• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Sai Pallavi: సీతారాములుగా సాయిపల్లవి, రణ్‌బీర్‌.. రావణుడిగా యష్‌.. బాలీవుడ్‌లో మరో ‘రామాయణం’!

    అందాల తార సాయి పల్లవి బాలీవుడ్‌లోకి గ్రాండ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా తెరకెక్కనున్న ‘రామాయణం’ చిత్రంలో ఆమె సీతా దేవి పాత్రను పోషించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

    2024లో ఈ చిత్రం ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో సీత పాత్రలో నటించేందుకు అలియా భట్, దీపికా పదుకొణె, కరీనా కపూర్‌ల పేర్లు పరిశీలిస్తున్నట్లు గతంలో ప్రచారం సాగింది. చివరికీ సాయిపల్లవిని ఫిక్స్‌ చేసినట్లు సమాచారం అందుతోంది. 

    రామయాణం చిత్రాన్ని బాలీవుడ్‌ డైరెక్టర్‌ నితీశ్‌ కుమార్‌ తెరకెక్కించనున్నట్లు బీటౌన్‌లో టాక్‌ వినిపిస్తోంది. అంతేగాక ఈ చిత్రం మూడు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

    ఈ చిత్రంలో కేజీఎఫ్‌ హీరో యష్‌ రావణుడి పాత్రను పోషించనున్నట్లు బాలీవుడ్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఆస్కార్‌ విన్నింగ్‌ కంపెనీ ‘DNEG’.. ఈ మూవీకి VFX అందించనున్నట్లు సమాచారం. దీంతో ఇప్పటి నుంచే ఈ చిత్రంపై భారీ అంచనాలు పెరిగిపోయాయి.

    సహజంగా నటించి ఏ పాత్రకైనా ఒక మంచి విలువను తీసుకొచ్చే సాయి పల్లవి.. ఇక సీతగా ఆ క్యారెక్టర్‌కు ఎంతటి నిండుతనాన్ని తీసుకొస్తుందే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఈ పాత్రకు సంబంధించి మేకర్స్‌ సాయిపల్లవిని సంప్రదించగా నటించేందుకు ఆమె గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. 

    ఇన్నాళ్లు దక్షిణాది సినిమాలకే పరిమితమైన ఈ హైబ్రిడ్ పిల్ల.. బాలీవుడ్‌లో మరో సినిమాను సైతం చేస్తోంది. బాలీవుడ్ విలక్షణ నటుడు ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్‌తో ఈ భామ నటిస్తోంది. ఈ సినిమాను సునీల్ పాండే డైరెక్ట్ చేస్తున్నారు.

    ఇదిలా ఉంటే.. సాయిపల్లవికి పెళ్లి అయ్యిందంటూ ఇటీవల తెగ రూమర్స్‌ వచ్చాయి. తమిళ దర్శకుడు వేణు ఊడుగులను ఆమె వివాహం చేసుకున్నట్లు నెట్టింట విస్తృతంగా ప్రచారం జరిగింది. వారు దండలతో ఉన్న ఫొటోలు తెగ వైరల్‌ అయ్యాయి. 

    పెళ్లిపై జరుగుతున్న రూమర్స్‌పై సాయిపల్లవి స్పందించింది. ఓ సినిమా పూజా కార్యక్రమంలో దిగిన ఫొటోలను క్రాప్‌ చేసి డబ్బుకోసం నీచంగా ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడింది. పనికిమాలిన విషయాలపై స్పందించడం నిజంగా బాధగా ఉందని పేర్కొంది. ఒక వ్యక్తికి ఇలాంటి ఇబ్బందిని కలిగించడం నిజంగా నీచమైన చర్యేనని మండిపడింది.

    తెలుగులో శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదా సినిమాతో సాయిపల్లవి పరిచయమైంది. అంతకు ముందు ఈమె మలయాళంలో ’ప్రేమమ్’ సినిమాలో మలర్‌గా పలకరించింది. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో సాయి పల్లవి సినిమాలు చేస్తోంది.

    ప్రస్తుతం తెలుగులో నాగ చైతన్యతో కలిసి ఓ సినిమా చేస్తోంది ఈ భామ. చందు మొండేటి దర్శకుడు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. కొన్ని నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమా వస్తోందని తెలుస్తోంది. నాగ చైతన్యతో సాయి పల్లవికి ఇది రెండో సినిమా. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన లవ్ స్టోరీ తెలుగులో సూపర్ హిట్ అయింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv