• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భారత్ కొంప ముంచిన కేఎల్

    భారత వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ కీలక సమయంలో క్యాచ్ నేలపాలు చేసి టీమిండియా ఓటమికి ప్రధాన కారకుడయ్యాడు. 43వ ఓవర్లో మొహిదీ హసన్ ఇచ్చిన సునాయాస [క్యాచ్‌](url)ను రాహుల్ జారవిడిచాడు. అప్పటికి బంగ్లాకు ఇంకా 32 పరుగులు కావాలి. క్యాచ్ పట్టి ఉంటే అప్పుడే ఇండియా మ్యాచ్ గెలిచేది. రాహుల్ ఇచ్చిన లైఫ్‌తో చెలరేగిపోయిన హసన్ ఒంటిచేత్తో తన జట్టుకు విజయాన్నందించాడు. మరో వైపు మిగతా బారత ఫీల్డర్లు కూడా చెత్త ఫీల్డింగ్ చేయడంతో బంగ్లాదేశ్ సునాయాసంగా మ్యాచ్ గెలిచింది. We lost … Read more

    తల్లి ఆశీర్వాదం తీసుకున్న మోదీ

    గుజరాత్‌లోని గాంధీనగర్‌లో తన తల్లి హీరాబెన్‌ను భారత ప్రధాని నరేంద్ర మోదీ కలిశారు. గుజరాత్ రెండో దశ ఎన్నికల నేపథ్యంలో తన తల్లి [ఆశీర్వాదం](url) తీసుకున్నారు. ఆమె పక్కన కూర్చుని తేనీరు సేవించారు. దాదాపు అర్ధ గంట పాటు తన తల్లి ముచ్చటిస్తూ కనిపించాడు. గత జూన్‌లో హీరాబెన్ 99 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్బంగా ఆమె ఆశీస్సులు తీసుకున్నారు. కాగా సోమవారం జరిగే రెండో విడత ఎన్నికల్లో సబర్మతీ నియోజకవర్గంలో మోదీ తన ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. #Gandhinagar : Pm Narendra Modi … Read more

    దేవుని చెంత ప్రాణాలొదిలిన భక్తుడు; వీడియో వైరల్

    దేవుడి చెంత ఓ వ్యక్తి ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని కట్నీ జిల్లాలో చోటుచేసుకుంది. మొహానీ అనే వ్యక్తి దగ్గర్లోని సాయిబాబా ఆలయానికి తరచూ వెళ్తుంటాడు. తాజాగా ఎప్పటిలాగే గుడికి వెళ్లిన మొహానీ దేవుడి పాదాలపై పడి నమస్కరించాడు. ఎంతసేపటికీ ఆయన పైకి లేవకపోవడంతో ఆలయ సిబ్బంది ఆస్పత్రికి తరలించగా గుండెపోటుతో మరణించినట్లు డాక్టర్లు ద్రువీకరించారు. ఇందుకు సంబంధించిన[ వీడియో](url) వైరల్‌గా మారింది. मध्यप्रदेश कटनी साईं मंदिर में बाबा के चरणों में टेका मत्था, फिर सिर नहीं … Read more

    శ్రీవారి సేవలో జాన్వీ కపూర్

    దివంగత శ్రీదేవి కుమార్తె, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ సమయంలో ఆమె స్వామివారిని దర్శించుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో ఆమె దర్శనానికి వచ్చారు. ఆలయ సిబ్బంది జాన్వీకి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కాగా జాన్వీ కపూర్ రావడంతో తిరుమలలో సందడి నెలకొంది. ఆమెతో సెల్ఫీలు దిగేందుకు భక్తులు ఎగబడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

    డజను గోల్స్‌ను చూసి తీరాల్సిందే

    ఫిఫా వరల్డ్‌కప్ ప్రారంభమైన 12వ రోజు గోల్స్ వర్షం కురిసింది. ఆ రోజు మొత్తం 4 మ్యాచ్‌లు జరగ్గా 12 గోల్స్ నమోదయ్యాయి. ప్రపంచ అగ్ర శ్రేణి జట్టు బెల్జియం ఓటమితో ఇంటిదారి పట్టింది. తన చివరి మ్యాచ్‌లో క్రొయేషియాతో 0-0తో ఓడిపోయి టోర్నీ నుంచి వైదొలిగింది. మరోవైపు అర్జెంటీనా ముందడుగు వేసింది. పోలాండ్‌ను ఓడించి ప్రి క్వార్టర్స్‌కు చేరింది. ఇక మెక్సికోను దురదృష్టం వెంటాడింది. చివరి మ్యాచ్‌లో గెలిచినా వరల్డ్‌కప్ నుంచి తప్పుకోక తప్పలేదు.

    కశ్మీర్ లోయల్లో నారా బ్రాహ్మణి బైక్ రైడ్

    టీడీపీ అధినేత చంద్రబాబు కోడలు, నందమూరి బాలక్రిష్ణ కుమార్తె నారా బ్రాహ్మణి కశ్మీర్‌లో సాహస యాత్రలు చేస్తోంది. లడ్డాక్‌లోని పర్వతాలపై తన ‘జావా ఎజ్ది’ బైక్‌పై రైడింగ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె నడిపై బైక్ అధిక బరువు ఉన్నా సునాయాసంగా నడుపుతోంది. ఆమె బైక్ కలర్ కూడా పసుపు రంగులోనే ఉండటం విశేషం. కాగా బ్రాహ్మణి హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, మరోవైపు తన భర్త నారా లోకేశ్‌కు రాజకీయంగా అండగా ఉంటోంది.

    ‘వంద మందితో రండి.. సీఎం అవ్వండి’

    సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ యూపీ డిప్యూటీ సీఎంలకు ఓపెన్ [ఆఫర్ ](url)ఇచ్చారు. ఇద్దరిలో ఎవరైనా సరే బీజేపీ నుంచి వంద మంది ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి తీసుకొస్తే సీఎం పదవి ఇస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎంలు కేశవ్ మౌర్య, బ్రజేష్ పాఠక్‌లకు అఖిలేష్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. కాగా ప్రస్తుతం యూపీలో బీజేపీ కూటమికి 254 సీట్లు ఉన్నాయి. ఎస్పీ కూటమికి 118 సీట్లు ఉన్నాయి. అక్కడ అధికారం చేపట్టాలంటే 202 సీట్లు ఉండాలి. #WATCH | There … Read more

    స్టేజ్‌పై గౌతమ్ యాక్టింగ్; అచ్చం ‘యువరాజు’ లాగే

    సూపర్‌స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ స్టేజ్‌పై సందడి చేశాడు. తాజాగా తను చదివే స్కూల్లో స్నేహితులతో కలసి నాటకం వేశాడు. ఇందులో గౌతమ్ యాక్టివ్‌గా డ్యాన్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన [వీడియో](url)ను నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్‌గా మారింది. కాగా వీడియో చూసిన నెటిజన్లు గౌతమ్‌ తన తండ్రి మహేష్ బాబులాగే భవిష్యత్తులో సూపర్‌స్టార్ అవుతాడని అంటున్నారు. అచ్చం యువరాజు చిత్రంలో మహేష్‌బాబులా ఉన్నాడని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. View this post on Instagram A post … Read more

    థ్రిల్లింగ్‌గా ‘ముఖచిత్రం’ ట్రైలర్

    యంగ్ డైరెక్టర్ సందీప్ రాజ్ తెరకెక్కించిన ‘ముఖచిత్రం’ ట్రైలర్‌ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. ఇది లవ్ స్టోరీయో.. లేదా థ్రిల్లరో కాదు.. స్పోర్ట్స్ డ్రామా అంటూ సాగే డైలాగ్ థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. ఈ సినిమాలో మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. మూవీలో వికాస్ వశిష్ఠ, ప్రియా వడ్లమాని, చైతన్యరావ్‌లు హీరో హీరోయిన్లుగా నటించారు. పాకెట్ మంకీ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను తెరకెక్కించింది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 9న థియేటర్లలో విడుదల చేస్తున్నారు.

    చార్మినార్ ఎక్కడ ఉందో తెలుసా?

    ఓ అమాయక యూట్యూబర్ చేసిన పనికి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. సదరు యూట్యూబర్ విలేజ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు. అక్కడ చార్మినార్ దగ్గర రీల్స్ తీసుకుని సోషల్ మీడియాలో [వీడియో](url) పోస్ట్ చేశాడు. అంతే ఆ వీడియో తెగ వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే చార్మినార్.. చార్మినార్ వద్ద ఉందంటూ యూట్యూబర్ సీరియస్‌గా చెబుతాడు. దీనిపై సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్, జోక్స్ పేలుతున్నాయి. యూట్యూబర్ చేసిన పనికి పగలబడి నవ్వుకుంటున్నారు. Breaking News From Charminar! pic.twitter.com/5HPHB7OFMn — Hi … Read more