• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సీఎం కేసీఆర్‌కు షర్మిల సవాల్

    వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ సీఎం కేసీఆర్‌కు సవాల్ విసిరారు. రాష్ట్రంలో తనతోపాటు కేసీఆర్ కూడా [పాదయాత్ర](url) చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఒక వేళ ప్రజా సమస్యలుంటే కేసీఆర్ సీఎం పదవి వదిలి రాజకీయ సన్యాసం తీసుకోవాలని.. సమస్యలు లేకపోతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. తెలంగాణలో చాలా సమస్యలు ఉన్నాయని.. కానీ కేసీఆర్, కేటీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. దమ్ముంటే తన సవాల్‌ను స్వీకరించాలన్నారు. #WATCH | Today I challenge Telangana CM KCR to walk … Read more

    ఆకట్టుకుంటున్న ‘ఏలేలో ఏలేలో’ పాట

    ‘శాకుంతలం’ నుంచి మరో పాట విడుదలైంది. ‘ఏలేలో ఏలేలో ఏలే యాలా’ అంటూ సాగే గీతాన్ని అనురాగ్ కుల్‌కర్ణి ఆలపించారు. చైతన్య ప్రసాద్ లిరిక్స్ అందించగా మణిశర్మ స్వరాలు సమకూర్చారు. ఆహ్లాదంగా సాగుతున్న ఈ పాట సంగీత అభిమానులను ఆకట్టుకుంటోంది. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తుండగా నీలిమ గుణ నిర్మాతగా వ్యవహరించారు. శకుంతలగా సమంత నటిస్తోంది. ఈ సినిమాను ఫిబ్రవరి 17న విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.

    భావోద్వేగంగా ‘బ్రహ్మానందం’ గ్లింప్స్

    క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన ‘రంగమార్తండ’ సినిమా నుంచి బ్రహ్మానందం ఫస్ట్ లుక్, గ్లింప్స్ విడుదలైంది. ఎప్పుడూ కడుపుబ్బా నవ్వించే బ్రహ్మి.. ఈసారి తెరపై ఎమోషనల్‌గా కనిపించారు. భక్తి, బాధ, పశ్చాత్తాపం కలగలిపి భావోద్వేగపూరితమైన డైలాగ్‌తో ప్రేక్షకుల హృదయాలను కట్టిపడేశారు. రంగస్థల నటుల జీవితం ఆధారంగా మరాఠీలో తెరకెక్కిన ‘నటసామ్రాట్’ సినిమాకు ఇది రీమేక్‌గా తెరకెక్కుతోంది. బ్రహ్మానందం పుట్టినరోజు సందర్భంగా గ్లింప్స్‌ని రిలీజ్ చేశారు.

    సీఎం జగన్‌ VS వైసీపీ ఎమ్మెల్యే

    రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున తాను పోటీ చేయదలుచు కోలేదని ఏపీలోని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్ది బాంబు పేల్చారు. వైఎస్సార్‌సీపీ నేతలు, ఇంటిలిజెన్స్ అధికారులను ఆయన విమర్శించారు. తన ఫోన్ సీఎం జగన్ [ట్యాపింగ్ ](url)చేయిస్తున్నారని ఆరోపించారు. కొద్ది రోజులుగా తనపై ఇంటిలిజెన్స్ అధికారులు నిఘా పెట్టారని చెప్పారు. అనుమానం ఉన్న చోట ఉండాలని తనకు లేదన్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేయాలని ఉందని పేర్కొన్నారు. 35 మంది ఎమ్మెల్యేలు, 4 ఎంపీలు ఇద్దరు మంత్రులు నాకు … Read more

    ఒక రోజు ముందుగానే బాలయ్య, పవన్ ఎపిసోడ్

    ‘ఆహా’లో ప్రసారం కానున్న బాలయ్య, పవన్ కళ్యాణ్ అన్‌స్టాపబుల్ షో ఎపిసోడ్‌పై ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇదివరకే విడుదలైన టీజర్‌కి భారీగా స్పందన లభించింది. అయితే, ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్ చెబుతూ ఆహా కీలక ప్రకటన చేసింది. ఒకరోజు ముందుగానే పవర్ ఎపిసోడ్‌ని ప్రసారం చేయనున్నట్లు వెల్లడించింది. ఫిబ్రవరి 2న ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. తొలుత ఫిబ్రవరి 3న ఎపిసోడ్‌ని విడుదల చేయాలని భావించింది. ఫ్యాన్స్ ఆసక్తి, కోరిక మేరకు ఆహా ఒక రోజు ముందుకు జరిపింది.

    కేసీఆర్‌, కేటీఆర్‌కు సింగర్ శ్రీరామచంద్ర విన్నపం

    ప్రముఖ సింగర్ శ్రీరామ చంద్ర ఓ ప్రజాప్రతినిధి తీరుపట్ల [అసహనం](url) వ్యక్తం చేశాడు. ఓ పొలిటిషన్ వల్ల తన ఫ్లైట్‌ మిస్సయిందనిపేర్కొన్నాడు. ఇలాంటివి జరగకుండా చూడాలని సీఎం కేసీఆర్, కేటీఆర్‌లను కోరాడు. “ ఓ ఈవెంట్‌ కోసం నేను గోవా వెళ్లాలి. ఎయిర్‌పోర్ట్‌కు వచ్చే దారిలో పీవీ నరసింహారావు ఫ్లైఓవర్ బ్లాక్ చేశారు. పొలిటిషన్‌ కోసం రోడ్డు బ్లాక్ చేశారు. అందరిని కింద నుంచి పంపించడంతో ఆలస్యం అయింది. నాతో పాటు 15 మంది ఫ్లైట్ మిస్సయ్యారు. వీటి గురించి ఆలోచించాలి” అన్నాడు. 15 … Read more

    అమర్‌రాజా ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం

    [VIDEO:](url)చిత్తూరు-మోర్దానపల్లె అమర్‌రాజా ఫ్యాక్టరీలో సోమవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు అంటుకున్నాయి. భారీగా మంటలు ఎగసిపడగా.. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగనప్పటికీ భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు తెలిపారు. మంటల్లో చిక్కుకున్న కంపెనీ సిబ్బందిని అగ్నిమాపక సిబ్బంది సురక్షిత ప్రదేశానికి తరలించారు. ? అమర్ రాజా ఫ్యాక్టరీ, యాదమరి మండలం మోర్ధానపల్లె ViDeo : chandu__chowdary#amarraja #fireaccident #chittoor #chittoordistrict pic.twitter.com/nmqwWW3fqS — Chittoor Central (@Chittoorcentral) … Read more

    యూట్యూబ్‌లో ‘పవర్’ ప్రోమో సునామీ

    బాలయ్య, పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ప్రోమో యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఈ ప్రోమో టాప్ ప్లేసులో ట్రెండ్ అవుతోంది. ప్రోమో విడుదలైన 18 గంటల్లోనే 3మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ ఎపిసోడ్‌ పార్ట్ 1ని ఫిబ్రవరి 3న ఆహాలో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ ప్రోమోలో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాల గురించి బాలయ్య ఆరా తీశారు. త్రివిక్రమ్‌తో స్నేహం, చరణ్ పెంపకం వంటివాటి గురించి పవన్ సరదాగా ఆన్సర్ చేశారు.

    రిపబ్లిక్‌ డే ఎందుకు చేసుకుంటారో వీరి మాటలు వినండి!

    భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజుకు గుర్తుగా యేటా దేశంలో జనవరి 26ను గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ రోజు ప్రభుత్వ సెలవు. కానీ చాలా మందికి జనవరి 26 ప్రాముఖ్యత తెలియదు. చదువుకున్న వారిలోనూ ఇది కనిపించడం ఆశ్చర్యకరంగా అనిపిస్తోంది. https://youtube.com/watch?v=ilHOT5BV42Q

    స్నేహితులే.. హంతకులు; జియాగూడ మర్డర్ కేసు

    జియాగూడ మర్డర్ కేసులో స్నేహితులే హంతకులని పోలీసులు నిర్ధారించారు. అక్షయ్, సోనూ, టిల్లూ అనే ముగ్గురు యువకులు జంగం సాయినాథ్‌ను హత్య చేసినట్లు గుర్తించారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా కోఠికి చెందిన సాయినాథ్‌ను ఆదివారం పట్టపగలు నడిరోడ్డుపై [హత్య](url) చేసిన సంగతి తెలిసిందే. వేట కొడవళ్లతో వెంటాడి మరీ నరికి చంపి మూసీ నదిలో దూకి పారిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 24 గంటల్లోనే నిందితులను అదుపులోకి తీసుకున్నారు. Murder in broad daylight on main road tarnishes … Read more