అందాల తార సాయి పల్లవి బాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. రణ్బీర్ కపూర్ హీరోగా తెరకెక్కనున్న ‘రామాయణం’ చిత్రంలో ఆమె సీతా దేవి పాత్రను పోషించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
![](https://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/09/14115621/270006062_1196059357592002_4136075866963761014_n-820x1024.jpg)
2024లో ఈ చిత్రం ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో సీత పాత్రలో నటించేందుకు అలియా భట్, దీపికా పదుకొణె, కరీనా కపూర్ల పేర్లు పరిశీలిస్తున్నట్లు గతంలో ప్రచారం సాగింది. చివరికీ సాయిపల్లవిని ఫిక్స్ చేసినట్లు సమాచారం అందుతోంది.
![](https://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/10/04144625/267633336_630071754692252_4738054455767178687_n-1024x1024.jpg)
రామయాణం చిత్రాన్ని బాలీవుడ్ డైరెక్టర్ నితీశ్ కుమార్ తెరకెక్కించనున్నట్లు బీటౌన్లో టాక్ వినిపిస్తోంది. అంతేగాక ఈ చిత్రం మూడు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
![](https://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/10/04144604/50264417_2029862647049850_1325830612991553091_n-819x1024.jpg)
ఈ చిత్రంలో కేజీఎఫ్ హీరో యష్ రావణుడి పాత్రను పోషించనున్నట్లు బాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఆస్కార్ విన్నింగ్ కంపెనీ ‘DNEG’.. ఈ మూవీకి VFX అందించనున్నట్లు సమాచారం. దీంతో ఇప్పటి నుంచే ఈ చిత్రంపై భారీ అంచనాలు పెరిగిపోయాయి.
![](https://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/09/14115850/53759561_1698970170237220_471493802597915197_n-820x1024.jpg)
సహజంగా నటించి ఏ పాత్రకైనా ఒక మంచి విలువను తీసుకొచ్చే సాయి పల్లవి.. ఇక సీతగా ఆ క్యారెక్టర్కు ఎంతటి నిండుతనాన్ని తీసుకొస్తుందే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఈ పాత్రకు సంబంధించి మేకర్స్ సాయిపల్లవిని సంప్రదించగా నటించేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
![](https://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/10/04144653/268106318_282458237053265_2239349481765386343_n-1024x1024.jpg)
ఇన్నాళ్లు దక్షిణాది సినిమాలకే పరిమితమైన ఈ హైబ్రిడ్ పిల్ల.. బాలీవుడ్లో మరో సినిమాను సైతం చేస్తోంది. బాలీవుడ్ విలక్షణ నటుడు ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్తో ఈ భామ నటిస్తోంది. ఈ సినిమాను సునీల్ పాండే డైరెక్ట్ చేస్తున్నారు.
![](https://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/10/04144734/268416769_1586884978331512_495580608199167047_n-822x1024.jpg)
ఇదిలా ఉంటే.. సాయిపల్లవికి పెళ్లి అయ్యిందంటూ ఇటీవల తెగ రూమర్స్ వచ్చాయి. తమిళ దర్శకుడు వేణు ఊడుగులను ఆమె వివాహం చేసుకున్నట్లు నెట్టింట విస్తృతంగా ప్రచారం జరిగింది. వారు దండలతో ఉన్న ఫొటోలు తెగ వైరల్ అయ్యాయి.
![](https://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/09/14115547/280441348_5230508103653830_6565027996706870521_n-819x1024.jpg)
పెళ్లిపై జరుగుతున్న రూమర్స్పై సాయిపల్లవి స్పందించింది. ఓ సినిమా పూజా కార్యక్రమంలో దిగిన ఫొటోలను క్రాప్ చేసి డబ్బుకోసం నీచంగా ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడింది. పనికిమాలిన విషయాలపై స్పందించడం నిజంగా బాధగా ఉందని పేర్కొంది. ఒక వ్యక్తికి ఇలాంటి ఇబ్బందిని కలిగించడం నిజంగా నీచమైన చర్యేనని మండిపడింది.
![](https://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/10/04145120/19985223_1915787538709638_8265681148315697152_n-819x1024.jpg)
తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదా సినిమాతో సాయిపల్లవి పరిచయమైంది. అంతకు ముందు ఈమె మలయాళంలో ’ప్రేమమ్’ సినిమాలో మలర్గా పలకరించింది. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో సాయి పల్లవి సినిమాలు చేస్తోంది.
![](https://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/10/04144821/280301209_570196461091251_4453703922030746803_n-819x1024.jpg)
ప్రస్తుతం తెలుగులో నాగ చైతన్యతో కలిసి ఓ సినిమా చేస్తోంది ఈ భామ. చందు మొండేటి దర్శకుడు. గీతా ఆర్ట్స్ బ్యానర్పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. కొన్ని నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమా వస్తోందని తెలుస్తోంది. నాగ చైతన్యతో సాయి పల్లవికి ఇది రెండో సినిమా. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన లవ్ స్టోరీ తెలుగులో సూపర్ హిట్ అయింది.
![](https://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/09/14115950/Capture-7.jpg)