• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బోల్డ్ సీన్లలో పాయల్ రాజ్‌పూత్ అరాచకం

    అజయ్ భూపతి డైరెక్షన్‌లో వస్తున్న మంగళవారం మూవీ నుంచి ట్రైలర్ రిలీజైంది. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. ట్రైలర్‌ను బట్టి చూస్తుంటే ప్రతి మంగళవారం ఓ ఊరిలో ఆడపిల్లలు చనిపోవడం మిస్టరీగా కనిపించింది. హీరోయిన్ పాయల్ రాజ్‌పూత్ బోల్డ్ సీన్లలో యాక్ట్ చేసింది. కాగా ఈ సినిమా నవంబర్ 17న విడుదల కానుంది. ఈ సినిమాకు కాంతార మ్యూజిక్ డైరెక్టర్ అంజనీశ్ లోక్‌నాథ్ సంగీతం అందించారు. ట్రైలర్ అయితే మంచి హైప్‌ను క్రియేట్ చేసింది అని చెప్పవచ్చు.

    రెడ్‌మీ ఫోన్లలో ఇవే బెస్ట్ స్మార్ట్ ఫోన్లు!

    మెుబైల్‌ ప్రియులు రెడ్‌మీ ఫోన్స్‌ కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే చాలా మందికి రెడ్‌మీ ఫోన్‌ కొనాలని ఉన్నప్పటికీ ఏది తీసుకోవాలో తెలియక సతమతమవుతుంటారు. ఈ నేపథ్యంలో రెడ్‌మీలోని టాప్‌ రేటెడ్‌ మెుబైల్స్‌ను YouSay మీ ముందుకు తీసుకొచ్చింది. మరి ఆ ఫోన్స్‌ ప్రత్యేకతలు, ఫీచర్లు, ధర చూసి ఏదీ కొనాలో మీరే డిసైడ్ చేసుకోండి. ఫోన్ల వివరాలు ఆఫర్లు తెలుసుకునేందుకు పైన YouSay Webపై క్లిక్ చేయండి.

    RRR నిర్మాణ సంస్థ బ్యానర్‌లో నాని కొత్త సినిమా

    నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో మరో సినిమా రానుంది. అయితే ఈ చిత్రాన్ని RRR మూవీ మేకర్స్ DVV ఎంటర్‌టైన్‌ నిర్మించనుంది. నాని31 వర్కింగ్ టైటిల్‌తో సినిమాను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు. గతంలో వీరిద్దరి కాంబోలో ‘అంటే సుందరానికీ’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా.. బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్లు మాత్రం రాలేదు. మరోవైపు హీరో నాని హాయ్‌ నాన్న సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను వచ్చే నెలలో విడుదల చేయాలని … Read more

    మొసలిని కరెంట్ ఆఫీసులో వదిలిన రైతులు

    కర్ణాటకలో కరెంట్ కష్టాలపై రైతులు పెద్దఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. వ్యవసాయానికి కనీసం 5 గంటల పాటు కూడా నాణ్యమైన కరెంట్ ఇవ్వడం లేదని వాపోతున్నారు. మాండ్యకు చెందిన రైతులు మొసలిని తీసుకొచ్చి కరెంట్ ఆఫీసులో వదిలి పెట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. కరెంట్ ఇవ్వకపోతే పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకుంటామని మరికొంతమంది రైతులు అధికారులను హెచ్చరించారు. కనీసం 5 గంటల కరెంట్ ఇవ్వట్లేదు అంటూ గుల్బర్గా ఎలక్ట్రిసిటీ సప్లై ఆఫీసు మీద దాడి చేశారు. https://x.com/TeluguScribe/status/1715613238430458106?s=20

    పోలీస్ ఉద్యోగం ఒక సవాల్: సీఎం జగన్

    పోలీసు అమరవీరు సంస్మరణ వేడుకల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “విధి నిర్వహణలో ప్రాణం వదిలిన పోలీసు కుటుంబాలకు ప్రభుత్వం తోడుగా ఉంటుంది. పోలీస్‌ ఉద్యోగం ఒక సవాల్.. ప్రస్తుత రోజుల్లో నేరం తన రూపాన్ని మార్చుకుంటోంది. కొత్త టెక్నాలజీ వల్ల సైబర్ సెక్యూరిటీ నుంచి డేటా చోరీ వరకు నేరాలు జరుగుతున్నాయి. పోలీసులు అప్డేట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. సంఘ విద్రోహ శక్తుల నుంచి అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. వాటన్నింటికి పోలీసు వ్యవస్థ సిద్ధంగా ఉండాలి” అని సూచించారు.

    నేడు టీబీజేపీ ఫస్ట్ లిస్ట్?

    తెలంగాణ బీజేపీ అభ్యర్థుల ఎంపికపై ఇంకా కసరత్తు కొనసాగుతూనే ఉంది. ఈరోజు టీబీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనున్నారు. 55 మందితో ఫస్ట్ లిస్ట్ విడుదల చేసే అవకాశం ఉంది. బీసీలకు, మహిళలకు ఎక్కువ సీట్లు కేటాయించే ఛాన్స్ ఉంది. మరోవైపు గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మీద సస్పెన్షన్ వేటు బీజేపీ ఎత్తివేయనుంది. ఆయనకు గోషామహల్ టికెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

    భర్తను రూ.5 లక్షలకు అమ్మేసిన భార్య

    పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్న భర్తను మరో మహిళకు భార్య అమ్మెసిన ఘటన కర్ణాటకలోని మాండ్యలో జరిగింది. స్థానికంగా ఉండే ఓ మహిళతో ఆ గృహిణి భర్త సన్నిహితంగా ఉండేవాడు. ఓ రోజు స్థానిక మహిళతో తన భర్త పడకగదిలో ఉండటం గృహిణి గుర్తించింది. ఇద్దర్ని పంచాయతీకి లాగింది. తన దగ్గర రూ.5 లక్షలు తీసుకున్నాడని వాటిని తిరిగిస్తే అతన్ని అప్పగిస్తానని మహిళ తెలిపింది. దీనికి ఒప్పుకోని గృహిణి ఆ రూ.5 లక్షలు తనకే మనోవర్తిగా ఇస్తే తన భర్తను వదిలిపెడతానని తెలిపింది. దీనికి … Read more

    టాస్ గెలిచిన నెదర్లాండ్

    లక్నో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ నెగ్గిన నెదర్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. జట్ల వివరాలు: శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుసల్ పెరీరా, కుసల్ మెండిస్(w/c), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దుషన్ హేమంత, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, దిల్షన్ మధుశంక నెదర్లాండ్స్: విక్రమ్‌జిత్ సింగ్, మాక్స్ ఓడౌడ్, కోలిన్ అకెర్‌మాన్, బాస్ డి లీడే, సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, తేజా నిడమనూరు, స్కాట్ ఎడ్వర్డ్స్(w/c), లోగాన్ వాన్ బీక్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, ఆర్యన్ … Read more

    గగన్ యాన్ ప్రయోగం సక్సెస్

    ఇస్రో చేపట్టిన గగన్ యాన్ ప్రయోగం సక్సెస్ అయింది. రోదసి నుంచి గగన్ యాన్ మాడ్యూల్‌ను పారాచ్యూట్ సాయంతో విజయవంతంగా శాస్త్రవేత్తలు కిందకు దింపారు. అంతకుముందు రాకెట్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయోగం కాసేపు నిలిచిపోయింది. శాస్త్రవేత్తలు సరి చేయడంతో మరోసారి ఇస్రో గగన్ యాన్ ప్రయోగాన్ని చేపట్టింది. సరిగ్గా ఉ.10 గంటలకు TV-D1 సింగిల్ స్టేజ్ లిక్విడ్ రాకెట్ నిప్పులు కక్కుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. ఉదయం 8.30 గంటలకు శ్రీహరి కోట నుంచి ప్రయోగం మొదలు పెట్టగా… సాంకేతిక లోపంతో ప్రయోగం తాత్కాలికంగా … Read more

    24 గంటల్లో రూ. 42 కోట్లు సీజ్

    అసెంబ్లీ ఎన్నికల వేళ.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా రూ.42 కోట్లకు పైగా డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన విస్తృత తనిఖీల్లో ఇంత మొత్తం బయటపడినట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. మరోవైపు రాష్ట్ర అబ్బారీ శాఖ సైతం రూ.1,68,45,982 విలువైన మద్యం పట్టుకుంది. ఎన్నికల కోడ్ విడుదలైన తర్వాత మొత్తం రూ.281 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది.