సంగీతం అందించారు. సితార ఎంటర్టైన్‌మెంట్ వారు నిర్మిస్తున్నారు. అక్టోబర్ 6న మ్యాడ్ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

    అందుకే పూజాను తీసేశాం: నాగవంశీ

    ‘గుంటూరు కారం’ సినిమా నుంచి హీరోయిన్‌ పూజా హెగ్డేను తొలగించడంపై నిర్మాత నాగవంశీ స్పందించారు. ‘ఈ చిత్రాన్ని తొలుత ఆగస్టులో విడుదల చేద్దామనుకున్నాం. తర్వాత 2024 జనవరి 12కు మార్చాం. దాంతో కంగారులేకుండా నెమ్మదిగా షూటింగ్‌ చేయాలనుకున్నాం. కానీ, అదే సమయంలో పూజా హెగ్డే మరో హిందీ చిత్రంలో నటించాల్సి వచ్చింది. డేట్స్‌ అడ్జస్ట్‌ కాకపోవడంతో ఆమెను రీప్లేస్‌ చేశాం. దానికే కొందరు హంగామా చేశారు. పండగకు రావాల్సిన సినిమాలో ఏయే అంశాలు ఉండాలో అవన్నీ ఇందులో ఉన్నాయి’ అని తెలిపారు.

    ‘కొత్త బంగారు లోకం’ రిజెక్ట్‌ చేసిన హీరోలు!

    2008లో వచ్చిన ‘కొత్త బంగారు లోకం’ ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. తాజాగా ఈ సినిమాపై దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముందుగా ఈ సినిమా కథను నాగచైతన్య కోసం నాగార్జునకు చెప్పినట్లు డైరెక్టర్‌ తెలిపారు. ఆయన రిజెక్ట్‌ చేయడంతో రామ్‌ పోతినేనికి వినిపించినట్లు తెలిపారు. రామ్‌ కూడా ఇంట్రెస్ట్‌ చూపకపోవడంతో చివరికి వరణ్‌ సందేశ్‌ను ఎంచుకున్నట్లు స్పష్టం చేశారు. కాగా, ఈ చిత్రానికి మిక్కీ జే. మేయర్‌ సంగీతం అందించారు.