నటి ఖుష్భుకు అరుదైన గౌరవం
నటి ఖుష్బు అరుదైన గౌరవం దక్కించుకుంది. తిరుచూరులోని విష్ణు మాయ దేవాలయంలో ఏటా నిర్వహించే నారి పూజ కార్యక్రమంలో ఈసారి ఖుష్బు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆమెకు అయ్యవార్లు ప్రత్యేక పూజలు చేశారు. విష్ణు మాయ ఆలయంలో పూజకు ఎంపిక కావడం చాలా అదృష్టంగా భావిస్తారు. ఏటా కొంత మంది మహిళలను పూజ కోసం ప్రత్యేకంగా ఆహ్వానిస్తారు. ఇది తనకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నట్లు ఖుష్బు తెలిపింది. ఈమేరకు ఫొటోలను షేర్ చేసింది.